జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి జరిగిన శస్త్రచికిత్స విజయవంతం అవ్వడం అందరికి తెలిసినవిషయమే.
ఆయన త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యవంతమైన జీవితం జీవించాలని,ప్రజల అర్థిక ఎదుగుదలకు ఇంకా ఎంతో బలమైన పునాది చేకూర్చాలని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లో పవన్ కళ్యాణ్ పాత్ర చాల బలంగా చరిత్ర పుటల్లో వుండే విధంగా అత్తిరాల శ్రీ తేతేశ్వర స్వామి ఆశీస్సులు వుండలని, వారహి అమ్మవారి దీక్షలో వున్న జనసేన నాయకులు కొట్టే శ్రీహరి గారు దక్షిణ గయగా పిలవబడే అత్తిరాల పుణ్యక్షేత్రం అయిన శ్రీ తేతేశ్వర స్వామి ఆలయం లో మన రాష్ట ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరు మీద ఆయన బాగుండాలని ఆలయ చైర్మన్ పూల నాగమణి గారి కుమారుడు పూల బాలజి అధ్వర్యంలో అర్చనలు, పూజలు నిర్వహించడం జరిగింది.
అత్తిరాల పుణ్యక్షేత్రంలో పరశురాముడి ఆలయం,గదాధర ఆలయాల దర్శన భాగ్యం కలిగించడంతో పాటు ఆలయ చరిత్రను ఎంతో ఒపికగా తెలియజేసిన పూల బాలజి కి ప్రత్యేక కృతజ్ఞతలు,అత్తిరాలలో గడిపిన సమయంలో మాకు అనిపించింది ఒక్కటే మేము ఒక మహాపుణ్య క్షేత్రంలో.ఉన్నామని ,ప్రతి ఒక్క హిందువు తప్పకదర్శించుకోవలసిన క్షేత్రం అత్తిరాల.
ఈ కార్యక్రమంలో సీనియర్ మెగా అభిమాని పుత్త. నాగేశ్వరరావు పాల్గొన్నారు.



