తొట్టంబేడు, మార్చి 11, పున్నమి న్యూస్: తొట్టంబేడు మండలంలోని బసవయ్యపాలెం గ్రామంలో ఉన్న భవిత కేంద్రంలో నత్తం హరిబాబు జన్మదిన వేడుకలు సాదాసీదాగా కానీ సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం (ఏపీజేఎఫ్) తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న నత్తం హరిబాబు ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు భోజన ప్లేట్లు, గ్లాసులను వితరణగా అందజేశారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టి వారి ఆనందంలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల అభివృద్ధిలో సమాజం మొత్తం భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. అలాంటి పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను తల్లిదండ్రులు గుర్తించి, వారి ప్రతిభను వెలికితీసేందుకు ప్రోత్సహించాలని సూచించారు. ప్రతి ఒక్కరి సహకారంతో ఈ పిల్లలు కూడా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగగలరని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం ఏర్పాటు చేసిన భవిత కేంద్రాలు ఎంతో మంది విద్యార్థుల జీవితాలను మెరుగుపరుస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా విద్యార్థులకు అవసరమైన శిక్షణ, మార్గదర్శకత లభిస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు కలగుంట భరత్ రెడ్డి, దామా ధనశేఖర్, కాకి హరిబాబు, కోట చంద్రశేఖర్, గంధం చంద్రశేఖర్, షేక్ బాబ్జాన్, షేక్ జుమ్ లేషా, మునిశేఖర్, వెంకటేష్, గంధం మునిచంద్ర, రమేష్, రాజా పాల్గొన్నారు. అలాగే ప్రత్యేక విద్య ఉపాధ్యాయులు ఎం. చైతన్య, నాగరాజు, ఎం. మోహన్, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు పి. సుమలత, అంగన్వాడీ కార్యకర్త రేవతి తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ప్రత్యేక అవసరాల పిల్లలకు భోజన ప్లేట్లు, గ్లాసులు పంపిణీచేసిన నత్తం హరిబాబు
తొట్టంబేడు, మార్చి 11, పున్నమి న్యూస్: తొట్టంబేడు మండలంలోని బసవయ్యపాలెం గ్రామంలో ఉన్న భవిత కేంద్రంలో నత్తం హరిబాబు జన్మదిన వేడుకలు సాదాసీదాగా కానీ సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం (ఏపీజేఎఫ్) తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న నత్తం హరిబాబు ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు భోజన ప్లేట్లు, గ్లాసులను వితరణగా అందజేశారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టి వారి ఆనందంలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల అభివృద్ధిలో సమాజం మొత్తం భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. అలాంటి పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను తల్లిదండ్రులు గుర్తించి, వారి ప్రతిభను వెలికితీసేందుకు ప్రోత్సహించాలని సూచించారు. ప్రతి ఒక్కరి సహకారంతో ఈ పిల్లలు కూడా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగగలరని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం ఏర్పాటు చేసిన భవిత కేంద్రాలు ఎంతో మంది విద్యార్థుల జీవితాలను మెరుగుపరుస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా విద్యార్థులకు అవసరమైన శిక్షణ, మార్గదర్శకత లభిస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు కలగుంట భరత్ రెడ్డి, దామా ధనశేఖర్, కాకి హరిబాబు, కోట చంద్రశేఖర్, గంధం చంద్రశేఖర్, షేక్ బాబ్జాన్, షేక్ జుమ్ లేషా, మునిశేఖర్, వెంకటేష్, గంధం మునిచంద్ర, రమేష్, రాజా పాల్గొన్నారు. అలాగే ప్రత్యేక విద్య ఉపాధ్యాయులు ఎం. చైతన్య, నాగరాజు, ఎం. మోహన్, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు పి. సుమలత, అంగన్వాడీ కార్యకర్త రేవతి తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

