గూడూరులో దాసని లక్ష్మి గారి పదవీ విరమణ సందర్భంగా ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, సామాజిక ప్రముఖులు, ఉద్యోగులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దాసని లక్ష్మి గారు ఉద్యోగ జీవితంలో అందించిన విశిష్ట సేవలను కొనియాడుతూ పలువురు ప్రసంగించారు. ఆమె నిజాయితీ, క్రమశిక్షణ, ప్రజల పట్ల అంకితభావం ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆమె భర్త నార గోపాల్ గారిని కూడా ప్రత్యేకంగా అభినందించారు. పేదల పక్షాన సేవలందిస్తూ కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వహించారని కొనియాడారు. ఆర్థిక క్రమశిక్షణతో పిల్లలను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడంలో దంపతులు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. కుమార్తె డాక్టర్ కీర్తి, కుమారుడు క్రాంతిబాబు బ్యాంకు మేనేజర్గా ఎదగడం వారి కృషికి నిదర్శనమని అన్నారు. అనంతరం దంపతులను శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.


