*
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలోని మిరాయ్ సినిమా సూపర్ హిట్ తో కాట్రేనికోన మావుళ్లమ్మతల్లి దేవాలయంలో సినీనటుడు పుష్ప సురేష్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు . తేజ సజ్జ హీరోగా నటించిన ఈ చిత్రంలో తనకు అవకాశం కల్పించిన పీపుల్స్ మీడియా నిర్మాతలకు , దర్శకులకు సురేష్ శర్మ కృతజ్ఞతలు తెలిపారు . మావుళ్లమ్మ తల్లి ఆలయం వద్ద నాటకాలు, భజనలు చేసిన తనకు అమ్మ వారి ఆశీస్సులతో నటుడిగా పుష్ప సినీరంగంలో గుర్తింపునిస్తే మిరాయ్ సినిమా మరింత పేరును తీసుకొచ్చిందని పుష్ప సురేష్ శర్మ అన్నారు . ఇప్పటి వరకు సుమారు 200కు పైగా టీవీ సీరియళ్లు , 150చిత్రాల్లో తనకు నటుడుగా అవకాశం దొరకడం మావుళ్లమ్మ తల్లి ఆశీస్సులే అన్నారు .
ఆలయ ప్రధాన అర్చకుడు ఆణివిళ్ల ఫణికాంత్ మిరాయ్ నటులతో పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనం అందజేసారు . ఈసందర్భంగా నటుడు సురేష్ శర్మను బ్రాహ్మణసంఘ నాయకులు డీసీసీ అధికార ప్రతినిధి కంచుస్తంభం సోనీ, మంత్రి ప్రగడ శ్రీనివాస్, తాతపూడి గోపి, ఆణి విళ్ళ ఫణికాంత్ , శంకర్ దేవాసి ,ఈశ్వర్, రవివర్మ , రామకృష్ణ పరమహంస,పవన్, తంబి, తదితరులు సత్కరించారు .


