జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో రోడ్ సేఫ్టీ వారియర్స్ బృందాలతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు దుత్తలూరు ఎస్ ఐ ఆదిలక్ష్మి జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల, ఐపీఎస్ . ఆదేశాల మేరకు ముఖ్య కూడళ్ళు, జాతీయ రహదారులు, ప్రమాద ప్రాంతాల్లో ప్రత్యేక ప్రచారాలు చేపడుతున్నారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపకూడదనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని అధికారులు సూచించారు. పోలీసులు, ప్రజలు కలిసికట్టుగా పని చేస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్ సేఫ్టీ వారియర్స్తో అవగాహన కార్యక్రమాలు
జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో రోడ్ సేఫ్టీ వారియర్స్ బృందాలతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు దుత్తలూరు ఎస్ ఐ ఆదిలక్ష్మి జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల, ఐపీఎస్ . ఆదేశాల మేరకు ముఖ్య కూడళ్ళు, జాతీయ రహదారులు, ప్రమాద ప్రాంతాల్లో ప్రత్యేక ప్రచారాలు చేపడుతున్నారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపకూడదనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని అధికారులు సూచించారు. పోలీసులు, ప్రజలు కలిసికట్టుగా పని చేస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు.

