ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా తన కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ముడిసరుకులు మరియు కమొడిటీల ధరలు పెరగడం వల్ల కార్యకలాపాల వ్యయం భారంగా మారిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. కార్ల మోడళ్లు, వేరియంట్లను బట్టి గరిష్టంగా రూ.12,800 వరకు ఈ పెంపు ఉంటుంది. ఈ కొత్త ధరలు జూన్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. వినియోగదారులపై భారం మోపాలని కాకుండా, మార్కెట్ పరిస్థితుల వల్లే ఈ ధరల సవరణ చేసినట్లు సంస్థ స్పష్టం చేసింది.

రూ. 12,800 వరకు పెరగనున్న కార్ల ధరలు
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా తన కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ముడిసరుకులు మరియు కమొడిటీల ధరలు పెరగడం వల్ల కార్యకలాపాల వ్యయం భారంగా మారిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. కార్ల మోడళ్లు, వేరియంట్లను బట్టి గరిష్టంగా రూ.12,800 వరకు ఈ పెంపు ఉంటుంది. ఈ కొత్త ధరలు జూన్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. వినియోగదారులపై భారం మోపాలని కాకుండా, మార్కెట్ పరిస్థితుల వల్లే ఈ ధరల సవరణ చేసినట్లు సంస్థ స్పష్టం చేసింది.

