ఖమ్మం, ఫిబ్రవరి
(పున్నమి జిల్లా ఇంచార్జి)
ఖమ్మం జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో పలు పట్టణాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. విడుదలైన గణాంకాల ప్రకారం ఐదు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది.
ఎదులాపురం (32/32):
కాంగ్రెస్ – 24, బీఆర్ఎస్ – 2, ఇతరులు – 6
వైరా (20/20):
కాంగ్రెస్ – 12, బీఆర్ఎస్ – 5, ఇతరులు – 3
మధిర (22/22):
కాంగ్రెస్ – 18, బీఆర్ఎస్ – 1, ఇతరులు – 3
కల్లూరు (20/20):
కాంగ్రెస్ – 12, బీఆర్ఎస్ – 7, ఇతరులు – 1
సత్తుపల్లి (23/23):
కాంగ్రెస్ – 17, బీఆర్ఎస్ – 6
ఈ ఫలితాలతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని మరింత బలోపేతం చేసుకున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా ఎదులాపురం, మధిర వంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ గణనీయమైన మెజారిటీ సాధించడం గమనార్హం.
ఇక బీఆర్ఎస్ పార్టీ కొన్ని పట్టణాల్లో పరిమిత స్థానాలకే పరిమితమైంది. ఇతరులు కూడా కొన్ని వార్డుల్లో విజయాలు నమోదు చేసుకున్నారు.
ఈ ఐదు మున్సిపాలిటీలో బీజేపీ ఖాతా తెరవక పోవడం ప్రజల ని విస్మయానికి గురి చేస్తుంది.
మొత్తం మీద ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి..



