శ్రీకాళహస్తి, ఏప్రిల్ 12 (పున్నమి న్యూస్) పవన్నవారి కండ్రిగ గ్రామంలో ప్రజల సంక్షేమ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో, తిరుపతిలోని రష్ బహుళ వైద్య నిపుణుల ఆసుపత్రి సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కేవీబీ పురం మండలంలోని పవన్నవారి కండ్రిగ గ్రామ పాఠశాలలో ఆదివారం నాడు ప్రారంభమైన ఈ శిబిరానికి గ్రామస్తుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ శిబిరంలో వైద్యుల బృందం పాల్గొని కిడ్నీలో రాళ్లు, కడుపు నొప్పి, నడుము నొప్పి, హెర్నియా, మూలవ్యాధి, మూత్ర సంబంధిత వ్యాధులు, మహిళలకు సంబంధించిన సమస్యలు, ఎముకల వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. అదనంగా రక్తపోటు, మధుమేహం పరీక్షలు కూడా నిర్వహించారు. తిరుపతి రష్ ఆసుపత్రి ఆధ్వర్యంలోని వైద్య బృందంతో పాటు శ్రీకాళహస్తిలోని ఎస్వీ దంత ఆసుపత్రి వైద్యులు కూడా సేవలు అందించారు. ఈ అవకాశాన్ని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరారు.

గ్రామ ప్రజలకు ఆరోగ్య సేవలు అందుబాటులో ఉచిత వైద్య శిబిరం
శ్రీకాళహస్తి, ఏప్రిల్ 12 (పున్నమి న్యూస్) పవన్నవారి కండ్రిగ గ్రామంలో ప్రజల సంక్షేమ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో, తిరుపతిలోని రష్ బహుళ వైద్య నిపుణుల ఆసుపత్రి సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కేవీబీ పురం మండలంలోని పవన్నవారి కండ్రిగ గ్రామ పాఠశాలలో ఆదివారం నాడు ప్రారంభమైన ఈ శిబిరానికి గ్రామస్తుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ శిబిరంలో వైద్యుల బృందం పాల్గొని కిడ్నీలో రాళ్లు, కడుపు నొప్పి, నడుము నొప్పి, హెర్నియా, మూలవ్యాధి, మూత్ర సంబంధిత వ్యాధులు, మహిళలకు సంబంధించిన సమస్యలు, ఎముకల వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. అదనంగా రక్తపోటు, మధుమేహం పరీక్షలు కూడా నిర్వహించారు. తిరుపతి రష్ ఆసుపత్రి ఆధ్వర్యంలోని వైద్య బృందంతో పాటు శ్రీకాళహస్తిలోని ఎస్వీ దంత ఆసుపత్రి వైద్యులు కూడా సేవలు అందించారు. ఈ అవకాశాన్ని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరారు.

