Tuesday, 5 May 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నిండు జీవితానికి – రెండు చుక్కలు

*జాతీయ పోలియో దినోత్సవం* అయిన ఈరోజు *21.12.2025* అనగా *ఆదివారం ఉదయగిరి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారి ఆదేశాల మేరకు వింజమూరు మండల కేంద్రంలో పోలియో దినోత్సవ సందర్భంగా పాల్గొన్న వింజమూరు మండల కో ఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ గని శ్రీనివాసులు నాయుడు ప్రతి *0..నుంచి5సంవత్సరాలలోపు* ఉన్న ప్రతిచిన్నారికి పోలియో చుక్కలను వేయించాలని పోలియోవ్యాధి నుంచి శాశ్వత రక్షణ భవిష్యత్ తరాలకు ఆరోగ్యమైన జీవితం ఉంటుందన్నారు. ఒక చుక్క – జీవితాంతం భద్రత పోలియో రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యవంతమైన సమాజం మన లక్ష్యం అని పేర్కొన్నారు. మీ సమీపంలోని పోలియో కేంద్రంలో చుక్కలను వేయించాలని చెప్పారు. పోలియో మహమ్మారిని తరిమికొడదాం చిన్నారుల బంగారు భవిష్యత్తుకి బాటలు వేద్దామని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశాఖ అంగన్ వాడీ సిబ్బంది మానస .జయలక్ష్మీ. వసుందర తదితరులు పాల్గొన్నారు మీ గని శ్రీనివాసులు నాయుడు వింజమూరు మండల కో ఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్

విశాఖపట్నం

అంతర్జాతీయ వాకర్స్ సేవలు ప్రపంచానికే ఆదర్శనీయం! నగర పోలీస్ కమీషనర్ డాక్టర్ శంక భ్రత బాగ్చి

అంతర్జాతీయ వాకర్స్ సేవలు ప్రపంచానికే ఆదర్శనీయం నగర పోలీస్ కమీషనర్ డాక్టర్ శంక భ్రత బాగ్చి ఘనంగా వాకర్స్ ఇంటర్నేషనల్ సదస్సులో … దేశ విదేశాల నుండీ పాల్గొన్న 1650 వాకర్స్ క్లబ్స్ అధినేతలు, ప్రతినిధులు. వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, సామాజిక సేవాచైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్న వాకర్స్ ప్రపంచానికే ఆదర్శనీయమని నగర పోలీస్ కమీషనర్ డాక్టర్. శంక భ్రత బాగ్చి కొనియాడారు. సిరిపురంలోని ఉడా చిల్డ్రన్స్ ఎరీనా పార్క్ లో శనివారం నాడు ’34వ వాకర్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ లో ఆయన ముఖ్య అతిధిగా ప్రసంగిస్తూ దైనందిన జీవనంలో నడకను వ్యాయామంగా మార్చుకోవడం ద్వారా రక్త ప్రశరణలో వేగం పెరిగి గుండెకు సంబంధిత ప్రాణాంతక వ్యాధుల నుండీ ఉపశమనం లభిస్తుందన్నారు. సైబర్ క్రైమ్ పై అవగాహన ఈ సదస్సులో డా. బాగ్చి “సైబర్ క్రైమ్” పై అవగాహన కల్పిస్తూ స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ సైబర్ క్రైం బాదితులే నని, విదేశాలలో ఉద్యోగాలను ఇప్పిస్తామని చెప్పి, మన యువతకు డబ్బు ఆశచూపి వారిని ఈ బ్లాక్ మెయిల్ చేస్తూ దాదాపు మూడు వందల కోట్లు దోచేశారన్నారు.సైబర్ నేరగాళ్ల నుండీ అప్రమత్తంగా ఉండాలని, వెంటనే భయపడకుండా నేరుగా తననే సంప్రదించవవచ్చునన్నారు. వాకర్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ చైర్మన్ డా. కమల్ బయిద్ ఆధ్వర్యంలో అధ్యక్షులు కె. ప్రభావతి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో పూర్వ అధ్యక్షులు ఎస్. పి. రవీంద్ర మాట్లాడుతూ ప్రతీ వాకర్ ఓ సైనికుడే నన్నారు. *”నడవండి – నడిపించండి”* నినాదంతో తన తండ్రి స్వర్గీయ సుంకర ఆళ్వార్ దాస్ 1986 సం.లో విశాఖపట్నంలో స్థాపించిన ‘వాకర్స్ ఇంటర్నేషనల్’ నేడు దేశ, విదేశాలలో మూడు లక్షలకు పైగా సభ్యులతో, 1650 శాఖలుగా విస్తరించిడం ఆనందనీయమన్నారు. ఈ సదస్సులో వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కె. ద్వారాకానాధ్, వాకర్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ మీడియా కన్వీనర్స్ నండూరి రామకృష్ణ, సి హెచ్. శ్రీనివాసరాజు, డాక్టర్ డి డి నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

భక్తి

ర్యాలి గ్రామంలో ధనుర్మాస ఉత్సవాలు

తూర్పుగోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి ✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం సీనియర్ రిపోర్టర్ 9989086083. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలో వెలిసిన జగన్మోహిని కేశవ స్వామి దేవస్థానం లో ధనుర్మాస ఉత్సవాలు సందర్భంగా స్వామి వారు విశేషాలు అలంకారంతో భక్తులకు దర్శనమిస్తున్నారు ఉదయం నుంచే ఆలయ ప్రయాణం భక్తులతో కళకళలాడుతోంది ఈ ఉత్సవాలు విష్ణు భక్తికి అత్యంత ప్రాధాన్యం కలిగిన కాలంగా భావిస్తారు ఈ మాసంలో నిత్య పూజలు, ప్రత్యేక అలంకరణలో ధార్మిక కార్యక్రమాలు భక్తుల భవాలని మరింత బలపరుస్తాయి స్వామివారిని రకరకాల పద్ధతిలో అలంకరిస్తూ ఉంటారు ఈ మాసాన్ని వైష్ణవులకు ముఖ్యమైన మాసంగా పరిగణిస్తారు. END

ఆంధ్రప్రదేశ్

ప్రతి బిడ్డ ఆరోగ్యం గా ఎదగడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం :పెడన MLA కాగితకృష్ణప్రసాద్

బంటుమిల్లి మండలం బంటుమిల్లి బస్టాండ్ వద్ద, మరియు కృత్తివెన్ను మండలం చిన్న పాండ్రాక ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు ప్రభుత్వం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని స్వయం గా చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్. ఆయన మాట్లాడుతూ పల్స్ పోలియో శిబిరాలలో 5 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, వైద్యసిబ్బంది గ్రామాలలో ఐదేళ్ల లోపు చిన్నారులను గుర్తించి పోలియో చుక్కలు వేయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలియో చుక్కలు వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా తెలిపారు. ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలనే సంకల్పంతో, ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఇలాంటి కార్యక్రమాలకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తాం అని అన్నారు.

ఆంధ్రప్రదేశ్

పోలియో డే……….

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ 21న రాష్ట్రంలో ఐదేళ్లలోపు 54 లక్షల మందికి పైగా పిల్లలకు పోలియో చుక్కలు వేయాలనే లక్ష్యంతో పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేపట్టనుంది. శనివారం ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ కమిషనర్ జి. వీరపాండియన్, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కాకినాడలోని ఒక పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఆదివారం ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభిస్తారని ప్రకటించారు. రాష్ట్ర ఆరోగ్య అధికారులు ఐదేళ్లలోపు 54.07 లక్షల మంది పిల్లలను లక్ష్యంగా చేసుకుని, 98.99 లక్షల డోసులను సిద్ధం చేశారు. ఈ కార్యక్రమం అమలును పర్యవేక్షించడానికి జిల్లాల్లో నోడల్ అధికారులను కూడా నియమించారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, తల్లిదండ్రులు ముందుకు వచ్చి తమ ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో టీకా వేయించుకునేలా చూడాలని పిలుపునిచ్చారు. టీకా వేయడంలో ఆరోగ్య సిబ్బందికి సహకరించాలని వారికి సూచించారు. అధికారులు ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు మరియు ఇతర ఆరోగ్య సిబ్బందిని భాగస్వామ్యం చేస్తూ, పిల్లలకు పోలియో చుక్కలు వేయడానికి రాష్ట్రవ్యాప్తంగా బూత్‌లను ఏర్పాటు చేశారు. ఆదివారం వివిధ కారణాల వల్ల అర్హులైన పిల్లలు టీకా వేయించుకోలేకపోతే, ఆరోగ్య సిబ్బంది డిసెంబర్ 22 మరియు 23 తేదీలలో వారి ఇళ్లకు వెళ్లి ఇంటి వద్దే పోలియో చుక్కలు వేస్తారు. పిల్లలను గుర్తించి పోలియో చుక్కలు వేయడానికి ట్రాన్సిట్ బృందాలు తిరుగుతాయి. అలాగే బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, పర్యాటక ప్రదేశాలు, మార్కెట్లు మరియు ఇతర ప్రదేశాలలో కూడా పోలియో టీకా ఇవ్వడానికి ట్రాన్సిట్ బూత్‌లను ఏర్పాటు చేశారు.

E-పేపర్

జిల్లా స్థాయిలో ప్రతిభ చాటిన రౌతులపూడి హై స్కూల్ విద్యార్థులు.

రౌతులపూడి, (పున్నమి ప్రతినిధి )డిసెంబర్ 21: జిల్లా స్థాయిలో జరుగుతున్న సైన్స్ ఫేర్ కార్యక్రమంలో రౌతులపూడి విద్యార్థునీ సత్తా సాటి ద్వితీయ స్థానంలో నిలిచిందని ప్రధానోపాధ్యాయుడు కోళ్ల రాంబాబు తెలిపారు. తను చేసిన గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు గాను జిల్లాలో ద్వితీయ స్థానానికి ఎంపికైందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రౌతులపూడి జిల్లా పరిషత్ స్కూల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ షేక్ సలీం మరియు ఉపాధ్యాయ సిబ్బంది ఆ విద్యార్థిని అభినందించారు.

ఖమ్మం

సిరి గోల్డ్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు – దుష్ప్రచారం చేస్తే పరువు నష్టం దావా — ఖమ్మం బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు స్పష్టం

ఖమ్మం, డిసెంబర్ (పున్నమి జిల్లా ప్రతినిధి) సిరి గోల్డ్ సంస్థ వ్యవహారంలో తనపై వస్తున్న ఆరోపణలను ఖమ్మం బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. రాజకీయ కుట్రలో భాగంగానే కొందరు కావాలని తన ప్రతిష్ఠను దెబ్బతీయడానికి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సిరి గోల్డ్ సంస్థతో తనకు గానీ, తన పెట్టుబడులకు గానీ ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టంచేశారు. ఆ సంస్థలో తాను డబ్బులు వసూలు చేసినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమని కొట్టిపారేశారు. రాజకీయంగా ఎదుర్కోలేకే కొంతమంది కావాలని బురదజల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని, త్వరలోనే పరువు నష్టం దావా వేయనున్నట్లు హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఈ సందర్భంగా నెల్లూరి కోటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.

తిరుపతి

శ్రీ భక్త కన్నప్ప ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైధ్యసిభిరం

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 20, శ్రీకాళహస్తి పట్టణంలోని కొత్తపేట గాండ్ల వీధి, శ్రీ రామా ఆలయం నందు శ్రీ భక్త కన్నప్ప కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం జరిగినది ఈ పరీక్షలలో 80మంది పేషెంట్లు చూపించుకోవడం జరిగినది వీరిలో 10 మంది కంటి శుక్లాలు ఉన్నాయని గుర్తించడం జరిగినది. వచ్చిన వారందరికీ ఉచిత మందులు పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో హాస్పిటల్స్ స్టాప్ శ్రీ T.జయచంద్రప్ప,M.భవానీ , SSF కార్యకర్తలు వరలక్ష్మి , గంగరాజు, వైశాలి, ముని కుమారి, తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీ భక్త కన్నప్ప ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైధ్యసిభిరం

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 20, శ్రీకాళహస్తి పట్టణంలోని కొత్తపేట గాండ్ల వీధి, శ్రీ రామా ఆలయం నందు శ్రీ భక్త కన్నప్ప కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం జరిగినది ఈ పరీక్షలలో 80మంది పేషెంట్లు చూపించుకోవడం జరిగినది వీరిలో 10 మంది కంటి శుక్లాలు ఉన్నాయని గుర్తించడం జరిగినది. వచ్చిన వారందరికీ ఉచిత మందులు పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో హాస్పిటల్స్ స్టాప్ శ్రీ T.జయచంద్రప్ప,M.భవానీ , SSF కార్యకర్తలు వరలక్ష్మి , గంగరాజు, వైశాలి, ముని కుమారి, తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

తొట్టంబేడు పంచాయతీలో వీది దీపాలు ఏర్పాటు

తొట్టంబేడు పున్నమి న్యూస్ డిసెంబర్ 20, తొట్టంబేడు మండలంలోని తొట్టంబేడు పంచాయతీ పరిధిలోని సచివాలయం 1,2 లోని పరిధిలోగల బంగారమ్మ కాలనీ, సాయి నగర్, ఎల్ఐసి కాలనీ, ఈదులు గుంట, శ్రీరామ్ నగర్, చిలక వారి కండ్రిగ, రామచంద్రపురం ప్రాంతాల్లో తొట్టంబేడు మండలం అధ్యక్షులు రావెళ్ల మునిరాజు నాయుడు, ఎంపీడీవో సురేంద్రనాథ్ సూచనల మేరకు విద్యుత్ లైట్లను పంచాయతీ కార్యదర్శి హరిప్రియ సర్పంచ్ సుబ్బయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుబ్బయ్య మాట్లాడుతూ..ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొన్నిచోట్ల వీధిలైట్లు మరమ్మతులు గురైనయని మరమ్మతులకు గురైన చోట్ల లైట్లును బాగు చేయడం, మరికొన్ని చోట్ల కొత్త లైట్లును ఏర్పాటు చేసామని లైట్ల ఏర్పాటు చేయడంలో తొట్టంబేడు సింగిల్ విండో చైర్మన్ భీమాల భాస్కర్ ముదిరాజ్, తొట్టంబేడు మండల టిడిపి కార్యదర్శి మనీ ముదిరాజ్ లు సహకరించారని అయన తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.