ఆత్మకూరు పట్టణ ఎస్ఎఫ్ఐ ప్లీనంలో 15 మందితో నూతన కమిటీ ఎన్నిక. హాస్టల్ మెస్ ఛార్జీలు రూ.3 వేలకు పెంచాలని జిల్లా కార్యదర్శి వెన్ను నరేంద్ర డిమాండ్.
ఆత్మకూరు : భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణ నూతన కమిటీ 15 మందితో ఎన్నికవ్వటం జరిగింది. శనివారం ఆత్మకూరు పట్టణంలోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో ఆత్మకూరు పట్టణ ప్లీనం నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కార్యదర్శి వెన్ను నరేంద్ర హాజరయ్యారు
కమిటీ ఎన్నిక సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ విద్యారంగ సమస్యలపై జిల్లాలో రాష్ట్రంలో విద్యార్థులను ఐక్యం చేస్తూ పోరాటాలు ఉద్యమాలు చేస్తుందని దీంతో పాటు ఎస్ఎఫ్ఐ విద్యార్థులని ఐక్యం చేసే విధంగా ప్రయత్నాలు చేయడం, ఎస్ఎఫ్ఐ విద్యారంగ సమస్యలపై మరియు విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలను తెలుసుకునేందుకు పొదలకూరులో నూతన కమిటీ ద్వారా ప్రత్యేకమైనటువంటి కార్యచరణ రూపొందించుకొని విద్యార్థులు సమస్యలు తెలుసుకొని వాటిపై పోరాటాలు మరియు ఉద్యమాలు చేయాలని అన్నారు.దీనితోపాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం విద్యార్థులకు మరియు విద్యార్థి లోకానికి చేస్తున్న అన్యాయాన్ని గురించి మాట్లాడారు ముఖ్యంగా సంక్షేమ వసతి గృహాలు సంబంధించి విద్యార్థులకు ప్రస్తుతం ఇచ్చేటువంటి హాస్టల్ మిస్ చార్జీలు ఏ విధంగా కూడా సరిపోవని వెంటనే పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టల్ ను చార్జీలను 3000 రూపాయలకు పెంచి విద్యార్థులకు పౌష్టికాహారం అందించే విధంగా విద్యార్థులకు న్యాయం చేకూర్చేలా చూడాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న అన్నారు.విద్యారంగ సమస్యలపై భవిష్యత్తులో విద్యార్థుల్ని కలుపుకొని పొదలకూరు మండలంలో పోరాటాలు చేసేందుకు సిద్ధమవుతామని తెలియజేశారు. అనంతరం ఆత్మకూరు పట్టణ కమిటీ 15 మందితో ఎన్నికవ్వటం జరిగింది. అధ్యక్ష కార్యదర్శులుగా కె.ప్రతాప్ , డి.వి.నాని ఎన్నికయ్యారు ఉపాధ్యక్షులు సహాయ కార్యదర్శులుగా కిరణ్, హేమంత్,నవీన్ లను ఎన్నికయ్యారు కమిటీ సభ్యులుగా వివేక్, ప్రవీణ్, నాని, యశ్వంత్ రామ్, సాయి, కార్తీక్, శివ, పెంచల్ కుమార్ ఎన్నికయ్యారు.


