శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 24: మండల కేంద్రంలోని స్థానిక ఐ.సి.డి.ఎస్ కార్యాలయం ఎదుట సోమవారం ప్రజా సంఘాలైన సి.ఐ.టి.యు, ఐ.ఎఫ్.టి.యు ఆధ్వర్యంలో రెండవ రోజు కొనసాగుతున్న అంగన్వాడీల రిలే దీక్షలు ఈ సందర్భంగా సి.ఐ.టి.యు నాయకులు పెనగడం గురవయ్య మాట్లాడుతూ….అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ మూడు లక్షల 32 వేల కోట్ల లో ఒక్క రూపాయి కూడా అంగన్వాడీల వేతనాలకు ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించక పోవడం ఎంతో బాధాకరమని సిఐటియు జిల్లా కార్యదర్శి పెనగడం గురవయ్య పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 20 నెలలు కాలం గడిచినప్పటికీ అంగన్వాడి కార్యకర్తల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఎంతో దురదృష్టకరమని ప్రభుత్వం చెల్లిస్తున్న వేతనం వారి కుటుంబ పోషణకు ఏ మాత్రం సరిపోవడం లేదని రోజురోజుకు పెరుగుతున్న నిత్యవసర సరుకుల ధరలను దృష్టిలో ఉంచుకొని అంగన్వాడి కార్యకర్తల వేతనాలను పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఎక్కడా కూడా రక్తహీనత ఉండకూడదని, పౌష్టిక ఆహారం అంగన్వాడీ కార్యకర్తల ద్వారా ప్రతి ఒక్కరికి అందజేస్తున్నామని కానీ పౌష్టికాహారం అందజేసే అంగన్వాడి కార్యకర్తల కుటుంబాల్లో మాత్రం చాలీచాలని జీతాలతో కుటుంబ పోషణ ఎంతో బాధాకరంగా వెల్లదీస్తున్నారని అంగన్వాడీల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేంతవరకు సిఐటియు వారికి అండగా ఉండి పోరాటాలు చేస్తూనే ఉంటుందని అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కింద ప్రతి ఒక్క అంగన్వాడీ కార్యకర్తకు 26 వేల రూపాయల జీతం ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్ గా మార్చాలని ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేశారు. ఈనెల 25, 26, 27వ తేదీలలో జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట రిలే దీక్షలు చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో సి.ఐ.టి.యు నాయకులు గంధం మణి, రాజా, రేవతి, పుష్ప, సక్కుబాయి, ఐ. ఎఫ్.టి.యు నాయకులు జాకీర్, కల్పన తదితరులు పాల్గొన్నారు.

రెండవ రోజు కొనసాగుతున్న అంగన్వాడీల రిలే దీక్షలు
శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 24: మండల కేంద్రంలోని స్థానిక ఐ.సి.డి.ఎస్ కార్యాలయం ఎదుట సోమవారం ప్రజా సంఘాలైన సి.ఐ.టి.యు, ఐ.ఎఫ్.టి.యు ఆధ్వర్యంలో రెండవ రోజు కొనసాగుతున్న అంగన్వాడీల రిలే దీక్షలు ఈ సందర్భంగా సి.ఐ.టి.యు నాయకులు పెనగడం గురవయ్య మాట్లాడుతూ….అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ మూడు లక్షల 32 వేల కోట్ల లో ఒక్క రూపాయి కూడా అంగన్వాడీల వేతనాలకు ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించక పోవడం ఎంతో బాధాకరమని సిఐటియు జిల్లా కార్యదర్శి పెనగడం గురవయ్య పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 20 నెలలు కాలం గడిచినప్పటికీ అంగన్వాడి కార్యకర్తల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఎంతో దురదృష్టకరమని ప్రభుత్వం చెల్లిస్తున్న వేతనం వారి కుటుంబ పోషణకు ఏ మాత్రం సరిపోవడం లేదని రోజురోజుకు పెరుగుతున్న నిత్యవసర సరుకుల ధరలను దృష్టిలో ఉంచుకొని అంగన్వాడి కార్యకర్తల వేతనాలను పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఎక్కడా కూడా రక్తహీనత ఉండకూడదని, పౌష్టిక ఆహారం అంగన్వాడీ కార్యకర్తల ద్వారా ప్రతి ఒక్కరికి అందజేస్తున్నామని కానీ పౌష్టికాహారం అందజేసే అంగన్వాడి కార్యకర్తల కుటుంబాల్లో మాత్రం చాలీచాలని జీతాలతో కుటుంబ పోషణ ఎంతో బాధాకరంగా వెల్లదీస్తున్నారని అంగన్వాడీల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేంతవరకు సిఐటియు వారికి అండగా ఉండి పోరాటాలు చేస్తూనే ఉంటుందని అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కింద ప్రతి ఒక్క అంగన్వాడీ కార్యకర్తకు 26 వేల రూపాయల జీతం ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్ గా మార్చాలని ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేశారు. ఈనెల 25, 26, 27వ తేదీలలో జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట రిలే దీక్షలు చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో సి.ఐ.టి.యు నాయకులు గంధం మణి, రాజా, రేవతి, పుష్ప, సక్కుబాయి, ఐ. ఎఫ్.టి.యు నాయకులు జాకీర్, కల్పన తదితరులు పాల్గొన్నారు.

