ఖమ్మం, ఏప్రిల్ 19: రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించిన ఖమ్మం సర్వజ్ఞ జూనియర్ కళాశాల విద్యార్థులను జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి కే. రవిబాబు అభినందించారు.
ఎంపీసీ విభాగంలో 467 మార్కులు సాధించిన వై. వెన్నెల, ఎన్. సాయిమణికంఠర్, బి. తరుణ్, వై. అనితలను ప్రత్యేకంగా ప్రశంసించారు. అలాగే 466 మార్కులు సాధించిన జె. అనన్య వెంకట్, జి. జానకీరామ్, వై. గీత మాధురిలను అభినందించారు.
బైపీసీ విభాగంలో ఐ. సాయిదివ్యనాథ్ (437), జ్ఞానప్రసూనాంబి (435), ఎన్. అభినందిత (434) ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు తెలిపారు.
కళాశాల చైర్మన్ ఆర్వీ నాగేంద్రకుమార్ మాట్లాడుతూ, రెండుదశాబ్దాలుగా ఉత్తమ విద్యాబోధనతో సర్వజ్ఞ క్యాంపస్ అద్భుత ఫలితాలు సాధిస్తోందన్నారు. కార్యక్రమంలో అకాడమిక్ డీన్, ఫిజిక్స్ ఫ్యాకల్టీ జార్జ్, కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు పాల్గొన్నారు.

ఖమ్మం సర్వజ్ఞ జూనియర్ కళాశాలకు రాష్ట్ర స్థాయిలో మెరుగైన ఫలితాలు
ఖమ్మం, ఏప్రిల్ 19: రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించిన ఖమ్మం సర్వజ్ఞ జూనియర్ కళాశాల విద్యార్థులను జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి కే. రవిబాబు అభినందించారు. ఎంపీసీ విభాగంలో 467 మార్కులు సాధించిన వై. వెన్నెల, ఎన్. సాయిమణికంఠర్, బి. తరుణ్, వై. అనితలను ప్రత్యేకంగా ప్రశంసించారు. అలాగే 466 మార్కులు సాధించిన జె. అనన్య వెంకట్, జి. జానకీరామ్, వై. గీత మాధురిలను అభినందించారు. బైపీసీ విభాగంలో ఐ. సాయిదివ్యనాథ్ (437), జ్ఞానప్రసూనాంబి (435), ఎన్. అభినందిత (434) ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు తెలిపారు. కళాశాల చైర్మన్ ఆర్వీ నాగేంద్రకుమార్ మాట్లాడుతూ, రెండుదశాబ్దాలుగా ఉత్తమ విద్యాబోధనతో సర్వజ్ఞ క్యాంపస్ అద్భుత ఫలితాలు సాధిస్తోందన్నారు. కార్యక్రమంలో అకాడమిక్ డీన్, ఫిజిక్స్ ఫ్యాకల్టీ జార్జ్, కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు పాల్గొన్నారు.

