ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 16 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు, జూలై 16: వైసీపీ హయాంలోనే అరాచకాలు, ఘోరాలు ఎక్కువగా జరిగాయని టిడిపి మండల అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య విమర్శించారు. గురువారం ఎంపీడీవో కార్యాలయం ఆవరణంలో ఆయన మాట్లాడుతూ, గతంలో దొంగతనం కేసులో ఒక నిందితుడు పోలీసుల అదుపులో మృతి చెందిన ఘటనను గుర్తు చేశారు. రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ ప్రేరేపితమని అన్నారు. ఈ కార్యక్రమంలో పచ్చిపాల రామిరెడ్డి, రఘురాం నాయుడు, శివుడు, రాజా గౌడ్, భాస్కర్ రెడ్డి, పొన్నూరు అశోక్, మోపూరు ధనుంజయ రెడ్డి, సాని వెంకటరమణయ్య, రాయపాటి కిరణ్, రావుల జితేంద్ర గౌడ్, బండికట్టు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

వైసీపీ హయాంలోనే అరాచకాలు జరిగాయి: టిడిపి మండల అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 16 (పున్నమి ప్రతినిధి) మనుబోలు, జూలై 16: వైసీపీ హయాంలోనే అరాచకాలు, ఘోరాలు ఎక్కువగా జరిగాయని టిడిపి మండల అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య విమర్శించారు. గురువారం ఎంపీడీవో కార్యాలయం ఆవరణంలో ఆయన మాట్లాడుతూ, గతంలో దొంగతనం కేసులో ఒక నిందితుడు పోలీసుల అదుపులో మృతి చెందిన ఘటనను గుర్తు చేశారు. రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ ప్రేరేపితమని అన్నారు. ఈ కార్యక్రమంలో పచ్చిపాల రామిరెడ్డి, రఘురాం నాయుడు, శివుడు, రాజా గౌడ్, భాస్కర్ రెడ్డి, పొన్నూరు అశోక్, మోపూరు ధనుంజయ రెడ్డి, సాని వెంకటరమణయ్య, రాయపాటి కిరణ్, రావుల జితేంద్ర గౌడ్, బండికట్టు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

