ఖమ్మం జిల్లాలో ఈ నెల 29 వరకు రోగి భద్రత (పేషంట్ సేఫ్టీ) వారోత్సవాలను నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రామారావు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులు, ఇతర ఆరోగ్య సంస్థల్లో రోగుల భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం, చికిత్స సమయంలో సంభవించే ప్రమాదాలను నివారించడం, వైద్య సేవల భద్రతపై రోగులు, వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడం వారోత్సవాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. వైద్యులు, సిబ్బంది రోగుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ సేవలు అందించాలని డాక్టర్ రామారావు సూచించారు.



