శ్రీకాళహస్తి, ఏప్రిల్ 13 (పున్నమి న్యూస్) దేశ జనాభాలో సగభాగమైన మహిళల దశాబ్దాల నిరీక్షణకు మోదీ ప్రభుత్వం తెరదించిందని, ‘నారీ శక్తి వందన్’ అధినియం ద్వారా మహిళా సాధికారతకు కొత్త బాటలు వేశారని తిరుపతి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు ప్రజ్ఞశ్రీ కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 2023లో ప్రవేశపెట్టిన ఈ చారిత్రాత్మక చట్టం ద్వారా లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడం అభినందనీయమన్నారు. ఇది కేవలం చట్టపరమైన మార్పు మాత్రమే కాదని, భారత రాజకీయాల్లో మహిళల సమాన భాగస్వామ్యానికి వేసిన బలమైన పునాది అని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “మోదీ ప్రభుత్వ పాలనలో మహిళల పట్ల సానుకూల మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ రిజర్వేషన్ బిల్లును ఆమోదించడం ద్వారా మహిళల ఆశలకు న్యాయం జరిగింది. భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో మహిళలు కీలక పాత్ర పోషించబోతున్నారు” అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా మహిళా లోకానికి గర్వకారణమని, సామాజిక సమానత్వ దిశగా ఇదొక గొప్ప అడుగని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు.

మహిళా సాధికారతలో నవ శకం..మోదీ సర్కార్ చారిత్రాత్మక నిర్ణయం- ప్రజ్ఞశ్రీ
శ్రీకాళహస్తి, ఏప్రిల్ 13 (పున్నమి న్యూస్) దేశ జనాభాలో సగభాగమైన మహిళల దశాబ్దాల నిరీక్షణకు మోదీ ప్రభుత్వం తెరదించిందని, ‘నారీ శక్తి వందన్’ అధినియం ద్వారా మహిళా సాధికారతకు కొత్త బాటలు వేశారని తిరుపతి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు ప్రజ్ఞశ్రీ కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 2023లో ప్రవేశపెట్టిన ఈ చారిత్రాత్మక చట్టం ద్వారా లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడం అభినందనీయమన్నారు. ఇది కేవలం చట్టపరమైన మార్పు మాత్రమే కాదని, భారత రాజకీయాల్లో మహిళల సమాన భాగస్వామ్యానికి వేసిన బలమైన పునాది అని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “మోదీ ప్రభుత్వ పాలనలో మహిళల పట్ల సానుకూల మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ రిజర్వేషన్ బిల్లును ఆమోదించడం ద్వారా మహిళల ఆశలకు న్యాయం జరిగింది. భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో మహిళలు కీలక పాత్ర పోషించబోతున్నారు” అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా మహిళా లోకానికి గర్వకారణమని, సామాజిక సమానత్వ దిశగా ఇదొక గొప్ప అడుగని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు.

