Wednesday, 6 May 2026

Blog

విశాఖపట్నం

గానగంధర్వులు ఘంటసాల . 13వ జయంతి.

విశాఖ డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) సందర్భంగా మాధవధార vu డా కాలనీ ఈస్ట్ పార్కు నందు కేఎన్ఆర్ ఫ్రెండ్స్ మరియు మస్తాన్ ఆర్కెస్ట్రా విజయనగరం వారి సంయుక్త ఆధ్వర్యంలో ఘంటసాల సినీ సంగీత విభావరి కార్యక్రమం జరిగింది. కార్యక్రమాన్ని జెడి ఫౌండేషన్ ఉత్తరాంధ్ర కన్వీనర్. కారుముడి అను. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించగా కేత నాగేశ్వరరావు మరియు ఇతర గాయకులు ఘంటసాల . సినీ గేయాలను అద్భుతంగా ఆలపించారు ఈ కార్యక్రమానికి వి గోవిందరాజు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఘంటసాల . పాటలను ఆలపించారు. కార్యక్రమం ఆద్యంతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

విశాఖపట్నం

పాత్రికేయులు పట్ల ప్రభుత్వం చిన్నచూపు తగదు : జాప్ విశాఖ జిల్లా అధ్యక్షులు కే ఎం కీర్తన్.

విశాఖ డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) విశాఖపట్నం : పాత్రికేయుల పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీవ్ర నిర్లక్ష్య వైఖరి పై జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) విశాఖ జిల్లా శాఖ అధ్యక్షులు కేఎం కీర్తన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పాత్రికేయులకు అక్రిడేషన్ల మంజూరులో విధిస్తున్న షరతులకు నిరసనగా నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద జాప్ విశాఖ ఆధ్వర్యంలో పాత్రికేయులు తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కీర్తన్ మాట్లాడుతూ ఇప్పటికే ఏడాదిన్నరకు పైగా అక్రిడేషన్ కార్డులను పొడిగిస్తూ రావడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. పాత్రికేయులకు అక్రిడేషన్ కార్డుల మంజూరు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడలపై విరుచుకుపడ్డారు. ప్రధానంగా చిన్న పత్రికల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తూర్పారబెట్టారు. ఎక్కడ ప్రింటింగ్ డిక్లరేషన్ ఎక్కడ ఉంటే ఆ జిల్లాలో మాత్రమే అక్రిడేషన్లు మంజూరు చేసే యోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉమ్మడి జిల్లాలో గతంలో మంజూరు చేసినట్లుగానే ఈ ఏడాది అక్రిడేషన్ కార్డులను ప్రభుత్వం జారీ చేయాలన్నారు. అక్రిడేషన్ కార్డుల మంజూరు చేసేందుకు విధి విధానాలు రూపొందిస్తే ప్రభుత్వం సీనియర్ జర్నలిస్టుల సలహాలను తీసుకోవాలని కీర్తన్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాన్ని నిర్వహించే కార్యక్రమాలు, పథకాలను విస్తృతంగా ప్రచారం చేయడంలో చిన్న పత్రికలు కీలకపాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పాత్రికేయుల పట్ల నిర్లక్ష్యపు ధోరణి విడనాడాలన్నారు. అక్రిడేషన్ కార్డుల మంజూరులో అన్యాయం జరిగితే ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని కీర్తన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించారు. జర్నలిస్టులను దారిద్యరేఖకు దిగువున ఉన్నవారిగా గుర్తించి వారికి ఇళ్ల స్థలాలు లేదా పక్కా గృహాలు మంజూరు చేయాలన్నారు. సీనియర్ జర్నలిస్టులకు పలు రాష్ట్రాలు ఇస్తున్న మాదిరిగా పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో జాప్ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి జే వి కేఅప్పలరాజు, తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్

నామినేషన్‌కు బయలుదేరిన కాంగ్రెస్ నాయకులు

పున్నమి ప్రతినిధి నిర్మల్ డిసెంబర్ 5: ముధోల్ మండలంలోని ముద్గల్ గ్రామపంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ పదవీకి పిరైవాడ్ లావణ్య విట్టల్ ఈ రోజు నామినేషన్ వేసారు.ప్రజలు నన్ను ఆదరించి గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా అని అన్నారు.గ్రామాన్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తా అని నామకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకు రుణపడి ఉంటానని.అలాగే నన్ను భారీ మెజారిటీతో గెలిపించగలరని కొరారు.ఈ కార్యక్రమంలో నరేష్ అమృత్ సాయిచంద్ విట్టల్ మరియు తాడితరులు పాల్గొన్నారు

అన్నమయ్య

డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసు కార్యాలయ ప్రారంభంలో పాల్గొన్న యల్లటూరు శ్రీనివాస రాజు

రాష్ట్రవ్యాప్తంగా నూతన డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసుల ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.చిత్తూరు జిల్లాలో డీడీవో కార్యాలయాన్ని స్వయంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు.అదే తరహాలో రాజంపేట మండలంలో డివిజనల్ అభివృద్ధి అధికారి వారి కార్యాలయాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఐఏఎస్ వివిధ శాఖల అధికారులు,ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.జనసేన పార్టీ రాజంపేట పార్లమెంటు ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీనివాస రాజు గ్రామీణ అభివృద్ధికి పవన్ కళ్యాణ్ చేపట్టిన నిర్ణయాలు ఎంతో దిశానిర్దేశకంగా ఉన్నాయి.గ్రామాల్లో రహదారులు,తాగునీటి సౌకర్యాలు,ఆరోగ్య సేవలు, అన్ని మౌలిక వసతులను మెరుగుపరుస్తూ ముందుకు సాగుతున్న ప్రభుత్వంలో భాగం అవ్వడం నా అదృష్టం. ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి జనసేన నాయకులు యల్లటూరు శివరామరాజు, మాజీ జెడ్పిటిసి షబ్బీర్ అహ్మద్,మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అబూబకర్ మండెం,అల్లం సుబ్రహ్మణ్యం, శంకర్ రాజు తదితరులు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం వారి కార్వింగ్ సందడి…..

ఇవాళ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఫస్ట్ ఇయర్ విద్యార్థుల కోసం **ఫలాలు మరియు కూరగాయల చెక్కింత (కార్వింగ్) కార్యక్రమం** నిర్వహించింది. విద్యార్థులు తమ సృజనాత్మకతను ప్రదర్శిస్తూ, వಾಟర్‌మెలన్‌తో అందమైన డిజైన్లు రూపొందించారు. టొమాటోలను ఉపయోగించి **హంసలు, నెమళ్లు** వంటి ఆకర్షణీయమైన ఆకృతులను తయారు చేశారు. ఈ పోటీలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని, తమ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి.వి సుబ్రహ్మణ్యకుమార్ గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సైన్సు విద్యార్థులు ఫుడ్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్.A. అన్నపూర్ణ.. అధ్యాపకులు Ch. Gayathri, సిహెచ్ గాయత్రి తెహమేనా, T. కుందన పాల్గొన్నారు.

నిర్మల్

మైనార్టీ నాయకులను కలిసిన సర్పంచ్ అభ్యర్థి ఒస కవిత రాజు

పున్నమి డిసెంబర్05 నిర్మల్ జిల్లా లక్ష్మణా చందా కేంద్రంలో శుక్రవారం రోజున మైనార్టీ నాయకులను కలిసిన ఓస కవిత రాజు సర్పంచ్ అభ్యర్థి లక్ష్మణ్ చందా అభివృద్ధి కొరకై తోడు పడతానని నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు బాలు మరియు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని కోరారు end

ఆంధ్రప్రదేశ్

మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0

రాష్ట్ర వ్యాప్తంగా 5- 12-2025 న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0 ను అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్నారు టీచర్ మరియు పేరెంట్ మీటింగ్ లో విద్యార్థుల యొక్క విద్యా ఎలా సాగుతుంది టీచర్స్ యొక్క బోధన మరియు ఇతర అంశాలను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రకటించింది .ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాలకు చేరుకున్న మంత్రులు

Blog

తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు డిమాండ్ ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్ళారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

*తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ డిమాండ్* *కేంద్ర రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పార్లమెంట్ ఫ్లోర్ లీడర్ లావు కృష్ణదేవరాయలు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దగ్గుమళ్ళ ప్రసాదరావు న్యూఢిల్లీడిసెంబర్ 4 ( విశాఖ పున్నమి ప్రతినిధి:-) తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు డిమాండ్ ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్ళారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పార్లమెంట్ ఫ్లోర్ లీడర్ లావు కృష్ణదేవరాయలు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు. అంతకు ముందు తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ డిమాండ్ అంశాన్ని తిరుపతి బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి సభ్యులు.., చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావుతో సమీక్షించారు. దీనికి స్పందించిన పార్లమెంటు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దగ్గుమళ్ళ.., ముందుగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పార్లమెంటు ఫ్లోర్ లీడర్ లావు కృష్ణదేవరాయలతో చర్చించారు. అనంతరం వారు తిరుపతి బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్లతో కలిసి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ను కలిసి,తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ డిమాండ్ ను అంశాన్ని తెలియజేశారు. అలాగే వినతి పత్రాన్ని కూడా అందజేసారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు , లావు కృష్ణదేవరాయలు, చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు.. బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు ఆవశ్యకతను రైల్వే మంత్రికి వివరించారు. ఏళ్లుగా నెలకొన్న డిమాండ్ ను పరిష్కరించాలని కోరారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. అంతే కాకుండా యాత్రికుల తాకిడి పెరిగిన దృష్ట్యా తిరుచానూరు, రేణిగుంట రైల్వే స్టేషన్ లను అభివృద్ధి చేయాలని కోరారు. శ్రీ సిటీ పారిశ్రామిక అభివృద్ధి రీత్యా అంతర్జాతీయ కార్గో టెర్మినల్ ఏర్పాటు చేయాలని విన్నవించారు. కడప- బెంగుళూరు రైల్వే లైన్ సర్వే పూర్తి కాగా, పనులు వేగవంతం చేయాలన్నారు. నడికుడి- శ్రీకాళహస్తి పనుల్లో వేగం పెంచాలని విజ్ఞప్తి చేశారు. నాయుడు పేట, గూడూరు, తడ, పుత్తూరు, నగరి, సత్యసాయి ప్రశాంత నిలయం రైల్వే స్టేషన్లను తిరుపతి బాలాజీ రైల్వే డివిజన్ పరిధిలోకి తీసుకురావాలని కోరారు. రద్దీ దృష్ట్యా తిరుపతి- గూడూరు మధ్య మూడవ లైన్ ఏర్పాటు చేయాలని కేంద్ర రైల్వే మంత్రికి సూచించారు. ఈ కార్యక్రమంలో బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి సభ్యులు వేణుగోపాల్ రెడ్డి, పీ.సి. రాయల్, కే.వి.చౌదరి, బుచ్చిబాబు నాయుడు, రామచంద్రా రెడ్డి పాల్గొన్నారు.

తిరుపతి

నేడు ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే బొజ్జల ప్రజాదర్బార్

శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజల సమస్యలను నేరుగా వినేందుకు, వాటి పరిష్కారానికై ప్రత్యేకంగా ప్రజాదర్బార్ ఏర్పాటు చేయబడింది. శుక్రవారం నాడు ఉదయం 9:00 గంటలకు రేణిగుంట పట్టణంలోని ఎంపిడిఓ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని ఈ ప్రజాదర్బార్ కార్యక్రమంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వెంటనే సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కార మార్గాలు చూపడం లక్ష్యంగా ఈ దర్బార్‌ను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుదీర్ రెడ్డి వెల్లడించారు. ప్రజల వద్దకు అధికారులు, ప్రజాప్రతినిధులు చేరే వేదికగా ఈ కార్యక్రమం నిలుస్తోందని అయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని, తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి బొజ్జల సుధీర్ రెడ్డి చేపడుతున్న ఈ కార్యక్రమం స్థానికంగా ప్రజాదరణ పొందుతుంది.

తిరుపతి

వర్షాలతో మా ఎస్సీ కాలనీ పట్టిన దుస్థితి కాస్తా చూడండి అయ్యా

తొట్టంబేడు మండలంలో వారం రోజులగా కురుస్తున్నవర్షాలకు పొయ్య ఎస్సీ కాలనీ అతలా కుతలం విధరోడ్డుల్లో వర్షపు నీరు ఎటు పోలేక చెరువుల తలపిస్తున్న వర్షపు నీరు, ఇబ్బంది పడుతున్న, గ్రామ ప్రజలు, స్కూల్ పిల్లలు, వీధిలైట్లు, అదేవిధంగా ఈ వర్షాలకు సుమారు 40 ఇల్లు లు స్లాబ్ పైపుచ్చులు ఊడి ఇళ్లల్లో వర్షపు నీరు నిలబడి ఎప్పుడు కూలిపోతుందో భయభ్రాంతులతో జీవిస్తున్న కుటుంబాలు.. సంబంధిత అధికారులు ఇకనైన స్పందించి పొయ్య ఎస్సీ కాలనీని పర్యటించి, వీధి రోడ్లపై నీళ్లు నిలవకుండా తగు చర్యలు తీసుకుని, శిధిలావ్యవస్థకి చేరుకున్న పాత ఇల్లను ప్రభుత్వం పట్టించుకుని, నష్టపోయిన బాధితులకు నిత్యవసర సరుకులు అందజేస్తే బాగుంటుందని, బాదిత ప్రజలు ఆశా భావంవ్యక్తం చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.