Wednesday, 6 May 2026

Blog

విశాఖపట్నం

చదువుతోనే మంచి భవిష్యత్తు. కలెక్టర్ MN హరేందిర ప్రసాద్.

*విశాఖపట్నం డిసెంబర్ 5 పున్నమి ప్రతినిధి* చదువుతోనే మంచి భవిష్యత్తు. కలెక్టర్ MN హరేందిర ప్రసాద్. చదువుతోనే మంచి భవిష్యత్తు ఉంటుందని అందువల్ల తల్లిదండ్రులు తమ పిల్లల చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలక్టరు ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అన్నారు. శుక్రవారం ఆయన విశాఖ ఉత్తర నియోజక వర్గ శాసన సభ్యులు శ్రీ విష్ణుకుమార్ రాజుతో కలసి అక్కయ్యపాలెం ఎన్జీవో కోలనీలో, జివిఎంసి హై స్కూలులో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సమావేశములో కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు ఆడ పిల్లల చదువుపై మరింత దృష్టి పెట్టాలన్నారు. ఆడపిల్లలు బాగా చదువుకుంటే బాల్య వివాహ సమస్య ఉత్పన్నం కాదన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు క్రమశిక్షణ నేర్పాలన్నారు. తల్లిదండ్రులు క్రమశిక్షణ కలిగి ఉంటే పిల్లలకు కూడా మంచి క్రమశిక్షణ అలవాటవుతుందన్నారు. క్రమశిక్షణ పాటించినవారు అన్ని రంగాలలో విజయమంతమవుతారన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ అవసరం అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నారా లోకేష్ చొరవతో మెగా పేరెంట్ టీచర్ మీట్ 3.0 జరుగుతుందన్నారు. విద్యార్థినీ విద్యార్థులు అకాడమిక్ ట్రాక్ తెలుసుకోవడానికి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు రూపొందించారని దీనివలన తమ పిల్లల ప్రగతి తెలుసుకో వచ్చన్నారు. ప్రతి తల్లిదండ్రి లీప్ యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే తమ పిల్లలు ప్రతిరోజు పాటశాలకు వస్తున్నారో లేదో కూడా తెలుసుకోవచ్చన్నారు. అందువల్ల ప్రతి తల్లిదండ్రులు లీప్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు. మధ్యాహ్న భోజనం పిల్లలకు నచ్చే విధంగా ప్రభుత్వం పౌష్టికాహారం ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. విశాఖపట్నం జిల్లాలో మొట్టమొదటిగా అక్షయ పాత్ర ద్వారా విద్యార్థినీ విద్యార్థులకు ఉదయం పౌష్టికాహారం అందిస్తున్నామని కలక్టర్ వెల్లడించారు. ప్రభుత్వం ఇస్తున్న స్కూల్ కిట్స్ సక్రమంగా వినియోగించుకోవలన్నారు. పదవ తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని అందుకు ప్రభుత్వం 100 శాతం యాక్షన్ ప్లాన్ ప్రకారం ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పిల్లలను చదివించాలన్నారు. విద్యార్థినీ విద్యార్థుల సర్వతో ముఖాభివృద్దికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. విశాఖపట్నం ఉత్తర శాసన సభ్యులు శ్రీ విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ పిల్లల చదువు పట్ల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు బాధ్యత తీసుకొని కొంత సమయం కేటాయించాలన్నారు. ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరు గౌరవం ఇవ్వాలన్నారు. తల్లిదండ్రులు పిల్లల చదువు పై దృష్టి పెట్టాలన్నారు. పదవ తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. తాను పదవ తరగతిలో లెక్కలలో 100 శాతం మార్కులు సాధించాలని, అలాగే ఇంజనీరింగ్ లో రాష్ట్ర స్థాయిలో 34వ ర్యాంకు సాధించానన్నారు అందువల్ల ప్రతి విద్యార్థి కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాదించాలన్నారు.చదువు శాశ్వత ఆస్తి అని అది జీవితాంతం మన వద్దే ఉంటుందన్నారు. జిల్లా విద్యా శాఖాధికారి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ 6 నెలలకొకసారి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ (MPTM) ప్రభుత్వం నిర్వహిస్తున్నాదన్నారు కార్పొరేటర్ డి. శ్రావణి మాట్లాడుతూ ప్రైవేట్ పాటశాలలకు దీటుగా ప్రభుత్వ పాటశాలలలో ప్రభుత్వం అనేక వసతులు కల్పిస్తున్నాదన్నారు. అంతకుముందు ఎన్ సి సి కేడిట్ ల గౌరవ వందనం స్వీకరించారు. ఉపాధ్యాయులతో, తల్లిదండ్రులతో ముఖాముఖి మాట్లాడారు. పిల్లల హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్టు ను కలక్టర్,MLA పరిశీలించారు. ఇటీవల అమరావతిలో జరిగిన అసెంబ్లీ లో మార్షల్ గా వ్యవహరించిన హర్షవర్ధన్ అభినందించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బాల్య వివాహాలు జరగకుండా తమ వంతు కృషి చేస్తామని కార్యక్రమం లో ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి రామారావు, హెడ్ మాస్టర్ రాదా కుమారి, స్కూల్ కమిటి చైర్మన్ అప్పలస్వామి, ఎయు మాజీ రిజిష్ట్రార్ ఉమా మహేశ్వర రావు, లయన్స్, వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

తిరుమల ఆచారాలను అవమానించిన జగన్ రెడ్డి పై రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు పల్లా ఆగ్రహం*

*విశాఖపట్నం డిసెంబర్ 5 పున్నమి ప్రతినిధి:- *తిరుమల ఆచారాలను అవమానించిన జగన్ రెడ్డి పై రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు పల్లా ఆగ్రహం* *జగన్ పాలనలో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ఠను మళ్లీ నిలబెట్టిన విజనరీ చంద్రబాబు* *– రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు* విశాఖపట్నం, డిసెంబర్ 05: తిరుమల శ్రీవారి పవిత్ర నామాన్ని రాజకీయ అబద్ధాల కోసం వాడుకోవడం జగన్‌మోహన్ రెడ్డి అలవాటైపోయిందని, కలియుగదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి గురుంచి, సనాతన ధర్మం అంటే ఏంటో కూడా అర్థం కాని జగన్ రెడ్డి కి స్వామివారి గురించి మాట్లాడే అర్హత లేదు అని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు తీవ్రంగా విమర్శించారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి కోట్లాది హిందువుల విశ్వాసం. స్వామివారి హుండీలో పడే ప్రతి పైసా భక్తి కన్నీటి కానుక అని, అలాంటి పవిత్ర సమర్పణను అపవిత్రం చేయటం దేవద్రోహమని పల్లా గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్రం లో ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు వాళ్ళ హయం లో తిరుమల ఎంతో కొంత అభివృద్ది నోచుకుంది కానీ జగన్ రెడ్డి హయం లో అభివృద్ది మాట పక్కన పెడితే స్వామి వారిని అపహేళన మాట్లాడటం, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా చేశారని పల్లా గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరకామణి కేసు దొంగ చేతికి అధికారం ఇస్తే ఏమవుతుందో చెప్పే తార్కాణం అని ఆయన స్పష్టం చేశారు. మూడు రోజులకు ఒక్కసారి మీడియా ఎదుటకు వచ్చి “నేను ఉన్నా, మా పార్టీ ఉంది” అని నటించే జగన్ నాటకాన్ని ప్రజలు చూసి నవ్వుకుంటున్నారని అన్నారు. “నీ నోటి వెంట నిజం రాదు.. నిద్రలో లేపి దేవుడి గురించే అడిగినా అబద్ధమే చెప్తావు. ఎందుకంటే నీలో భక్తి లేదు, భయం లేదు” అని పల్లా గారు దుయ్యబట్టారు. భక్తులు కష్టపడి సంపాదించి స్వామివారికి సమర్పించిన మొక్కుబడులను కూడా దోచుకునే ధైర్యం జగన్ పాలనలోనే కనిపించిందని ఆయన విమర్శించారు. కేవలం రూ.72,000 చోరీకే వందల కోట్ల ఆస్తులు రాసిపెట్టడం, కేసు పెట్టిన వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం, వివేక హత్య కేసులో సాక్షులు ఒక్కొక్కరిగా చనిపోవడం..ఇవన్నీ జగన్ ముఠా పని తీరు ఏమిటో ప్రజలకు స్పష్టంగా చెప్పాయని అన్నారు. రూ.11 దొంగతనం చేసినా, 11 కోట్లు దోచుకున్నా చట్టం ముందు రెండూ నేరాలే. నేరస్తుడిని సమర్థించడం మరింత పెద్ద నేరం అని పల్లా గారు హెచ్చరించారు. తిరుమల నెయ్యి కల్తీ విషయంలో పల్లా గారు మరింత ఘాటుగా స్పందించారు. ఒక్క చుక్క పాలు కూడా లేకుండా తయారు చేసిన నెయ్యిని శ్రీవారి ప్రసాదంలో వాడటం ఇది అవినీతి కాదు, ఇది మహా పాపం. పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేయడం ధార్మిక ద్రోహం అన్నారు. టెండర్ పిలవడం నుంచి సరఫరా ప్రారంభం అయ్యేవరకు అన్ని వైసీపీ హయాంలోనే జరిగాయని, చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే సరఫరా మొదలుపెట్టడం కుట్రేనని పల్లా గారు ఖండించారు. సీబీఐ విచారణ కోరింది మీరే… మరి ఇప్పుడు ఎందుకు వణుకుతున్నారు? ఎందుకు కోర్టు మెట్లు ఎక్కి విజిలెన్స్ విచారణ వద్దు అంటున్నారు? కల్తీ నెయ్యి వెనుక ఉన్న అసలైన నిందితులు బయటపడతారనే భయం కదా?” అని ఆయన ప్రశ్నించారు. సుప్రీంకోర్టు సిట్ చేసిన అరెస్టులు వైసీపీ పాలనలో జరిగిన భారీ దోపిడీకి తొలి శిక్ష అని అన్నారు. తిరుమల ఆచార వ్యవహారాలు కూడా జగన్‌కు తెలియవని పల్లా గారు మండిపడ్డారు. “గుడిలో చెప్పులు వేసుకుని రాకూడదన్న సాధారణ ఆచారం కూడా తెలియని వ్యక్తి తిరుమల రూల్స్ గురించి ఉపన్యాసాలు చేయడం భక్తుల మనోభావాలపై దాడి. వేంకటేశ్వర స్వామికి సతీసమేతంగా పట్టువస్త్రాలు సమర్పించాలనే ఆచారం కూడా ఆయనకు తెలియదు” అని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు అత్యంత గౌరవంతో చూసే న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులు, సీనియర్ IAS అధికారులను ‘వాడు–వీడు’ అంటూ అవమానకరంగా సంబోధించడం.. చివరికి కలియుగ దైవం వెంకటేశ్వరస్వామిని కూడా చులకనగా మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి అహంకార స్వభావానికి అద్దం పడుతుంది. న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్ చేయడం, ఉన్నతాధికారులను బెదిరించడం, కోర్టులపై దుష్ప్రచారం చేయించడం ఇవన్నీ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే చర్యలు. న్యాయానికి, రాజ్యాంగానికి కనీస గౌరవం లేని ఇటువంటి వ్యక్తి దేశంలో ఎక్కడా ఉండరని మండిపడ్డారు. జగన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్‌ను గంజాయి వనం‌గా మార్చి, కల్తీ మద్యం మహమ్మారిలా వ్యాపింపజేసి వేలాది కుటుంబాలను దుఃఖంలో ముంచాడు. రాష్ట్రం మొత్తం నేరాలు, డ్రగ్స్, కల్తీ మద్యం దందాలతో పరువు పోయేలా చేసి, ఆంధ్రప్రదేశ్‌ బ్రాండ్ ఇమేజ్‌ను దేశంలోనే అత్యంత హీన స్థితికి నెట్టాడు. కానీ అదే రాష్ట్రాన్ని తిరిగి గౌరవప్రదమైన దిశగా నడిపిస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ఠను మరోసారి ప్రపంచ పటంలో నిలబెడుతున్నవారు మన విజనరీ నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారు. ప్రపంచం అంతటా పెట్టుబడులు, అభివృద్ధి అవకాశాలు ఆకర్షించేలా ‘న్యూ ఏపీ బ్రాండ్’ను మళ్లీ నిర్మించడం వారి స్పష్టమైన దూరదృష్టి, కష్టపాటు వల్లే సాధ్యమవుతోందని అన్నారు. నేడు రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0 కార్యక్రమాన్ని నిర్వహించింది. 45,000 ప్రభుత్వ, ఎయిడెడ్, అన్-ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ కార్యక్రమం ప్రత్యేక ఉత్సాహంతో సాగిందని తెలిపారు. ఇలాంటి పేరెంట్-టీచర్ మీటింగ్స్ విద్యార్థుల విద్యాభివృద్ధికి, తల్లిదండ్రుల అవగాహనకు, పాఠశాలల సామరస్యానికి గొప్ప వేదికగా మారుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి గారు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు లోకేష్ గారు హాజరై ప్రత్యేక ప్రాతినిధ్యం అందించడం, రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచే సంకేతం అని పల్లా గారు చెప్పారు. తల్లిదండ్రుల పాల్గొనడం వల్ల పాఠశాలల్లో విద్యార్ధుల అభ్యాసం, సానుకూల వాతావరణం గురించి సమగ్ర అవగాహన ఏర్పడుతుందని, ఈ రోజు ఘనంగా, విజయవంతంగా ముగియడం ప్రభుత్వ విద్యా విధానాలపై ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచిందని పల్లా గారు పేర్కొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరిలో 10వ తరగతి విద్యార్థులు ప్యాడ్లు పంపిణీ చేసిన రామ కృష్ణ యాదవ్ అనే దాత

ఉదయగిరి మండలంలోని బండగానిపల్లె పంచాయతీ బిజ్జంపల్లి జిల్లా పరిషత్ ఉన్న హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మెగా PTM 3.0 కార్యక్రమంలో ప్యాడ్స్, స్టడీ, చైర్స్ అందజేశారు రేపటి నుండి వంద రోజులు పాటు జరగనున్న పదోవ తరగతి ప్రత్యేక తరగతులు జరగనున్నాయి కొండాపురం మండలం సత్యవోల్ ఆగ్రహం కీ చెందిన రామ కృష్ణ యాదవ్ అనే దాత రూ 25.000 వేలు ప్యాడ్స్, స్టడీ, చైర్స్ విద్యార్దులకు అందజేశారు

గూడూరు

ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల ,తల్లిదండ్రుల మరియు ఉపాధ్యాయుల సమ్మేళనం -చిట్టేడు (తిరుపతిజిల్లా )

ప్రభుత్వ ఆదేశాలమేరకు కోట మండలం చిట్టేడు నందు గల ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల తల్లిదండ్రుల మరియు ఉపాధ్యాయుల సమ్మేళనం ఘనంగా జరిగినది ఈ సమావేశం కు ముఖ్య అతిధులు MEO శ్రీ దార మస్తానయ్య గారు, chairperson శ్రీమతి తుపాకుల శ్యామల గారు, ఉపాధ్యక్షులు శ్రీమతి మాణికల భ్రమరాంబ,సభాధ్యక్షులు శ్రీ ఎస్ సుభాకర్ రావు గారు, ప్రిన్సిపల్ గారు మరియు ఉపాధ్యాయిని ఉపద్యేయులు ప్రసంగించి వివిధ పోటీలలో విజేతలకు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేసారు తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు అనంతరం కోట మండల విద్యాశేఖ అధికారి దార మస్తానయ్య గారు మాట్లాడుతూ విద్య పిల్లలను ప్రయోజకులుగా చేస్తుందని కనుక ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివించి ప్రయోజకులుగా తీర్చి దిద్దాలని అన్నారు ప్రిన్సుపల్ శ్రీ సుభాకర్ గారు మాట్లాడుతూ రాబోయే పదవతరగతి పరీక్షలలో నూరు శాతం సాధించాలని కోరారు అనంతరం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అందరు కలసి విద్యార్థులతో సమ పంక్తి లో భోజనం చేసారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మర్రిపాడు మండల వ్యాప్తంగా పండుగ వాతావరణం లో పేరెంట్స్ డే కార్యక్రమాలు

మర్రిపాడు డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) మర్రిపాడు మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మెగా పేరెంట్స్ డే 3.0 (తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ) కార్యక్రమంలో శుక్రవారం కస్తూర్బా గాంధీ కళాశాలలో బాలు పల్లి ప్రాథమిక పాఠశాలలో పాల్గొన్న ఆత్మకూరు ఏఎంసి చైర్మన్ అరికట్ల జనార్దన్ నాయుడు. మండలంలోని 24 పంచాయతీల్లోని పాఠశాలల్లో చైర్మన్ ల పంచాయతీ సర్పంచ్ల ప్రధానోపాధ్యాయుల మండల సంబంధిత అధికారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంను పండగ వాతావరణం లో నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మర్రిపాడు మండల మాజీ కన్వీనర్ శాఖమూరి నారాయణ మండల అభివృద్ధి అధికారి నాగేశ్వరప్రసాద్ విద్యాధికారులు తిరుపతయ్య ధనలక్ష్మి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పద్మలత మర్రిపాడు పంచాయతీ సర్పంచ్ ఎస్ కే బిబిజాన్ మర్రి పాడు తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు రాటకొండ వెంకటసుబ్బయ్య పాఠశాలల చైర్మన్లు కస్తూర్బా గాంధీ కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీదేవి ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు బాలుపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థిని తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

విద్యార్థుల భవిష్యత్‌కు తల్లిదండ్రుల పాత్ర కీలకం: చిన్నా జనసేన”

మర్రిపాడు మండల కేంద్రంలోని జెడ్పి ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్ – మెగా 3.0 కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ చిన్నా జనసేన పాల్గొని తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల భాగస్వామ్యం విద్యార్థుల భవిష్యత్‌కు ఎంత కీలకమో వివరించారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల సమగ్ర ప్రగతికి తల్లిదండ్రుల సహకారం అవసరమని ఆయన సూచించారు. ఉపాధ్యాయులతో కలిసి పనిచేస్తే పాఠశాల ర్యాంకులు మరింత మెరుగవుతాయని చెప్పారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పిల్లల భవిష్యత్ కోసం చేతులు కలిపిన తల్లిదండ్రులు–ఉపాధ్యాయులు”

అనపర్తి, డిసెంబర్ 5 (పున్నమి ప్రతినిధి): శ్రీ రామారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్ 3.0 ఘన విజయవంతమైంది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ పులగం వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి అనపర్తి నియోజకవర్గం స్పెషల్ ఆఫీసర్ & డిప్యూటీ కలెక్టర్ శ్రీ ప్రేమ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన, తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల మధ్య సమన్వయం బలపడితేనే విద్యార్థుల పురోగతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ సమావేశాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి కారణం పిల్లల శ్రేయస్సు, భవిష్యత్ బలోపేతమని చెప్పారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు పూర్తిస్థాయి సహకారం అందించాలని ఆయన సూచించారు. ఎంఆర్ఓ శ్రీ అనిల్‌కుమార్ మాట్లాడుతూ, విద్యార్థుల సంక్షేమమే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖల అందరి ఉమ్మడి లక్ష్యమని తెలిపారు. మాక్ అసెంబ్లీలో ప్రతిభ కనబరిచిన విద్యార్థి జీవీవీ సతీష్ ను స్పెషల్ ఆఫీసర్ ప్రత్యేకంగా అభినందించారు. తదుపరి పాఠశాలలో ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం ను ముఖ్య అతిథులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ–II శ్రీ నల్లమిల్లి సత్తిరెడ్డి, మామిడి శెట్టిశ్రీను, ధర్మాసుల సతీష్, రాయి పెద్దిరాజు, లోవరాజు, శ్రీను, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సముద్రతీర సేవలకు చిరస్మరణం – ఝాన్సీ రాణి సత్కారం”

నెల్లూరు, డిసెంబర్ 5 (పున్నమి ప్రతినిధి): వైద్య–ఆరోగ్యశాఖలో 37 ఏళ్లపాటు ప్రజలకు సమర్పణతో సేవలందించిన రామతీర్థం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పబ్లిక్ హెల్త్ నర్స్ శ్రీమతి కొండా ఝాన్సీ రాణి గారి రిటైర్మెంట్ మహోత్సవాన్ని ఏపీ ఎన్జీ జివో హోమ్, ఎం.జి.బి మాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ హంస జిల్లా అధ్యక్షులు చేజర్ల సుధాకర్ రావు, గౌరవాధ్యక్షురాలు శ్రీమతి ఆర్. ఇందిర పాల్గొని ఝాన్సీ రాణిని సన్మానించారు. మైపాడు, రామతీర్థం వంటి సముద్ర పరివాహక ప్రాంతాలలో ఎక్కువకాలం పనిచేసిన ఆమె వేలాది మంది మహిళలకు సురక్షిత ప్రసవాలు, చిన్నారులకు టీకాలు అందించడంలో కీలక పాత్ర పోషించినట్టు వక్తలు కొనియాడారు. సేవా మూర్తిగా, పేదల ఆరోగ్య దేవతగా ప్రజల్లో విశేష గౌరవం సంపాదించిన ఝాన్సీ రాణి తోటి ఉద్యోగులకు వెన్నుదన్నుగా నిలుస్తూ మంచి నాయకత్వం చూపినట్టు తెలిపారు. ఆమె భర్త, స్వర్గీయ బాలసుబ్రమణ్యం కూడా హెల్త్ సూపర్వైజర్‌గా సేవలందించి పేదల డాక్టర్‌గా పేరు గాంచిన విషయాన్ని స్మరించారు. కార్యక్రమానికి విచ్చేసిన వారి కుమార్తె జయశ్రీ దుర్గ, అల్లుడు శివకుమార్ ప్రత్యేకంగా ఉద్యోగులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆమె సేవల వీడియో ప్రదర్శనను చూపించారు. ఈ సందర్భంగా ఏపీ మెడికల్ & హెల్త్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్థాపకులు ఏ.హరిబాబు, డాక్టర్ సులోచనమ్మ, సాయిరాం హాస్పిటల్ అధినేత డాక్టర్ కె.లలితా షిర్డీషా, అసోసియేషన్ జిల్లా సెక్రటరీ కల్పం శ్రీనివాసులు, జనవిజ్ఞాన వేదిక స్టేట్ ప్రెసిడెంట్ నమ్మి స్వరాజ్యలక్ష్మి, కొండా కనకరాజు, పి.ఎల్.రావు, రిటైర్డ్ నాయకులు ప్రపుల్ల, భవాని, వసంత, అరుణా రాణి, ఏపీ హంస సిటీ సెక్రెటరీ మంజరి, రూరల్ తాలూకా వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీకాంతమ్మ తదితరులు ప్రసంగిస్తూ ఝాన్సీ రాణి సేవలను శ్లాఘించారు.

తెలంగాణ

పాఠశాల విద్యార్థుల స్కాలర్షిప్ మంజూరు పై సమీక్ష నిర్వహించిన : కలెక్టర్

నకిరేకల్ : డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) ప్రతి విద్యార్థి ఉపకార వేతనం పొందేలా అధికారులు మానవతా దృక్పథంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ అన్నారు. ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆమె మండల విద్యాశాఖ అధికారులు, సంక్షేమ శాఖల అధికారులతో, పాఠశాల విద్యార్థులకు స్కాలర్షిప్ల మంజూరు పై సమీక్ష నిర్వహించారు. వచ్చే శుక్రవారం నాటికి జిల్లాలో స్కాలర్షిప్ల దరఖాస్తులు 30% దాటాలని ఆమె లక్ష్యాన్ని విధించారు.

తెలంగాణ

డిసెంబర్ 7న : సాయుధ దళాల దినోత్సవం

నకిరేకల్ :డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) డిసెంబర్ 7న నిర్వహించనున్న సాయుద దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి త్రివిధ దళాలకు బాసటగా డొనేషన్ అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ త్రివిధ దళాలు ఎల్లవేళలా దేశాన్ని సంరక్షిస్తున్నందునే అందరూ ప్రశాంతంగా ఉన్నామని, అలాంటి సైనికులకు సహకారం అందించడంలో ప్రతి ఒక్కరు బాసటగా నిలవాల్సిన అవసరం ఉందని అన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.