అమలాపురం, అక్టోబరు 11 (పున్నమి ప్రతినిధి) ;
అమలాపురం రూరల్ మండలం బండారులంక గ్రామంలో 12 నెలలుగా రోడ్ల పైన, వీధుల్లోనూ పేరుకుపోయిన చెత్త ను డంపింగ్ యార్డుకు తరలించాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలు చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేతలు కార్యకర్తలు సిద్ధమయ్యారు…
ఈనెల 15వ తేదీ బుధవారం పంచాయతీ కార్యాలయం ఎదురుగా చెత్తపై పోరు పేరుతో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు నేతలు తెలిపారు.
ఈ కార్యక్రమం లో నేతలు జాన గణేష్, దంగేటి రుద్ర, వాసా దొర బాబు, అంకం పెదరాజు,గుత్తుల మురుగులరాజు,గుత్తుల సత్తిబాబు , గోసంగి శ్రీను,దంగేటి సింహాచలం, గుత్తుల సురేష్, కట్టా చండి ప్రియా,పెదపూడి నాబురావు, చింతా ఉమా మహేశ్వర రావు, గుత్తుల ఏసుబాబు, ఇనుమర్తి లింగమూర్తి, కారుపర్తి మల్లేశ్వర రావు దంగేటి వెంకట శెట్టి, ఇళ్ల త్రిమూర్తులు, గుబ్బల సాయిరాం,కాసిన చిట్టీ రాజు, కుర్మా క్రీస్తు బాబు,చింతపట్ల నమశ్శివాయ,సరెళ్ల మల్లేశ్వర రావు, దంగేటి ప్రసాద్, జాన కామేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.


