అత్యధిక ఉష్ణోగ్రతలు:- గుంటూరు జిల్లా ములుకుదురులో అత్యధికంగా 47.7°C ఉష్ణోగ్రత నమోదైంది. గురజాలలో 47.6°C, కంచికచర్ల మరియు ఇంకొల్లులో 47.3°C నమోదయ్యాయి. 14 జిల్లాల్లోని 125 మండలాల్లో 44°C దాటింది.
వడగాల్పుల హెచ్చరిక:- బుధవారం 68 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 93 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. గురువారం 81 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 203 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నాయి.
ప్రాణనష్టం: వడదెబ్బ కారణంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 29 మంది మరణించారు. మృతులలో కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, పశ్చిమ గోదావరి మరియు ఏలూరు జిల్లాలకు చెందిన పలువురు వృద్ధులు, పౌరులు ఉన్నారు.
వర్ష సూచన: – ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉండడం వల్ల బుధవారం చిత్తూరు జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో చెదురుమదురు వానలు కురిసే అవకాశం ఉంది


