నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి,
వైఎస్సార్సీపీ “జగన్ 2.0” కార్యక్రమం పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు. ప్రజా సమస్యలపై పార్టీ నిరంతరం పోరాడుతుందని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజల విశ్వాసాన్ని తిరిగి గెలుచుకుంటామని అన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నలు లేవనెత్తుతూ, పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లి జగన్ 2.0 సందేశాన్ని విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.



