దేశంలోని కీలక ప్రాంతాలపై ఉగ్రదాడులకు కుట్ర పన్నిన ముఠాకు చెందిన ఎనిమిది మందిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వీరికి పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐతో పాటు అండర్వరల్డ్ నెట్వర్క్లతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన వారి నుంచి నాలుగు హ్యాండ్ గ్రెనేడ్లు, రెండు గ్లాక్ పిస్టళ్లు, 25 తూటాలను స్వాధీనం చేసుకున్నారు. ముంబై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో దాడులకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు విచారణలో తేలిందని అధికారులు వెల్లడించారు. ఈ కేసు దేశ భద్రతా వ్యవస్థలకు పెద్ద హెచ్చరికగా భావిస్తున్నారు.

ఐఎస్ఐతో సంబంధాలున్న ఎనిమిది మంది అరెస్టు
దేశంలోని కీలక ప్రాంతాలపై ఉగ్రదాడులకు కుట్ర పన్నిన ముఠాకు చెందిన ఎనిమిది మందిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వీరికి పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐతో పాటు అండర్వరల్డ్ నెట్వర్క్లతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన వారి నుంచి నాలుగు హ్యాండ్ గ్రెనేడ్లు, రెండు గ్లాక్ పిస్టళ్లు, 25 తూటాలను స్వాధీనం చేసుకున్నారు. ముంబై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో దాడులకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు విచారణలో తేలిందని అధికారులు వెల్లడించారు. ఈ కేసు దేశ భద్రతా వ్యవస్థలకు పెద్ద హెచ్చరికగా భావిస్తున్నారు.

