Tuesday, 5 May 2026

Blog

E-పేపర్

వాసిరెడ్డి జమీలు ఆధ్వర్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుక.

రౌతులపూడి (పున్నమి ప్రతినిధి )డిసెంబర్ 21: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఉప ముఖ్యమంత్రి పుట్టిన రోజు వేడుకలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి జమీలు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రతిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి కన్వీనర్ ముద్రగడ గిరిబాబు హాజరయ్యారు. ముందుగా స్థానిక మార్క సెంటర్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు అనంతరం ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరం, వృద్ధులకు ఉచిత దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా కార్యకర్తల ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి జమీల్ మాట్లాడుతూ పేదల పక్షపాతి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తండ్రి ఆశయాలను పునుకు పుచ్చుకొని ఆయన ఆశయ సాధనకై నిరంతరం పనిచేస్తున్నారని జమీలు అన్నారు. ఈ కార్యక్రమంలో రౌతులపూడి మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చింతకాయల వీర వెంకట సత్యనారాయణ, జడ్పిటిసి గొళ్ళు చిన్న దివానం, రౌతులపూడి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ వాసిరెడ్డి భాస్కర బాబు, మాజీ డిసిసిబి డైరెక్టర్ పులి మధు, ఎస్ అగ్రహారం సర్పంచ్ సర్నం శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ మాజీ డైరెక్టర్ కేదార్ శెట్టి నాగేశ్వరరావు, మరియు రౌతులపూడి మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

E-పేపర్

వాసిరెడ్డి జమీలు ఆధ్వర్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుక.

రౌతులపూడి (పున్నమి ప్రతినిధి )డిసెంబర్ 21: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఉప ముఖ్యమంత్రి పుట్టిన రోజు వేడుకలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి జమీలు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రతిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి కన్వీనర్ ముద్రగడ గిరిబాబు హాజరయ్యారు. ముందుగా స్థానిక మార్క సెంటర్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు అనంతరం ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరం, వృద్ధులకు ఉచిత దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా కార్యకర్తల ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి జమీల్ మాట్లాడుతూ పేదల పక్షపాతి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తండ్రి ఆశయాలను పునుకు పుచ్చుకొని ఆయన ఆశయ సాధనకై నిరంతరం పనిచేస్తున్నారని జమీలు అన్నారు. ఈ కార్యక్రమంలో రౌతులపూడి మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చింతకాయల వీర వెంకట సత్యనారాయణ, జడ్పిటిసి గొళ్ళు చిన్న దివానం, రౌతులపూడి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ వాసిరెడ్డి భాస్కర బాబు, మాజీ డిసిసిబి డైరెక్టర్ పులి మధు, ఎస్ అగ్రహారం సర్పంచ్ సర్నం శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ మాజీ డైరెక్టర్ కేదార్ శెట్టి నాగేశ్వరరావు, మరియు రౌతులపూడి మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

అనకాపల్లి

“పల్స్ పోలియో రహిత సమాజం కోసం అందరూ బాధ్యత వహించాలి – సర్పంచ్ భజంత్రీల లక్ష్మి..!

డిసెంబర్ 21 అనకాపల్లి జిల్లా పున్నమి న్యూస్ ప్రతినిధి (ఆనంద్ ) : ఏటికొప్పాక గ్రామంలో మూడు చోట్ల పోలియో చుక్కలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐదు సంవత్సరాలలోపు పిల్లలకి వేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భజంత్రీల లక్ష్మి పాల్గొని పిల్లలకు దగ్గరుండి పల్స్ పోలియో చుక్కలు వేయించడం కాకుండా పల్స్ పోలియో కార్యక్రమం కేవలం ఒక వైద్య కార్యక్రమంలో మాత్రమే కాదు, ఇది దేశ భవిష్యత్తును కాపాడే సామాజిక బాధ్యత. ప్రతి ఒక్కరూ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య పథకాలను ప్రజలు పూర్తిగా వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, గ్రామ పెద్దలు మాజీ సర్పంచులు అన్నం బాబూజీ, కాండ్రకోట చిరంజీవి, ఎంపీటీసీ అచ్చం నాయుడు, అన్నం సరోజ రావు, కొండయ్య నాయుడు, భజంత్రీల శ్రీను కూటమి నాయకులు పాల్గొన్నారు.

నాగర్‌కర్నూల్

నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు నెంబర్ల, ప్రమాణస్వీకారము కు గ్రామ ప్రజలు అందరూ ఆహ్వానితులే… నాగులపల్లి గ్రామ సర్పంచ్ మల్లెపల్లి సరిత జగన్మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ సంకటి సాయిలీల రామకృష్ణ

పున్నమి: డిసెంబర్ 21 నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం: కోడేరు మండల పరిధిలో నాగులపల్లి గ్రామ పంచాయతీ నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మల్లెపల్లి సరిత జగన్మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ సంకటి సాయిలీల రామకృష్ణ, వార్డు సభ్యులు డిసెంబర్ 22 న ఉదయం 10 గంటలకు నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు నాగులపల్లి గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారుల సమక్షంలో ప్రమాణ స్వీకారం ఉంటుంది అని మల్లెపల్లి సరిత జగన్మోహన్ రెడ్డి తెలిపారు.గ్రామ పెద్దలు వార్డ్ మెంబర్స్ యువతి యువకులు మహిళలు స్నేహితులు అభిమానులు అందరూ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని ఆమె తెలిపారు.

అన్నమయ్య

ఆశ్రమంలో చిన్నారి చైరస్వి చౌదరి పుట్టినరోజు వేడుకలు: అన్నదానంతో చాటుకున్న మానవత్వం

చిట్వేల్, డిసెంబర్ 21 పున్నమి ప్రతినిధి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం, చిట్వేల్ మండల పరిధిలోని రాపూర్ రోడ్డు, తిమ్మాయపాలెం క్రాస్ రోడ్డు వద్ద ఉన్న దత్తగిరి నారాయణ తపోవణ అభయాంజనేయ స్వామి ఆశ్రమం లో ఆదివారం ఒక విశేష సేవా కార్యక్రమం చోటుచేసుకుంది. కందులవెంకటనారాయణ, తేజస్విత దంపతుల కుమార్తె కందుల చైరస్వి చౌదరి పుట్టినరోజును పురస్కరించుకుని ఆశ్రమంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. -అన్నదానం – కూరగాయల పంపిణీ: పుట్టినరోజు వేడుకలను ఆడంబరాలకు దూరంగా, సేవా దృక్పథంతో నిర్వహించాలని నిర్ణయించుకున్న కందుల కుటుంబ సభ్యులు ఆశ్రమవాసులకు మధ్యాహ్నం రుచికరమైన భోజనాన్ని ఏర్పాటు చేశారు. కేవలం అన్నదానమే కాకుండా, ఆశ్రమ అవసరాల కోసం సరిపడా తాజా కూరగాయలను కూడా పంపిణీ చేశారు. చిన్నారి చైరస్వి అక్క ఉన్సిక చౌదరి స్వయంగా ఆశ్రమంలోని పెద్దలకు భోజనం వడ్డించి తన సేవా గుణాన్ని చాటుకోవడం అందరినీ ఆకట్టుకుంది.పీఠాధిపతి నాగేశ్వరమ్మ ఈ సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతి నాగేశ్వరమ్మ మాట్లాడుతూ.నేటి యువత, పిల్లల తల్లిదండ్రులు పుట్టినరోజు వేడుకలను ఇలా ఆశ్రమాల్లో జరుపుకోవడం ఎంతో అభినందనీయమన్నారు. ఇటువంటి కార్యక్రమాల వల్ల ఆశ్రమంలోని నిస్సహాయులకు ఎంతో తోడ్పాటు లభిస్తుందని తెలిపారు. చైరస్వి భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆ దేవుని ఆశీస్సులతో నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆశీర్వదించారు. ఆశ్రమంలోని పెద్దలందరూ చిన్నారిని దీవించారు.ఈ సేవా కార్యక్రమంలో కందుల శివకుమార్, చంద్రశేఖర్, కుటుంబ సభ్యులు, ఆశ్రమ నిర్వాహకులు మరియు పెద్దలు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఘనంగా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా డిసెంబర్ 21 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి, ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న సేవలను కొనియాడుతూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మండలంలోని పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని వేడుకలను మరింత వైభవంగా తీర్చిదిద్దారు.

అన్నమయ్య

ప్రతి బిడ్డకు పోలియో చుక్కలు వేయించాలి: మల్లెం హేమంత్ కుమార్

చిట్వేల్, డిసెంబర్ 21 పున్నమి ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా రాయలసీమ విద్యార్థి పరిరక్షణ సమితి జోనల్ అధ్యక్షుడు మల్లెం హేమంత్ కుమార్ పాల్గొని చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 6 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ప్రతి బిడ్డకు తప్పనిసరిగా రెండు పోలియో చుక్కలు వేయించాలని నిర్ణయించారు.పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలంటే పోలియో రహిత సమాజం అవసరమని, ప్రతి తల్లిదండ్రులు బాధ్యతగా తమ చుక్కల మందు వేయించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలని ఆయన హితవు పలికారు. ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ ఈ ప్రదర్శనలు కావాలని. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు శ్రావణి, రమాదేవి, గడిచినపాటి ప్రకాష్ మరియు ఇతర స్వచ్ఛంద కార్యకర్తలు ఉన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా డిసెంబర్21 ( పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం కుడితిపల్లి గ్రామంలో అంగన్వాడీ టీచర్ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం విజయవంతంగా పూర్తయ్యింది. గ్రామంలోని 40 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసి, తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించారు. కార్యక్రమానికి గ్రామస్తులు మంచి సహకారం అందించడంతో లక్ష్యాన్ని సమర్థవంతంగా సాధించారు.

ఖమ్మం

తమ పై వచ్చిన ఆరోపణలు ఖందించిన నెల్లూరు కోటేశ్వరరావు, కుసంపూడి రవీందర్

ఖమ్మం జిల్లా (పున్నమి ప్రతి నిధి) సిరి గోల్డ్ ఫైనాన్స్ మీద బాధితుడు యాస నాగేశ్వరావ్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన హైదరాబాద్ సి సి యస్ పోలీసు లు ఏ. 1. గా కుసంపూడి రవీందర్ ఏ. 2 గా నెల్లూరు కోటేశ్వరరావు పేర్లు నమోదు చేసారు. ఈ నేపథ్యంలో నెల్లూరు కోటేశ్వరరావు, కుసంపూడి రవీందర్ లు వేరు వేరు గా ఖండిస్తు ప్రకటన లు విడుదల చేసారు. ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ రాజకీయంగా ఎదుర్కోలేకనే తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఇలాంటి నిరాధార ప్రచారం కొనసాగితే పరువు నష్టం దావా వేస్తామని నెల్లూరు కోటేశ్వరరావు హెచ్చరించారు. సిరి గోల్డ్ కి తనకు గాని తన పెట్టుబడులు కి గాని ఎటువంటి సంబంధం లేదని కోటేశ్వరరావు తెలియజేసారు. సీనియర్ నాయకులు కుసంపూడి రవీందర్ మాట్లాడు తు సిరి గోల్డ్ సంస్థ ఎవరిని మోసం చేయలేదని స్పష్టం చేశారు. తమపై ఫిర్యాదు చేసిన యాసా నాగేశ్వరరావు తమ వద్ద రూ.15,000 విలుచేసే బంగారం కొనుగోలు చేశారని తెలిపారు. అయితే ఆ కొనుగోలుకు సంబంధించి నగదు చెల్లించారాని డిపాజిట్ చేయలేదని, బంగారం కొనుగోలు చేసిన సమయంలో 15000 కి రసీదు కూడా అందజేశామని పేర్కొన్నారు. తాను ఎక్కడికీ పరారై పోలేదని, తన సెల్ ఫోన్ ఎప్పుడూ అందుబాటులోనే ఉందని అన్నారు2026. మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఎల్‌బీ నగర్‌లో సిరి గోల్డ్ & డైమండ్ షోరూమ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ వ్యవహారానికి ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మరోసారి నిరాధార ఆరోపణలు చేస్తే తప్పకుండా పరువు నష్టం దావా వేస్తామని కుసంపూడి రవీంద్ర హెచ్చరించారు.

అన్నమయ్య

నందలూరులో ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం: చిన్నారులకు చుక్కలు వేసిన ఎద్దుల విజయ సాగర్

నందలూరు: మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ ఆవరణలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయడం ద్వారా మండలంలో ఈ కార్యక్రమం విజయవంతంగా ప్రారంభమైంది. ​ముఖ్య అతిథిగా విజయ సాగర్ ​ఈ కార్యక్రమానికి రాజంపేట అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యెద్దల విజయ సాగర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన స్వయంగా చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేసి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ​విజయ సాగర్ ప్రసంగం ​ఈ సందర్భంగా విజయ సాగర్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజల ఆరోగ్యానికి, ముఖ్యంగా చిన్నారుల భవిష్యత్తుకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ​”చిన్నారుల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. పోలియో రహిత సమాజాన్ని నిర్మించడంలో తల్లిదండ్రులు బాధ్యతగా పాలుపంచుకోవాలి.” అని ఆయన కోరారు. ​పాల్గొన్న అధికారులు మరియు నాయకులు ​ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు, ఆరోగ్య శాఖ సిబ్బందితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు చురుగ్గా పాల్గొన్నారు. ముఖ్యంగా: ​రాము: నందలూరు సర్పంచ్. ​గంగాధర్: నాగిరెడ్డిపల్లి టీడీపీ అధ్యక్షులు. ​బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రంలో ప్రయాణికుల పిల్లలకు, స్థానిక చిన్నారులకు వైద్య సిబ్బంది ఎంతో శ్రద్ధతో చుక్కల మందు వేశారు. ప్రభుత్వ డాక్టర్లు, ఇతర శాఖల సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.