నరసరావుపేట టౌన్:జూలై 15 బుధ వారం ఆంధ్ర హాస్పిటల్స్ మరియు మహేష్ బాబు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో చిన్నపిల్లల గుండె ఆపరేషన్లకు సంబంధించిన వైద్యశిబిరం పల్నాడు జిల్లా కేంద్రం అయిన నరసరావుపేట పట్టణంలో మొదటిసారిగా ది:18-07-2026 అనగా శనివారం ఉదయం నిర్వహించుచున్నారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్ర హాస్పిటల్స్ డాక్టర్ D.లింగస్వామి గారు పాల్గొని అవసరమైన వారికి గుండె పరీక్షలు నిర్వహిస్తారు. కేవలం ఈ ఒక్కసారి మాత్రమే కాకుండా ప్రతినెల మూడో శుక్రవారం రోజున స్థానిక పల్నాడు రోడ్ లో ఉన్న నాగసరపు రామారావు కాంప్లెక్స్ వెనక సందులో ఉన్న శ్రీ.త్రికోటేశ్వర స్కాన్ సెంటర్ నందు వైద్య శిబిరం నిర్వ హిస్తారు.
కావున అప్పుడే పుట్టిన పిల్లల నుండి 15 సంవత్సరాల లోపు పిల్లల వరకు గుండె సంబంధిత సమస్యలు ఉన్న వారు సంప్ర దించవలసినదిగా తెలియజేశారు.
నిర్వహించిన కార్యక్రమంలోపల్నాడు జిల్లా – టౌన్ వైడ్ సూపర్ స్టార్ కృష్ణ- మహేష్ బాబు యువశక్తి పట్టణ అధ్యక్షులు: MD.ఫారూఖ్ బాబు మరియు అభిమాన సంఘం సభ్యులు SK.నబీబాజీ,D.నాగేశ్వరరావు,S.థామస్, K.పిచ్చి బాబు,B.మస్తాన్ రావు,SK.సుభాని తదితరులు పాల్గొన్నారు.
Uploaded Video:


