తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన సమితి రాష్ట్ర కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
పున్నమి న్యూస్ ప్రతినిధి
తెలంగాణ
మార్చ్ 26
*ఇబ్రహీంపట్నం మార్చ్ 26 ()*:-తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన సమితి నూతన రాష్ట్ర కమిటీ ఎన్నికలు గురువారం ఘనంగా నిర్వహించబడగా,అన్ని పదవులకు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులుగా కోరే సాయిరాం నియమితులయ్యారు.సంస్థ సాంస్కృతిక సారథి అధ్యక్షులుగా బుల్లెట్ వెంకన్న,మహిళా అధ్యక్షురాలిగా కూరాకుల భారతక్క బాధ్యతలు స్వీకరించారు.గౌరవ సలహాదారుగా తెల్లగా మల్ల లింగయ్య నియమితులయ్యారు.ప్రధాన కార్యదర్శిగా సింగర్ బోయిన లింగన్న ఎంపిక కాగా,సహాయ కార్యదర్శులుగా రామసాని పుల్లయ్య,పూలక్క,భూతం రవి,పెరమండ్ల సంజీవ ఎన్నికయ్యారు.ఉపాధ్యక్షుల నియామకం కూడా ఏకగ్రీవంగా పూర్తయింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,తెలంగాణ అమరవీరుల ఆశయాలను సాధించేందుకు సమితి కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా సంస్థను మరింత బలోపేతం చేసి,ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.




