శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 07: శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఎస్ఎఫ్ఐ శ్రీకాళహస్తి శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిదిగా టూ టౌన్ ఎస్ఐ జ్యోతి విచ్చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులనుద్దేశించి జ్యోతి మాట్లాడుతూ….అన్ని రంగాల్లోనూ మహిళలు అగ్రస్థానంలోకి రావాలని అసాంఘిక శక్తుల పట్ల విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలన్నారు. చట్టాలు, హక్కులపై అవగాహన కలిగిన మహిళలు చైతన్యవంతులవుతారని తద్వారా సాధికారత సాకారమవుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ నరసింహా రావు, ఎస్ఎఫ్ఐ నేతలు చుట్టు గురవయ్య, తులసి, నాగ, సుకుమార్, ఐద్వానేతలు రాధమ్మ, రేవతి తదితరులు పాల్గొన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలవాలి- టూ టౌన్ ఎస్ఐ జ్యోతి
శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 07: శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఎస్ఎఫ్ఐ శ్రీకాళహస్తి శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిదిగా టూ టౌన్ ఎస్ఐ జ్యోతి విచ్చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులనుద్దేశించి జ్యోతి మాట్లాడుతూ….అన్ని రంగాల్లోనూ మహిళలు అగ్రస్థానంలోకి రావాలని అసాంఘిక శక్తుల పట్ల విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలన్నారు. చట్టాలు, హక్కులపై అవగాహన కలిగిన మహిళలు చైతన్యవంతులవుతారని తద్వారా సాధికారత సాకారమవుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ నరసింహా రావు, ఎస్ఎఫ్ఐ నేతలు చుట్టు గురవయ్య, తులసి, నాగ, సుకుమార్, ఐద్వానేతలు రాధమ్మ, రేవతి తదితరులు పాల్గొన్నారు.

