ఖమ్మం జులై
(పున్నమి న్యూస్)
తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision–SIR) ప్రక్రియ గడువును భారత ఎన్నికల సంఘం పొడిగించింది. ఈ నెల 24తో ముగియాల్సిన గడువును ఆగస్టు 3 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి (CEO) ఉత్తర్వులు జారీ చేసింది. ఓటరు నమోదులు, వివరాల సవరణలు, మార్పులు, తొలగింపులు తదితర ప్రక్రియలను పూర్తి చేసుకునేందుకు అదనపు సమయం కల్పించినట్లు అధికారులు తెలిపారు. అర్హులైన ఓటర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ వివరాలను సరిచేసుకోవాలని ఎన్నికల అధికారులు సూచించారు.


