పున్నమి ప్రతినిధి తిరుపతి రూరల్
తిరుపతి రూరల్ మండలం చిగురువాడ గ్రామ పంచాయతీ పాపిరెడ్డిపురంకు చెందిన బండి కమలాకర్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన మరణవార్త తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆ ఇంటి వద్దకు చేరుకుని మృతుని పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుమారుడు బాలు, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే గ్రామంలో కనిపించిన పెద్దలు అందరినీ ఆప్యాయం పలుకరించి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. నివాళులు అర్పించిన వారిలో వైఎస్ఆర్సీపీ గ్రామ పంచాయతీ అధ్యక్షులు ముచ్చేలి ధరణీకుమార్రెడ్డితో పాటు గ్రామస్తులు వున్నారు.


