శ్రీకాళహస్తి, ఏప్రిల్ 11 (పున్నమి న్యూస్) మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతిని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో ఘనంగా నివాళులు అర్పించారు. స్థానిక 18వ వార్డు పూసల వీధి కూడలిలో తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం ఆధ్వర్యంలో పూలే చిత్రపటానికి పూజలు నిర్వహించి, అనంతరం అంబలి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. అణగారిన వర్గాల అభ్యున్నతికి, కుల వివక్ష నిర్మూలనకు జీవితాంతం పోరాడిన మహాత్మా పూలే సామాజిక ఉద్యమానికి ప్రతీకగా నిలిచారని కొనియాడారు. మహిళా విద్యకు పునాదులు వేసి, బాలికల కోసం తొలి పాఠశాల స్థాపనలో పూలే దంపతులు చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. పూలే ఆశయాల స్ఫూర్తితోనే రాష్ట్రంలో విద్య, సామాజిక న్యాయం, మహిళా సాధికారతకు ప్రాధాన్యం పెరుగుతోందని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అందరూ కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు. కులవ్యవస్థ వ్యతిరేక పోరాటం, సమసమాజ నిర్మాణం కోసం పూలే చూపిన మార్గాన్ని అనుసరించడం అవసరమని అభిప్రాయపడ్డారు. అలాగే బీసీల సాధికారతకు పునాది వేసిన నాయకత్వం, సంక్షేమ విధానాలను గుర్తుచేస్తూ, సమాజంలోని అన్ని వర్గాలకు రాజకీయ, ఆర్థిక అవకాశాలు కల్పించడం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ డా.జి.దశరథాచారి, వన్నెకుల క్షత్రియ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, గిరిజన సలహా మండలి సభ్యులు యం.సుబ్బయ్య, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాలి చలపతి నాయుడు, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు,తంగేళ్ళపాలెం పిఏసియస్ ఛైర్మన్ బీమాల భాస్కర్, శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్, శ్రీకాళహస్తి పట్టణ సహకార బ్యాంకు మాజీ ఛైర్మన్ డి.వి.నారాయణ, గాండ్ల తెలికుల సాధికార సమితి రాష్ట్ర సభ్యులు కన్నావరం హరిబాబు, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్,తొట్టంబేడు మండల ప్రధాన కార్యదర్శి చిల్లకూరు మణి,నూర్ మొహమ్మద్, గాజుల భగత్,సంజాకుల మురళీకృష్ణ,యస్వీ.రమణ,వెంకటేశ్వర్లు, వెంకటరమణ,ఆనంద్ గౌడ్,చంద్రబాబు, శ్రీనివాస్, కృష్ణమూర్తి, గంగనపల్లి రమేష్, సులేమాన్, ప్రభాకర్, భార్గవ్,చంద్రశేఖర్, చలపతి,తేజ,దండపాణి,కృష్ణయ్య,గోపీ, సుబ్రహ్మణ్యం పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పూలే జయంతి వేడుకలు.. సమానత్వం, విద్యా స్పూర్తి పునరుద్ఘాటన
శ్రీకాళహస్తి, ఏప్రిల్ 11 (పున్నమి న్యూస్) మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతిని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో ఘనంగా నివాళులు అర్పించారు. స్థానిక 18వ వార్డు పూసల వీధి కూడలిలో తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం ఆధ్వర్యంలో పూలే చిత్రపటానికి పూజలు నిర్వహించి, అనంతరం అంబలి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. అణగారిన వర్గాల అభ్యున్నతికి, కుల వివక్ష నిర్మూలనకు జీవితాంతం పోరాడిన మహాత్మా పూలే సామాజిక ఉద్యమానికి ప్రతీకగా నిలిచారని కొనియాడారు. మహిళా విద్యకు పునాదులు వేసి, బాలికల కోసం తొలి పాఠశాల స్థాపనలో పూలే దంపతులు చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. పూలే ఆశయాల స్ఫూర్తితోనే రాష్ట్రంలో విద్య, సామాజిక న్యాయం, మహిళా సాధికారతకు ప్రాధాన్యం పెరుగుతోందని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అందరూ కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు. కులవ్యవస్థ వ్యతిరేక పోరాటం, సమసమాజ నిర్మాణం కోసం పూలే చూపిన మార్గాన్ని అనుసరించడం అవసరమని అభిప్రాయపడ్డారు. అలాగే బీసీల సాధికారతకు పునాది వేసిన నాయకత్వం, సంక్షేమ విధానాలను గుర్తుచేస్తూ, సమాజంలోని అన్ని వర్గాలకు రాజకీయ, ఆర్థిక అవకాశాలు కల్పించడం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ డా.జి.దశరథాచారి, వన్నెకుల క్షత్రియ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, గిరిజన సలహా మండలి సభ్యులు యం.సుబ్బయ్య, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాలి చలపతి నాయుడు, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు,తంగేళ్ళపాలెం పిఏసియస్ ఛైర్మన్ బీమాల భాస్కర్, శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్, శ్రీకాళహస్తి పట్టణ సహకార బ్యాంకు మాజీ ఛైర్మన్ డి.వి.నారాయణ, గాండ్ల తెలికుల సాధికార సమితి రాష్ట్ర సభ్యులు కన్నావరం హరిబాబు, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్,తొట్టంబేడు మండల ప్రధాన కార్యదర్శి చిల్లకూరు మణి,నూర్ మొహమ్మద్, గాజుల భగత్,సంజాకుల మురళీకృష్ణ,యస్వీ.రమణ,వెంకటేశ్వర్లు, వెంకటరమణ,ఆనంద్ గౌడ్,చంద్రబాబు, శ్రీనివాస్, కృష్ణమూర్తి, గంగనపల్లి రమేష్, సులేమాన్, ప్రభాకర్, భార్గవ్,చంద్రశేఖర్, చలపతి,తేజ,దండపాణి,కృష్ణయ్య,గోపీ, సుబ్రహ్మణ్యం పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

