గన్నవరం పున్నమి ప్రతినిధి సురేష్
కృష్ణాజిల్లా,గన్నవరం మండలం,కేసరపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి సి.వి.ఎల్.ఆర్.ఎస్.వి.ప్రసాద్ శానిటేషన్ సిబ్బందికి వేసవికాలంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వేసవి ఎద్దడి కారణంగా కేసరపల్లి గ్రామపంచాయతీ శానిటేషన్ సిబ్బంది ఆరోగ్య దృష్ట్యా పని సమయములు ఉదయం 6 గంటల నుండి 10:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు పారిశుద్ధ్య కార్మిక సిబ్బంది పని వేళలు మార్పులు చేశామని, అదేవిధంగా ప్రభుత్వం నుండి వచ్చే ఐ.వి.ఆర్.ఎస్ కాల్స్ గురించి వివరించి తగు సూచనలు ఇచ్చామని తెలిపారు.

