శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, రాపూరు మండలం, పెంచలకోన క్షేత్రం నందు శ్రీవార్ల జన్మ నక్షత్రం (స్వాతి నక్షత్రం) సందర్భముగా ఉదయం గం.4.00 శ్రీ స్వామి వారికి అభిషేకం, చందనాలంకారము, గం.9.00. కి శాంతి హోమం మ.12.00 గం లకు శ్రీ వార్లకు కళ్యాణోత్సవం,మరియు సాయంత్రం గం.5.30. లకు బంగారు గరుడ వాహన సేవ ప్రధానార్చకులు,వేదపండితుల మంత్రోచ్ఛరణలతో మంగళ వాయిద్య నడుమ అత్యంత వైభవంగా నిర్వహించడమైనది భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా క్యూలైన్ల ఏర్పాట్లు, మంచి నీరు సరఫరా,అన్నదానం మొదలగు కార్యక్రమాలు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి గారి పర్యవేక్షనలో నిర్వహించడం జరిగినది.


