సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులను కేంద్ర ప్రభుత్వం నియమించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడంతో ఈ నియామకాలు అమల్లోకి వచ్చాయి. దీంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 37కు చేరుకుంది. పంజాబ్-హర్యానా, బాంబే, మధ్యప్రదేశ్, జమ్మూ-కశ్మీర్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులతో పాటు సీనియర్ న్యాయవాది వి. మోహనకు అవకాశం లభించింది. మహిళా హక్కులు, సాయుధ దళాల్లో మహిళలకు సమాన అవకాశాల కోసం వాదించిన ప్రముఖ న్యాయవాదిగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. న్యాయవ్యవస్థ పనితీరును మరింత బలోపేతం చేయడంలో ఈ నియామకాలు కీలకమని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకం
సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులను కేంద్ర ప్రభుత్వం నియమించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడంతో ఈ నియామకాలు అమల్లోకి వచ్చాయి. దీంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 37కు చేరుకుంది. పంజాబ్-హర్యానా, బాంబే, మధ్యప్రదేశ్, జమ్మూ-కశ్మీర్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులతో పాటు సీనియర్ న్యాయవాది వి. మోహనకు అవకాశం లభించింది. మహిళా హక్కులు, సాయుధ దళాల్లో మహిళలకు సమాన అవకాశాల కోసం వాదించిన ప్రముఖ న్యాయవాదిగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. న్యాయవ్యవస్థ పనితీరును మరింత బలోపేతం చేయడంలో ఈ నియామకాలు కీలకమని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

