కడప జిల్లా నందలూరు మండలంలోని వెలసిన అతి పురాతన చారిత్రాత్మక కట్టడాలలో ఒకటైన శ్రీ సౌమ్యనాథ స్వామి దేవస్థానం నందు ఈనెల 21 నుండి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వారు కరపత్రాలను విడుదల చేసిన విషయం పాఠకులకు విధితమే. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు పిచ్చి మొక్కల తొలగింపు, ప్రధాన ముఖ ద్వారం నుంచి దేవాలయం వరకు చలువ పందిరులు, కళ్యాణ వేదిక వద్ద ప్రత్యేక చలువ పందిళ్లు. జిల్లా నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చే భక్తులకు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.




