పాణ్యం గ్రామ సమీపాన తెల్లవారుజామున 01: 30 గంటలకు నంద్యాల మరియు పాణ్యం మండలం వడ్డుగండ్లకు చెందిన ఇద్దరు వ్యక్తులు గడివేముల మండలపరిధిలోని గని గ్రామం వద్దనున్న సోలార్ విద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు అర్థరాత్రి మోటార్ సైకిల్ పై వస్తుండగా పాణ్యం గ్రామ సమీపాన హైవే రహదారి పై మృతి చెందిన పశువును ఢీ కొని నంద్యాలకు చెందిన భార్గవ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించగా,వడ్డుగండ్ల గ్రామానికి చెందిన కార్తీక్ తీవ్ర గాయాలు కావడంతో సమాచారం అందుకున్న హైవే పెట్రోల్ పోలీస్లు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి కార్తీక్ ను 108 వాహనంలో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.



