ఏర్పేడు పున్నమి న్యూస్, మార్చి 03, శిరకళహస్తీశ్వర దేవస్థాన పాలక మండలి అధ్యక్షులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి కొట్టే సాయి ప్రసాద్ అధ్యక్షతన ఏర్పేడు పట్టణంలో నిర్వహించిన “ఉద్యమి” సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కిరణ్ రామిశెట్టి, జనసైనికులు పాల్గొని సభ్యత్వ నమోదు ప్రక్రియను ఉత్సాహంగా కొనసాగించారు. ఉద్యమి సభ్యత్వం పొందిన వారికి పార్టీ గుర్తింపు, కార్యక్రమాల్లో ప్రాధాన్యత, కమిటీల్లో బాధ్యతలు, నాయకత్వ శిక్షణతో పాటు నాయకులుగా ఎదిగే అవకాశాలు లభిస్తాయని నాయకులు తెలిపారు. అదనంగా రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం ద్వారా కుటుంబాలకు భరోసా కల్పించనున్నట్లు వివరించారు. ఫిబ్రవరి 26 నుండి మార్చి 10 వరకు “ఉద్యమి” సభ్యత్వ నమోదు కొనసాగనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

ఏర్పేడులో ఉత్సాహంగా జనసేన ‘ఉద్యమి’ నమోదు
ఏర్పేడు పున్నమి న్యూస్, మార్చి 03, శిరకళహస్తీశ్వర దేవస్థాన పాలక మండలి అధ్యక్షులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి కొట్టే సాయి ప్రసాద్ అధ్యక్షతన ఏర్పేడు పట్టణంలో నిర్వహించిన “ఉద్యమి” సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కిరణ్ రామిశెట్టి, జనసైనికులు పాల్గొని సభ్యత్వ నమోదు ప్రక్రియను ఉత్సాహంగా కొనసాగించారు. ఉద్యమి సభ్యత్వం పొందిన వారికి పార్టీ గుర్తింపు, కార్యక్రమాల్లో ప్రాధాన్యత, కమిటీల్లో బాధ్యతలు, నాయకత్వ శిక్షణతో పాటు నాయకులుగా ఎదిగే అవకాశాలు లభిస్తాయని నాయకులు తెలిపారు. అదనంగా రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం ద్వారా కుటుంబాలకు భరోసా కల్పించనున్నట్లు వివరించారు. ఫిబ్రవరి 26 నుండి మార్చి 10 వరకు “ఉద్యమి” సభ్యత్వ నమోదు కొనసాగనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

