Monday, 4 May 2026

Blog

విశాఖపట్నం

పోలియో చుక్కలు వేసిన గంటా*

*పోలియో చుక్కలు వేసిన గంటా* *విశాఖపట్నం డిసెంబర్ 21పున్నమి ప్రతినిధి*_ జీవీఎంసీ 8 వ వార్డులోని సాగర్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ పల్స్ పోలియో శిబిరంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొని, 5 ఏళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 నుంచి దేశంలో పోలియో జాడ లేనప్పటికీ.. ప్రతీ ఏడాది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం ద్వారానే ఆ వ్యాధి ఆనవాళ్లు లేకుండా చేయగలమని పేర్కొన్నారు. బిడ్డలకు పోలియో చుక్కలు వేయించడంలో తల్లిదండ్రులది కీలక పాత్రని తెలిపారు. నూరు శాతం లక్ష్యాన్ని సాధించాలని వైద్య సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఇంచార్జ్ జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు, స్థానిక కార్పొరేటర్ లొడగల అప్పారావు, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, చెట్టిపల్లి సన్యాసిరావు, శాఖారి శ్రీనివాస్, చెట్టిపల్లి గోపీ, సారిపల్లి శ్రీనివాస్, దొరబాబు, ఎ.రాంబాబు, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. *దసపల్లా పార్క్ అభివృద్ధికి ఆదేశం* వార్డులో తుప్పలతో నిండిపోయిన దసపల్లా లే అవుట్ పార్క్ లో తక్షణమే జంగిల్ క్లియరెన్స్ చేయాలని గంటా ఆదేశించారు. చుట్టూ అపార్ట్మెంట్లు ఉన్న ఈ ప్రాంతంలో పార్క్ అభివృద్ధికి కాలనీ అసోసియేషన్ ముందుకు రావాలని కోరారు. చుట్టుపక్కల పిల్లలు, పెద్దలు వినియోగానికి వీలుగా పార్క్ లో ఆట వస్తువులు.. వాకింగ్ ట్రాక్ వంటివి ఏర్పాటు చేయాలన్నారు. జోన్ 2 పరిధిలోని మెజారిటీ పార్క్ లు ఇదే స్థితిలో ఉన్నాయని స్థానిక నాయకులు ఫిర్యాదు చేయగా.. మొత్తం పార్క్ లు, వాటి ప్రస్తుత పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని అధికారులకు చెప్పారు. అలాగే పార్క్ లోపల నుంచి పారుతున్న మురుగునీరు సమస్య పరిష్కారానికి డ్రెయిన్ ప్రతిపాదించాలన్నారు.

విశాఖపట్నం

విశాఖపట్నంలోని ప్రముఖ ప్రాంతాలలో విశాఖ పుస్తక మహోత్సవం ప్రచార కార్యక్రమాలు

*విశాఖపట్నం డిసెంబర్ 21పున్నమి ప్రతినిధి* ఈరోజు విశాఖపట్నంలోని ప్రముఖ ప్రాంతాలలో విశాఖ పుస్తక మహోత్సవం ప్రచార కార్యక్రమాలు నిర్వహించాము. ఈ సందర్భంగా విశాఖ ప్రజలకు విశాఖ పుస్తక మహోత్సవం లక్ష్యాలు, ఉద్దేశాలు వివరించాం. ఈ పుస్తక మహోత్సవంలో 100కు పైగా ప్రచురణకర్తల పుస్తకాలు, 1 లక్షకు పైగా పుస్తక శీర్షికలు ఒకే వేదికపై ప్రదర్శనకు రానున్నాయని తెలియజేశాం. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో సాహిత్యం, నవలలు, కథలు, కవిత్వం, చరిత్ర, విజ్ఞానం, వ్యక్తిత్వ వికాసం, బాల సాహిత్యం, ప్రాచీనా గ్రంథాలు తదితర విభాగాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయని ప్రజలకు వివరించాం. ప్రచార కార్యక్రమాలకు విశాఖ ప్రజలు సానుకూలంగా స్పందించారు. పుస్తక పఠనాన్ని ప్రోత్సహించే ఇలాంటి కార్యక్రమాలు తరచుగా జరగాలని, సమాజానికి ఇవి ఎంతో అవసరమని పలువురు అభిప్రాయపడ్డారు. నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో కిరణ్ – విజయవాడ బుక్ ఫెస్టివల్ కోఆర్డినేటర్, భరత్ సాయి పాల్గొన్నారు.

విశాఖపట్నం

విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు

సోమవారం జివిఎంసి లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం . -విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు. -జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్. *విశాఖపట్నండిసెంబర్ 21పున్నమి ప్రతినిధి * : మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోను, అన్ని జోనల్ కార్యాలయాలలోనూ “ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( Public Grievance Redressal system-PGRS )కార్యక్రమం” 2025 డిసెంబర్ 22వ తేదీ సోమవారం ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు నిర్వహించబడునని విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్ పత్రికా ప్రకటన ద్వారా ఆదివారం తెలిపారు. కావున, నగరంలో పారిశుద్ధ్యం, పట్టణ ప్రణాళిక విభాగం, నీటి సరఫరా, వీధి దీపాలు,హారికల్చర్, రెవిన్యూ, యు సి డి, ఇంజినీరింగ్ మొదలగు జీవీఎంసీ విభాగాలకు సంబంధించిన సమస్యలపై డిసెంబర్ 22 వ తేదీ సోమవారం ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో నగర ప్రజలు అర్జీల ద్వారా సమస్యలను తెలియపరుచుకోవచ్చునని నగర ప్రజలకు విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్ తెలియచేశారు.

ఆంధ్రప్రదేశ్

ప్రజా సేవకు ముందంజలో ముత్తూట్ ఫిన్ కార్ప్… – ముత్తూట్ పాప్చన్ ఆశయాలకు అనుగుణంగా సేవలు – 135 సంవత్సరాలు దాటిన చరిత్ర

కాకినాడ జిల్లా,పున్నమి ప్రతినిధి: ప్రజా సేవలో బ్యాంకులకు దీటుగా సేవలందిస్తున్న సంస్థ ముత్తూట్ ఫిన్ కార్ప్ (బ్లూ ముత్తూట్) అని జోనల్ హెడ్ అర్ మణి కిరణ్ అన్నారు. స్థానిక కాకినాడ బానుగుడి కూడలి చార్మినార్ టీ సెంటర్ వద్ద ఉన్న ముత్తూట్ ఫిన్ కార్ప్ కాకినాడ 3 బ్రాంచ్ నందు ఖాతాదారులకు లక్కీ డ్రా ఏర్పాటు చేశారు. ఈ లక్కీ డ్రా లో కరణం రామ కిషోర్ రిఫ్రిజిరేటర్ గెలుపొందారు.దీనికి ఏరియా మేనేజర్ బత్తుల చంద్ర శేఖర్ అధ్యక్షత వహించగా, కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ముత్తూట్ ఫిన్ కార్ప్ జోనల్ హెడ్ అర్ మణి కిరణ్ మరియు రీజినల్ మేనేజర్ శ్రీనివాస్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా జోనల్ హెడ్ అర్ మణి కిరణ్ మాట్లాడుతూ లక్కీ డ్రాలో రిఫ్రిజిరేటర్ గెలుపొందిన కరణం రామ కిషోర్ కు శుభాకాంక్షలు తెలిపారు, ముత్తూట్ ఫిన్ కార్ప్ లిమిటెడ్ నందు అనేక సేవలు అందుబాటులో ఉన్నాయని గోల్డ్ , వ్యాపారం, వాహనం , ఈ స్వర్ణ సేవింగ్స్ 50 రూపాయల నుండి ఎంతైనా చేసుకోవచ్చు అని అన్నారు. అతి తక్కువ వడ్డీ తో అన్నీ రకాల సేవలు ఒకే చోటు ఉండటం అది ముత్తూట్ ఫిన్ కార్ప్ నందు ఉండటం గర్వకారణం గా ఉంది అని అన్నారు. ఉభయ గోదావరి జిల్లాలలో దాదాపు ముత్తూట్ ఫిన్ కార్ప్ 68 బ్రాంచ్ లు ఉన్నాయని అందులో లక్కీ డ్రా కాకినాడ 3 బ్రాంచ్ కు లభించిందని తెలిపారు. అనంతరం ఏరియా మేనేజర్ బత్తుల చంద్ర శేఖర్, కాకినాడ 3 బ్రాంచ్ మేనేజర్ ఎస్ ఎన్ ఎస్ శ్రీ లక్ష్మీ లు సంయుక్తంగా మాట్లాడుతూ ముత్తూట్ ఫిన్ కార్ప్ సేవలను పొందిన వినియోగదారులకు ప్రత్యక కృతఙ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏరియా మేనేజర్ బి.చంద్ర శేఖర్,మార్కెటింగ్ హెడ్ చైతన్య, బ్రాంచ్ మేనేజర్ ఎస్. ఎన్. ఎస్. శ్రీలక్ష్మి, మరియు కాకినాడ 3 బ్రాంచ్ సిబ్బంది కట్టమూరి సంతోష్ కుమార్, రాయవరపు లక్ష్మీ, కె. సాయి బాబు, ఎస్. లోకేష్, జి. హారిక మరియు కాకినాడ 3 బ్రాంచి వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన నగర మేయర్

చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన నగర మేయర్ *విశాఖపట్నం డిసెంబర్ 21పున్నమి ప్రతినిధి* పోలియో రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా నగరంలో 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరిగిందని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన 8 వ జోన్ పెందుర్తి రాజచెరువు అంగనవాడి కేంద్రం, పాత పెందుర్తి జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్లో ఉన్న అంగన్వాడి కేంద్రాలలో డిసెంబర్ 21 పోలియో ఆదివారం సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ నిండు జీవితానికి రెండు చుక్కలని, పోలియో ఆదివారం సందర్భంగా 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలియో రహితాంధ్రప్రదేశ్ లక్ష్యంగా కృషి చేస్తున్నారని తెలిపారు. నేడు పోలియో చుక్కలు వేసేందుకు వీలుకాని చిన్నారులకు డిసెంబర్ 22, 23 వ తేదీల్లో ఏ.ఎన్.ఎంలు ఇంటింటికి వచ్చి పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. అలాగే పోలియో చుక్కలు వేయించుకునేందుకు వచ్చిన చిన్నారుల తల్లిదండ్రులతో ఆప్యాయతగా పలకరించి పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని మేయర్ తెలిపారు. నేడు నగరంలో ప్రతి అంగన్వాడి కేంద్రం వద్ద పాఠశాలల్లో, బస్టాండ్లో , రైల్వే స్టేషన్, రైతు బజార్లు లో పోలియో చుక్కలు వేయడం జరిగిందన్నారు . ఈ కార్యక్రమంలో వార్డు ప్రెసిడెంట్లు రాజేంద్రప్రసాద్, పీలా జితేంద్ర, డాక్టర్లు, శానిటరీ కార్యదర్శులు, ఏఎన్ఎంలు, అంగన్వాడి సిబ్బంది, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన నగర మేయర్

చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన నగర మేయర్ *విశాఖపట్నం డిసెంబర్ 21పున్నమి ప్రతినిధి* పోలియో రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా నగరంలో 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరిగిందని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన 8 వ జోన్ పెందుర్తి రాజచెరువు అంగనవాడి కేంద్రం, పాత పెందుర్తి జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్లో ఉన్న అంగన్వాడి కేంద్రాలలో డిసెంబర్ 21 పోలియో ఆదివారం సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ నిండు జీవితానికి రెండు చుక్కలని, పోలియో ఆదివారం సందర్భంగా 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలియో రహితాంధ్రప్రదేశ్ లక్ష్యంగా కృషి చేస్తున్నారని తెలిపారు. నేడు పోలియో చుక్కలు వేసేందుకు వీలుకాని చిన్నారులకు డిసెంబర్ 22, 23 వ తేదీల్లో ఏ.ఎన్.ఎంలు ఇంటింటికి వచ్చి పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. అలాగే పోలియో చుక్కలు వేయించుకునేందుకు వచ్చిన చిన్నారుల తల్లిదండ్రులతో ఆప్యాయతగా పలకరించి పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని మేయర్ తెలిపారు. నేడు నగరంలో ప్రతి అంగన్వాడి కేంద్రం వద్ద పాఠశాలల్లో, బస్టాండ్లో , రైల్వే స్టేషన్, రైతు బజార్లు లో పోలియో చుక్కలు వేయడం జరిగిందన్నారు . ఈ కార్యక్రమంలో వార్డు ప్రెసిడెంట్లు రాజేంద్రప్రసాద్, పీలా జితేంద్ర, డాక్టర్లు, శానిటరీ కార్యదర్శులు, ఏఎన్ఎంలు, అంగన్వాడి సిబ్బంది, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి 53 వ జన్మదిన వేడుకలు

*విశాఖపట్నండిసెంబర్21పున్నమి ప్రతినిధి* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి 53 వ జన్మదిన వేడుకలు విశాఖ మాజీ మేయర్ శ్రీమతి శ్రీ గొలగాని హరి వెంకట కుమారి శ్రీనివాస్ క్యాంప్ ఆఫీస్ లో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో మహా విశాఖ నగర మాజీ మేయర్ కేక్ కట్ చేసి వృద్ధులకు మరియు పేద మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం చేశారు. అనంతరం మాజీ మేయర్ మాట్లాడుతూ పేద ప్రజలకు ఇంటింటి పెన్షన్ కార్యక్రమం గానీ గవర్నమెంట్ సేవలు ప్రజలకు చేసారువచేయటమే కాకుండా, ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన సంక్షేమ ప్రదాత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అని తెలిపారు*

విశాఖపట్నం

మహారాణిపెట పోలీసు ల వినూత్న ప్రయత్నం *

*మహారాణిపెట పోలీసు ల వినూత్న ప్రయత్నం * *విశాఖపట్నం డిసెంబర్21 పున్నమిప్రతినిధి* *డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గారి ఆదేశాల మేరకు* మహారాణిపేట పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీ జి . దివాకర్ యాదవ్ గారు కేవలం రౌడీ షీటర్స్ కు కౌన్సిలింగ్ మాత్రమే కాకుండా రౌడీ షీటర్స్ మరియు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులైన భార్య మరియు వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి ఒక వినూత్న కార్యక్రమం చేపట్టారు ఇందులో భాగంగా రౌడీ షీటర్స్ వాళ్ళ కదలికల పై ప్రత్యేక శ్రద్ద పోలీసులే కాకుండా మీరు కూడ ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని, వారి కదలికల పై ఎటువంటి అనుమానం వచ్చిన ఇంట్లో మరియు బయట ఏరియాలో ఎటువంటి అల్లర్లు చేసిన వెంటనే మహారాణిపేట పోలీస్ స్టేషన్ సీఐ అయినా నాకు గాని మా సిబ్బంది కి గాని సమాచారం ఇవ్వాలని మాయొక్క ఫోన్ నంబర్స్ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది. తద్వారా రౌడీ షీటర్స్ కదలికల పై మరింత నిఘా పెట్టవచ్చని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేయడమైనది.

విశాఖపట్నం

రక్షణ రంగ ఉద్యోగులు సేవలు అజరామరం*

*రక్షణ రంగ ఉద్యోగులు సేవలు అజరామరం* *ఘనంగా డాక్ యార్డ్ ఉద్యోగుల వన సమారాధన* *సందడి చేసిన జబర్దస్త్ నటులు* *విశాఖపట్నం డిసెంబర్ 21 పున్నమి ప్రతినిధి* దేశ ప్రగతిలో రక్షణ రంగ ఉద్యోగులు అందించిన సేవలు అజరామరమని భీమిలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు నెయగాపుల జనార్దన్ రావు .. ప్రముఖ గైనకాలజిస్ట్ బొత్స లక్ష్మీ కొండమ్మ లు కొనియాడారు.. ఆదివారం ఇక్కడ శ్రీనివాస కళ్యాణ మండపం ఆవరణలో డాక్ యార్డ్ ఉద్యోగుల కేటిబి అసోసియేషన్ వనసమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వీరు మాట్లాడుతూ ఒకవైపు ఉద్యోగులు అంకితభావంతో తమ విధులు నిర్వహిస్తూనే మరోవైపు సమాజ సేవా కార్యక్రమాల్లో డాక్ యార్డ్ ఉద్యోగులు ఎంతోమందికి ఆదర్శప్రాయులుగా నిలిచారన్నారు.. అందరూ సమైక్యంగా ఉండి కోరుకున్న ప్రగతి సాధించుకోవాలన్నారు.. ఉద్యోగులు.. కుటుంబ సభ్యులు.. పిల్లలు ఇలా అంతా ఒకే చోట చేరి సందడిగా గడపడం ఎంతో మధురానుభూతిని కలిగిస్తుందన్నారు.. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు.. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ అసోసియేషన్ లో సభ్యుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతిస్తూనే మరోవైపు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.. సభ్యులు పిల్లలకు ఉపకార వేతనాలు .. అలాగే వైద్య.. రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు.. .అధ్యక్షులు బత్తుల చిరంజీవి కార్యదర్శి విజనగిరి భాస్కరరావు లు మాట్లాడుతూ అందరి సహకారంతోనే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. వన సమారాధనలో సుమారు 900 మంది సభ్యులు వారి కుటుంబ సభ్యులు పాల్గొనగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.. *సందడిచేసిన జబర్దస్త్ నటులు* డాక్ యార్డ్ ఉద్యోగుల వన సమారాధన కార్యక్రమంలో జబర్దస్త్ నటులు బుల్లెట్ భాస్కర్.. అప్పారావు.. అల్లరి నరేష్ తదితరులు సందడి చేశారు.. వీరు చేసిన కామెడీ స్కిట్లు ఆహుతు లను విశేషంగా అలరించాయి.. కళాకారులకు.. నటులకు.. అతిధిలను ఘనంగా సత్కరించి గంట్ల శ్రీనుబాబు చేతుల మీదుగా జ్ఞాపికలు బహుకరించారు.

సాహితీ

ప్రేమ తపస్సు (1974 కథ) – డాక్టర్ బద్రి పీర్ కుమార్

విధ్యేంది అనే ఒక మారుమూల గ్రామంలో మారయ్య, శాంతి అనే ఇద్దరు దంపతులుండేవారు. శాంతి వందెకరాల భూమిగల ధనికురాలు. వీరిది ప్రేమ వివాహం, చాలా అన్యోన్య దాంపత్యం గడిపేవారు. వీరికి ఒక అమ్మాయి. పేరు ప్రేమ. వయసు 6 సంవత్సరాలు. శాంతికి తన కుమార్తెను చదివించాలని ఆకాంక్ష కాని తగిన వసతులు ఆ ఊళ్ళోలేవు. ఆ సమీపంలో ఉన్న పట్టణంలో చదివించాలంటే శాంతికి ఇష్టం లేదు. కొన్ని రోజుల తర్వాత అనారోగ్య కారణాల వలన శాంతి తన ఆస్తి మొత్తాన్ని ప్రేమ పేరున వ్రాసి మరణించింది. ప్రేమకు తల్లిలేని లోటును భర్తీచేయాలనే సదుద్దేశంతో మారయ్య చింతాంగి అనే తన అత్త కూతుర్ని మరలా వివాహం చేసుకున్నాడు. కానీ ఆమె మారయ్య జీవిత భాగస్వామిగా ప్రేమను తెలివి లేని మూర్ఖురాలిగా చేసి ఆస్తినంతటిని తాను అనుభవించాలన్న దురభిప్రాయం కల్గి ప్రేమ పట్ల అనుచితంగా ప్రవర్తించేది. మారయ్య బయటి పనులతో ఇంటి వద్ద ఉండేవాడు కాదు. 11 సంవత్సరాల తర్వాత ఊళ్ళో స్కూళ్ళు ప్రారంభించారు. ఆంధ్ర దేశంలో అక్షరాస్యత ఉద్యమం జోరుగా సాగుతోంది. “ప్రతి ఒక్కరు చదువు కోవాలి”, “ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు”, “విద్యా దానం మహాదానం”, “విద్య లేని వాడు వింత పశువు”, “ఇంటింటా చదువు దేశానికి వెలుగు”. ”అందరూ చదవాలి, అన్యాయాలను ఎదిరించాలి”. అను నినాదాలు ప్రతిఒక్కరి చెవులలో మారు మ్రోగుతున్నాయి. “విధ్యేంది” గ్రామంలో కూడా ప్రతి ఒక్కరూ చిన్నా, పెద్దా తేడా లేకుండా, అక్షరాస్యతా ఉద్యమంలో పాల్గొని చదువు నేర్చుకుంటున్నారు. కాని ఆ ఊరి పెద్ద మనిషి అయిన మారయ్య తన పెద్ద భార్య కుమార్తె ప్రేమను పాఠశాలకు పంపడం లేదు. కారణం అతని రెండవ భార్య చింతాంగి. ఈమె కసాయి హృదయురాలు. ప్రేమను ఏనాడు రెండుకళ్ళతో చూడలేదు. ప్రేమ వయస్సు ఇప్పుడు 17 సం॥లు. చిన్నప్పటి నుంచి చదువు పట్ల ఆసక్తి ఉన్నా అమాయకంగా కనపడేది. బడికెళుతున్న వారిని చూసి “నాకు ఆ అదృష్టం లేదని” తనలో తాను మదనపడుతూ ఉండేది. మారయ్య చాలా సహృదయుడు మరియు పిరికి వాడు. గ్రామంలో ఇతరులకు చాలా గంభీరంగా కనబడతాడు. తన రెండవ భార్య దగ్గర మాత్రం పిల్లిలా ప్రవర్తించేవాడు. ఓ రోజు ప్రేమ మనోవేదనను గ్రహించి, “చూడమ్మా .. ప్రేమ.. మీ పిన్నమ్మ నీకు ఈ ఊరిలో చదువు రానివ్వదు.. నీవు చదివితే ఏదో ప్రయోజకురాలు అవుతావనీ.. తనకు చదువు లేదని.. నీవు గొప్ప విద్యావంతురాలు అయితే.. తనను లెక్క చేయవని మూర్ఖత్వంతో నిన్ను ఇలా కష్టబెడుతుంది.. మీ అమ్మే బ్రతికి ఉంటే ఈ చింతాంగి నా భార్య అయ్యేదా..? నీకు ఈ గతి పట్టేదా..? పట్టేది కాదు… ఈ వేళకు ఇంటర్ చదువుతూ ఉండే దానివి..” అని చింతించిగ మనసులో ఒక మెరుపులాంటి ఆలోచన కలిగింది. “మీ పిన్ని వాళ్ల పుట్టింటికి పనిమీద వెళ్ళింది. రేపు ఉదయాన్నే .. నాతో బయలు దేరు. ఇదే సరైన సమయం తను చూసిందంటే నిన్ను నాతో ఎప్పటికీ పంపదు. హైదరాబాద్లో నా స్నేహితుడు హైస్కూలు హెడ్మాస్టర్ చాలా మంచి వాడు. నిన్ను అతని దగ్గర వుంచితే… నీ పట్టుదలకు.. ఆసక్తికి.. గొప్ప విద్యావంతురాలు అవుతావు. ఏకువ జామునే తయారవ్వు..” అని మారయ్య అనగానే ప్రేమకు గొప్ప ఉపశమనం కలిగి ‘అలాగే’ అని తలూపింది. ఉదయం ఆ ఊరి మొదటి బస్సు హైదరబాద్ బస్సు వచ్చేవేళకు బయలుదేరుతారు. బస్సు స్టేజి దగ్గర ఆగింది. మారయ్య, ప్రేమ బస్సెక్కారు. ఈ విషయం తెలుసుకున్న చింతాంగి అదే సమయానికి వచ్చి బయలు దేరుతున్న బస్సును, తన అనుచరుల చేత ఆపించింది. మారయ్య డ్రైవర్ను గదమాయించి “నీవు పోనివ్వు బస్సును” అన్నాడు. చింతాంగి మారయ్యతో “దీన్ని పట్టణానికి పంపి చదివించావంటే.. నీ పెద్ద భార్య ఆస్తి నాకు చిల్లిగవ్వంత కూడా రాదు.. అప్పుడు నీవు.. నేను.. నెత్తిన గుడ్డేసుకొని ఏడ్వాలి.. ముందు దిగు” అని కరిచినట్లుగా అరుస్తుంది. “ఛీ.. నీచురాలా.. నీవు కసాయిదానివే అనుకున్నాను.. కానీ ఇప్పుడు మెదడు లేని గ్రుడ్డిదానివని భావిస్తున్నాను” అన్నాడు మారయ్య అసహనంగా. విషయం గ్రహించిన బస్సు డ్రైవర్ చింతాంగి మాటలు లెక్కచేయక ఆమెను క్రిందకు దించి బస్ స్టార్ట్ చేశాడు. *** హెడ్ మాస్టర్ శాంతి స్వరూప్ చమత్కారి వినయశీలుడు మరియు ధర్మాత్ముడు. తన భార్యతో “ఏమే.. కాంతం.. ఎవరొచ్చారో చూడు.. మారయ్యను చూసి చాలా కాలం అయింది..” “అరే ప్రేమ ఎంత ఎదిగిపోయింది.. చూసి పదేండ్లయింది” అంటూ కాంతం వంటగదిలో నుంచి వచ్చి స్వాగతం పలికింది. మారయ్య వారి ఆప్యాయతకు కృతజ్ఞుడై ఆనంద భాష్పాలు రాల్చాడు. “రేయ్ ఏరా.. చిన్న పిల్లవాడిలా ఏడుస్తున్నావ్.. ఊరుకో.. పరిస్థితి నాకు అంతా తెలుసు.. నీకు నేను దూరంగా ఉన్నా పుట్టిన ఊరు విషయాలు.. అందులో నా ఆప్తుల సంగతులు తెలుసుకుంటూ ఉంటాను.. ప్రేమను బాగా చదివించి.. నా కోడల్ని చేసుకుంటాను” అని శాంతి స్వరూప్ అంటుండగా కాస్త స్థిమిత పడి “విజయ్ ఇప్పుడు ఏంచేస్తున్నాడు” అన్నాడు మారయ్య. ”వాడు పూణేలో ఆర్మీ కాలేజీలో డిగ్రీ జాయిన్ అయ్యాడు.. ఆర్మీలో చేరి దేశ రక్షణలో తన వంతు సేవ చేయాలని వాడి కోరిక.. నేను చేయలేని పని నా కుమారుడు చేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది..” అంటూ భావోద్వేగం నుండి తేరుకుని “నీవు నిశ్చింతగా ఉండు” అన్నాడు స్వరూప్ ఓదార్పుగా. “ఏంటన్నయ్యా.. ప్రేమ నా కూతురు లాంటిది.. చింతాంగి చేతులో ఎంత నలిగిందో నాకు తెలుసు.. బాగా చదివించి, ఆ చింతాంగి కళ్ళు తెరిపిస్తాము.. పుట్టుగొడ్రాలు.. నీ కర్మ పట్టి ఆమెను పెళ్ళి చేసుకున్నావు” అంది కాంతం చింతాంగిపై అసహనంతో. “అవన్ని ఎందుకులే కాంతం.. ముందు మీ అన్నయ్యను ప్రేమను విశ్రాంతి తీసుకోనివ్వు.. అంత దూరం ప్రయాణం చేసి వచ్చారుగా.. ప్రేమ.. నీవు పైనున్న గది లో ఫ్రెష్అప్ అయ్యిరా” అంటూ శాంతి స్వరూప్ తన బుక్ స్టాండ్లో పెద్ద బాలశిక్ష తీసుకొని చదువుతున్నాడు. “ఏరా స్వరూప్.. ఈ వయస్సులో నీకు పెద్ద బాలశిక్ష అవసరం ఏంటిరా” అన్నాడు మారయ్య. ”అదే నీకు.. నాకు.. తేడా.. దీనిలోని సారాంశాన్ని ప్రేమకు తెలియజెప్పాలి”.. కాంతం ప్రేమ ఫ్రెష్ అయి రాగానే అందరికీ వడ్డించు చాలా పని ఉంది. నేను అనుకున్నది నెరవేర్చాలి.. ప్రేమను ప్రయోజకరాలిని చేయాలి” అన్నాడు శాంతి స్వరూప్. ”అబ్బబ్బ అన్నయ్య.. ఇక ఈయన.. ప్రేమను డిగ్రీ చదివించినంత వరకు నిద్రపోడు.. నన్ను నిద్ర పోనివ్వడు”. నవ్వుతూ వినయంగా అంది కాంతం మారయ్యతో. “అమ్మా .. ప్రేమ భోంచేసిన తర్వాత ఈ రోజు బాగా విశ్రాంతి తీసుకో.. నీ విద్యాభ్యాసం రేపటి నుంచే మొదలెడతా” అన్నాడు శాంతి స్వరూప్ ప్రేమ ఫ్రెష్అయి రాగానే. “అలాగేనండి” అంది ప్రేమ వినయంగా అమాయకత్వపు చూపుతో. మధ్యాహ్నం భోజనం చేసి “అమ్మా ప్రేమ.. మాస్టర్ చెప్పినట్లు నడుచుకో” అని ప్రేమకు చెప్పి “మరి నేను వెళ్ళాస్తా స్వరూప్.. వెళ్ళొస్తాను కాంతమ్మా..” అని విద్యేందికి బయలు దేరాడు మారయ్య. అతని పరిస్థితి తెలిసిన కాంతం, స్వరూప్ కనీసం ఆ రోజంతా కూడా ఉండమని చెప్పనందుకు చింతించి ప్రేమ భవిష్యత్తుకై తమ దైనందిన కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. *** ఆరోజు రాత్రికి తన ఇంటికొచ్చిన మారయ్య పామువలె బుసలు కొడుతున్న చింతాంగిని ఏ మాత్రం పలకరించకుండా తన పనులు తానే చేసుకుంటూ జీవితం కొనసాగించాలని అనుకున్నాడు. మరునాడు ఉదయం 5 గం॥లకు అలార్మ్ మ్రోగింది వెంటనే శాంతి స్వరూప్ నిద్రలేచి ప్రేమకు సంబంధించిన విద్యాభ్యాస ప్రణాళికను తయారు చేశాడు. 6 గంటలకు ప్రేమను నిద్రలేపాడు. ఆ రోజు అక్షరమాలను పెద్ద బాలశిక్ష సారాంశాన్ని నేర్పించాడు. దీనికి ప్రేమ యొక్క ఆసక్తి, ఏకాగ్రత, పట్టుదల మరియు స్వరూప్ యొక్క సులభ బోధనాశైలి దోహదపడ్డాయి. 10వ తరగతిలోపు విద్యాంశాలను 10 రోజులలో ప్రేమ నేర్చుకున్నది. శాంతి స్వరూప్ అతని స్నేహితులయిన ఇతర ఉద్యోగస్తులు కూడా, ప్రేమ తెలివి తేటలకు ఆశ్చర్య పోయారు. తెలిసిన ప్రతివారి నుంచి ప్రశంసలు వచ్చాయి. శాంతి స్వరూప్ హృదయం ఆనందంతో ఉప్పొంగి పోయింది. అందరి అభినందనలతో ప్రేమను తను పనిచేస్తున్న స్కూల్లో 10వ తరగతిలో చేర్చాడు. కాంతం ప్రేమను తన కుమార్తెలా చూసుకొంటోంది. ప్రేమ పదవ తరగతి సంవత్సర పరీక్షలు వ్రాసి 90 శాతం మార్కులు సంపాదించింది. ఈ విషయం తెలిసిన తండ్రి మారయ్య సంతోషించాడు. “ఆc.. ఆ.. చదివింది చాలు ఇకనయినా ఇంటికి తీసుకురండి” అంది పైకి ప్రేమున్నట్లుగ చింతాంగి. ఈమె అంతర్గత భావన తెలిసిన మారయ్య వినిపించకోక తన కుమార్తె గొప్ప పండితురాలవుతుందని భావించి మనసున కొండనెత్తినంతగ ఆనందించాడు. *** శాంతి స్వరూప్ సహకారంతో మారయ్య ప్రోత్సాహంతో ప్రేమ B.A. డిగ్రీ పుచ్చుకొని సివిల్ సర్వీస్ పోటీ పరీక్షలు వ్రాసి 3వ ర్యాంక్ సాధించింది. సివిల్ సర్వీస్ రిక్రూట్మెంట్ I.A.S. ఇంటర్వూకు కాల్ లెటర్ వచ్చింది. శాంతి స్వరూప్ ఎంతో ఆనందించాడు. “అమ్మా ప్రేమ నీకు ఇంటర్యూ వచ్చింది. నీవు తప్పకుండా కలెక్టరు అవుతావు” అన్నాడు. ప్రేమ ఆనందానికి హద్దులు లేవు. తన చనిపోయిన అమ్మను గుర్తుకు తెచ్చుకొని మౌనముగా ఉండిపోయింది … మరుసటి రోజు ఉదయం 10 గం॥లకు ఇంటర్వూ. ఇంటర్వ్యూ హాల్ లో, బెల్ మ్రోగింది ప్రేమకు ఎంత ప్రతిభ ఉన్నా బోర్డు సభ్యులను చూసి కొద్దిగ జంకింది. ఇంటర్వూ బోర్డ్ సభ్యులు ప్రేమను చూసి ఆమె బాహ్య రూపం అమాయకంగా కన్పించుట వలన తక్కువగా అంచనా వేసి, మొదట చిన్న ప్రశ్నలు అడిగారు. ” నీవు వ్రాసిన ప్రవేశ పరీక్షలో మొదటి ప్రశ్న ఏదీ?, “జర్మనీలో నాజీజమ్ స్థాపకుడు ఎవరు?” “హిట్లర్” అంది ప్రేమ. “వెరీగుడ్” అన్నాడు ఇంటర్వ్యూ బోర్డ్ సభ్యుడు ఒకరు. ఈమె చురుకైన జవాబులు విన్న బోర్డు సభ్యులు పెద్ద ప్రశ్నలు వేయడం మొదలు పెట్టారు. “ప్రతి మనిషికి ఉండాల్సిన ధ్యేయం ఏమిటి?”

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.