Tuesday, 5 May 2026

Blog

అన్నమయ్య

ప్రభుత్వ బడిలో చదివి, అంతర్జాతీయ కొలువులు: చిట్వేలి సోదరీమణుల సంచలనం

-రైతు కుటుంబంలో పుట్టి, ఇంగ్లీషులో దారాళంగా మాట్లాడుతున్న సరస్వతీ పుత్రికలు -కష్టేఫలి నిరూపణ: సామాజిక కార్యకర్త గాడి ఇంతియాజ్ అహ్మద్ ప్రశంస చిట్వేలి, డిసెంబర్ 15 పున్నమి ప్రతినిధి ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే అంతర్జాతీయ అవకాశాలు దక్కవనే అపోహలను పటాపంచలు చేస్తూ, చిట్వేలికి చెందిన ఇద్దరు యువతులు తమ ప్రతిభతో ఏకంగా అమెరికన్ కంపెనీలో ఉద్యోగం సాధించి ఆదర్శంగా నిలిచారు. ఈ అమ్మాయిలు అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడుతుంటే, వారు ఏదో ఖరీదైన ప్రైవేట్ లేదా కార్పొరేట్ సంస్థల్లో చదివి ఉంటారని అనుకుంటే, అది పొరపాటే. వీరు చదివింది చిట్వేలి జెడ్.పి.హెచ్.ఎస్. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మాత్రమే. -సామాన్య కుటుంబం… అసామాన్య లక్ష్యం: చిట్వేలి బ్రాహ్మణ వీధికి చెందిన చెంజి మనోహర (తండ్రి), విజయ (తల్లి) దంపతులకు ముగ్గురు సంతానం: నవీన, భార్గవి, బాలాజీ . రైతు కుటుంబంలో పుట్టిన ఈ ముగ్గురు పిల్లల ఉన్నత విద్యకు పునాది వేసింది ప్రభుత్వ పాఠశాలే. నవీన చిన్నప్పటినుండి చదువులలో దిట్టగా ఉండి, పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ చాటింది. ఆమె తన సోదరి భార్గవికి, తమ్ముడు బాలాజీకి చదువు పట్ల నిరంతరం ప్రోత్సాహం అందించేది.నవీన విద్యార్థి దశలో కరోనా విపత్తు కారణంగా రెండు సంవత్సరాల పాటు విద్యకు అంతరాయం కలిగింది. ఆ సమయంలో ఆమె కొన్నాళ్ళు వాలంటీర్ ఉద్యోగం చేస్తూనే, కరస్పాండెంట్స్ ద్వారా విద్యను కొనసాగించి ఇంటర్ పూర్తి చేసింది. ఆ తర్వాత అక్కాచెల్లెళ్లు ఇద్దరూ కలిసి తిరుపతిలోని ఒకే కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు.ప్రస్తుతం నవీన, భార్గవి ఇద్దరూ అమెరికన్ కంపెనీలో సైబర్ విభాగంలో ఉద్యోగాలు సాధించారు. ఉద్యోగం చేస్తూనే, ప్రైవేటుగా ఎంబీఏ కోర్సును అభ్యసిస్తున్నారు. వారి తమ్ముడు బాలాజీ మధురైలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. -తండ్రి పట్టుదలే ప్రధానం: పిల్లల విజయం వెనుక తండ్రి చెంజి మనోహర కృషి ఎంతో ఉంది. చిన్ననాటి నుండి పిల్లలకు చదువుపై ఉన్న మక్కువను చూసి, ఎంత కష్టమైనా సరే ఉన్నత విద్యలు చదివించాలని ఆయన పట్టుబట్టారు. ఎప్పటికప్పుడు మిత్రులతో చర్చించి, సలహాలు, సూచనలు తీసుకొని వాటిని కచ్చితంగా పాటించడం వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని స్థానికులు చెబుతున్నారు. -ప్రశంసల వెల్లువ: ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త గాడి ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ, “కష్టేఫలి. కష్టాన్ని ఇష్టంగా చేస్తే జీవితంలో అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు అని ఈ చిన్నారులు నిరూపించారు. నేటి సమాజంలో ఈ సరస్వతీ పుత్రికలు ఆదర్శంగా నిలిచారు” అని ప్రశంసించారు.వీరి భవిష్యత్తులో అత్యున్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ, ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కూడా పిల్లల భవిష్యత్తు కొరకు అహర్నిశలు కష్టపడిన తల్లిదండ్రులకు చిట్వేలి హెల్ప్ లైన్ సొసైటీ సేవా సంస్థ తరఫున మరియు చెంజి మనోహర మిత్రబృందం తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రైతులు వద్దకే యూరియా దుక్కిపిండి .

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా డిసెంబర్ 15 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం కుడితిపల్లి గ్రామంలో అగ్రికల్చర్ రైతులకు అవసరమైన యూరియా మరియు దుక్కిపిండి పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ సిహెచ్ శ్రీదేవి గారు మరియు మాజీ సర్పంచ్ వెందోటి భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ సిహెచ్ శ్రీదేవి గారు మాట్లాడుతూ, రైతుల సాగు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎకరానికి ఒక బస్తా చొప్పున మొత్తం మూడు విడతల్లో యూరియా మరియు దుక్కిపిండి పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సౌకర్యాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, వ్యవసాయ ఉత్పాదకత పెరగడానికి దోహదపడతాయని గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఎన్ టి ఆర్ జిల్లా

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయవాడ వారి ప్లాంటేషన్ ప్రోగ్రాం …… శ్రీ దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల….. 15/12/2025….

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో 15.12.2025వ తేదీన ఎన్ఎస్ఎస్ విభాగం వారు సెంట్రల్ బ్యాంక్ వారి సహకారంతో ప్లాంటేషన్ ప్రోగ్రాం ని నిర్వహించడం జరిగింది. 115 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సెంట్రల్ బ్యాంక్ వారు మన కళాశాల ఆవరణలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని తద్వారా కలుషితమైన వాతావరణాన్ని దూరం చేయవచ్చని పర్యావరణ సమతుల్యతకు మరియు మానవ మనుగడకు చాలా అవసరమని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివిఎస్ కుమార్ గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పి. సతీష్ బాబు గారు,రీజినల్ హెడ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎం.ఫణి మాచిరాజు గారు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బెంజ్ సర్కిల్ బ్రాంచ్ విజయవాడ,తిరుమల రావు గారు సీనియర్ మేనేజర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ k. సరళ, శ్రీమతి టీ.నాగరాణి, బ్యాంక్ సిబ్బంది మరియు విద్యార్థినులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అన్నమయ్య

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన విద్యార్థి నాయకుడు మల్లెం హేమంత్ కుమార్

చిట్వేల్, డిసెంబర్ 15 పున్నమి ప్రతినిధి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంను రాయలసీమ విద్యార్థి పరిరక్షణ సమితి జోనల్ అధ్యక్షులు మల్లెం హేమంత్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. భోజన నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించిన హేమంత్ కుమార్, పిల్లలతో కలిసి భోజనం చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే అందిస్తున్న భోజనం ఎంతో రుచికరంగా, నాణ్యతతో ఉందని ప్రశంసించారు. ఈ పథకం ద్వారా పేద విద్యార్థులకు పోషకాహారం అందడంతో పాటు విద్యపై ఆసక్తి పెరుగుతోందని పేర్కొన్నారు.ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ మధ్యాహ్న భోజన పథకం విద్యార్థుల ఆరోగ్యం, హాజరు మెరుగుపడేందుకు ఎంతగానో దోహదపడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

కామారెడ్డి

ఎల్లారెడ్డి సర్పంచ్ పాలకవర్గానికి సొసైటీ ఆధ్వర్యంలో ఘన సన్మానం..

– ఓటర్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు! కామారెడ్డి, 15 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, సదాశివనగర్ మండలం, ఎల్లారెడ్డి గ్రామంలో స్థానిక పంచాయతీ ఎన్నికల్లో అద్భుతం గా గెలిచిన సర్పంచ్ పాలకవర్గానికి సొసైటీ చైర్మన్ మర్రి సదాశివరెడ్డి ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్య క్రమం నిర్వహించారు. గ్రామ ప్రజల సమూహాల్లో ఉత్సాహం మార్పు తెచ్చి, సంబరాలతో కూడిన ఈ కార్యక్రమం గ్రామంలోని ప్రతి చోటూ చర్చనీయాంశ మైంది.ఈ సందర్భంగాసొసైటీ చైర్మన్ మర్రి సదాశి వరెడ్డి మాట్లాడుతూ, మా గ్రామ ప్రజలు ఓటు వేసి గెలిపించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని చెప్పారు. ఎల్లవేళలా సేవలోనే మీ మన్ననలు పొందుతారని హామీ ఇస్తున్నాను. గ్రామ అభివృద్ధికి కలిసి పనిచేద్దాం’ అని ప్రజలకు పిలునిచ్ఛారు.గ్రామస్తుల్లో మరింత ఉత్సాహాన్ని రేకెత్తించాయి.సర్పంచ్ పాలకవర్గం స్థానిక సమస్య ల పరిష్కారంలో,గ్రామ అభివృద్ధిలో ముందంజలో ఉంటూ పనిచేస్తారని చైర్మన్ తెలిపారు.ఈ సన్మా నం గ్రామంలో ఐక్యతను మరింత బలపరిచిందని, భవిష్యత్‌లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు చేపట్టాలని కోరారు. గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు అందరూ పాల్గొన్నారు.

కామారెడ్డి

ఎల్లారెడ్డి సర్పంచ్ పాలకవర్గానికి సొసైటీ ఆధ్వర్యంలో ఘన సన్మానం..

– ఓటర్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు! కామారెడ్డి, 15 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, సదాశివనగర్ మండలం, ఎల్లారెడ్డి గ్రామంలో స్థానిక పంచాయతీ ఎన్నికల్లో అద్భుతం గా గెలిచిన సర్పంచ్ పాలకవర్గానికి సొసైటీ చైర్మన్ మర్రి సదాశివరెడ్డి ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్య క్రమం నిర్వహించారు. గ్రామ ప్రజల సమూహాల్లో ఉత్సాహం మార్పు తెచ్చి, సంబరాలతో కూడిన ఈ కార్యక్రమం గ్రామంలోని ప్రతి చోటూ చర్చనీయాంశ మైంది.ఈ సందర్భంగాసొసైటీ చైర్మన్ మర్రి సదాశి వరెడ్డి మాట్లాడుతూ, మా గ్రామ ప్రజలు ఓటు వేసి గెలిపించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని చెప్పారు. ఎల్లవేళలా సేవలోనే మీ మన్ననలు పొందుతారని హామీ ఇస్తున్నాను. గ్రామ అభివృద్ధికి కలిసి పనిచేద్దాం’ అని ప్రజలకు పిలునిచ్ఛారు.గ్రామస్తుల్లో మరింత ఉత్సాహాన్ని రేకెత్తించాయి.సర్పంచ్ పాలకవర్గం స్థానిక సమస్య ల పరిష్కారంలో,గ్రామ అభివృద్ధిలో ముందంజలో ఉంటూ పనిచేస్తారని చైర్మన్ తెలిపారు.ఈ సన్మా నం గ్రామంలో ఐక్యతను మరింత బలపరిచిందని, భవిష్యత్‌లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు చేపట్టాలని కోరారు. గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు అందరూ పాల్గొన్నారు.

కామారెడ్డి

గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్పంచ్‌లకు సన్మానం!

కామారెడ్డి, 15, డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో గౌడ సంఘం ఘాటుగా సన్మానం! భారీ ఓట్లతో గెలిచిన సర్పంచ్‌లు, వార్డు మెంబర్లకు ఎల్లమ్మ ఆలయం వద్ద సన్మాన కార్యక్రమం నిర్వహించి, గ్రామీణ నాయకుల విజయాన్ని జరుపుకున్నారు. ఈ ఉత్స వం మండలంలో హాయిగా జరిగింది. గౌడ సమా జం బలం పెరిగింది.సర్పంచ్‌లు మెంబర్లు సంఘం నాయకులతో కలిసి ఫోటోలు! గ్రామీణ అభివృద్ధికి కొత్త ఆశలు! పంచాయతీ ఎన్నికల్లో గొప్ప విజయం సాధించిన వీరులకు ధన్యవాదాలు తెలిపారు.

E-పేపర్

ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట చేసిన గ్రామ యువత

ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట చేసిన గ్రామ యువత రైల్వే కోడూరు డిసెంబర్ పున్నమి ప్రతినిధి అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలంలోని గోవిందం పల్లి పంచాయతీలో ఉన్న శంకరా పురం (కుమ్మరపల్లి) గ్రామ యువత ప్రజలు కలిసి చెరువు కట్ట వద్ద ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో ధనంజయ, వెంకటేష్, శివకుమార్, నాగ, వెంకటరత్నం, అందరూ పాల్గొని విగ్రహ ప్రతిష్ట చేశారు

అన్నమయ్య

వ్యవసాయ సంక్షోభం: జెట్టివారిపల్లిలో రైతు బలి

వ్యవసాయ సంక్షోభం: జెట్టివారిపల్లిలో రైతు బలి -పెట్టుబడులు నష్టపోయి, గిట్టుబాటు ధరలు లేక అప్పుల ఊబిలో చిక్కుకున్న సుబ్బరాయుడు -మండలంలో రైతుల ఆర్థిక పరిస్థితిపై ఆందోళన చిట్వేల్, డిసెంబర్ 14: పున్నమి ప్రతినిధి అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభానికి అద్దం పడుతూ, మండలంలోని జెట్టివారిపల్లి గ్రామంలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నారు. పంట నష్టం, గిట్టుబాటు ధర లేకపోవడం కారణంగా తీవ్రమైన అప్పుల బాధను తట్టుకోలేక యేదోటి సుబ్బరాయుడు (48) అనే రైతు తన జీవితాన్ని చాలించారు. ఆయన తండ్రి యేదోటి వెంకటసుబ్బయ్య. -ఆర్థిక సంక్షోభం కారణం: గ్రామంలో అంచనా ప్రకారం, సుబ్బరాయుడు ఈ సంవత్సరం సాగు చేసిన పంటల కోసం భారీగా పెట్టుబడులు పెట్టారు. కానీ, అకాల వర్షాలు/వాతావరణ మార్పుల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. పండిన స్వల్ప మొత్తానికి కూడా ప్రభుత్వ మద్దతు ధర లభించకపోవడంతో పెట్టినపెట్టుబడులు పూర్తిగా నష్టపోయారుఫలితంగా, ప్రైవేటు అప్పులు మరియు ఇతర రుణాల భారం పెరిగిపోయింది. ఈ భారాన్ని మోయలేక తీవ్ర మనస్తాపానికి లోనైన సుబ్బరాయుడు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు.సుబ్బరాయుడు మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్న కుటుంబాన్ని పోషించుకోడానికి పడిన తపన విఫలం కావడంతోనే ఆయన ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారని గ్రామస్థులు విచారం వ్యక్తం చేశారు.ఈ సంఘటన రైతాంగం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులకు తాజా ఉదాహరణ. ప్రభుత్వం తక్షణం స్పందించి, సుబ్బరాయుడు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని, అలాగే రైతుల పంటలకు కనీస గిట్టుబాటు ధరలను నిర్ణయించాలని స్థానిక రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

విశాఖపట్నం

విశాఖ ఫోటోగ్రాఫర్స్ ఎకగ్రీవంగా ఎన్నిక:

విశాఖ ఫోటోగ్రాఫర్స్ ఎకగ్రీవంగా ఎన్నిక: విశాఖ జిల్లా ఫోటోగ్రఫీ & వీడియోగ్రఫీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా శ్రీ మట్టా లోకేష్ కుమార్ , ప్రధాన కార్యదర్శిగా శ్రీ చల్ల నూకరాజు ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గా ఎన్నికైన మట్టా లోకేష్ కుమార్ మాట్లాడుతూ అసోసియేషన్ అభివృద్ధి కోసం కృషి చేస్తామని అన్నారు. ప్రదాన కార్యదర్శి గా ఎన్నికైన చల్లా నూకరాజు మాట్లాడుతూ ఎన్నికలకు సహకరించి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎన్నికల అధికారులు గా T. V. R. M. రాజు గారు, బాబా రెడ్డి గారు, K. K. ప్రసాద్ గారు వ్యవహరించారు. అధిక సంఖ్యలో ఫోటోగ్రాఫర్స్ పాల్గొన్నారు. మన ఫోటోగ్రాఫర్లు మరియు వీడియోగ్రాఫర్లు తరఫున మీ ఇద్దరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు 🙏.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.