Tuesday, 5 May 2026

Blog

అన్నమయ్య

పంట నష్టం–అప్పుల భారంతో రైతు ఆత్మహత్య

పంటలు పండక పెట్టిన పెట్టుబడులు రాక, గిట్టుబాటు ధరలు లేక అప్పుల భారం తట్టుకోలేక ఓ రైతు పొలంలోనే ఆత్మహత్య చేసుకున్న ఘటన గ్రామాన్ని విషాదంలో ముంచింది. మండలంలోని జెట్టివారిపల్లి గ్రామానికి చెందిన యేదోటి వెంకటసుబ్బయ్య కుమారుడు యేదోటి సుబ్బరాయుడు (48) కువైట్‌కు వెళ్లి ఉపాధి సాధించి స్వగ్రామానికి వచ్చి వ్యవసాయంపై ఆశలు పెట్టుకున్నాడు. భార్య సుభాషిణితో కలిసి కౌలుకు 13 ఎకరాలు తీసుకుని పంటలు సాగు చేసిన సుబ్బరాయుడికి వరుస నష్టాలు ఎదురయ్యాయి. వాతావరణ ప్రతికూలతలు, పెరిగిన సాగు ఖర్చులు, దిగుబడులు తగ్గడం, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం కారణంగా దాదాపు రూ.20 లక్షల మేర అప్పులు పేరుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పుల వసూళ్ల ఒత్తిడితో తీవ్ర మనోవేదనకు లోనైన ఆయన చివరకు తన పొలంలోనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతూ, రైతులను ఆదుకునే విధంగా ధరల హామీ, రుణభారం తగ్గింపు వంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరుకి రావాలని మేకపాటి పిలుపు

ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉదయగిరిలో సంతకాలు సేకరించారు వాటిని నెల్లూర్ నుంచి తాడేపల్లి వైసీపీ కార్యాలయానికి సోమవారం తరలించనున్నారు ఈ సందర్భంగా నెల్లూరు గాంధీ బొమ్మ నుంచి వి ర్ సి సెంటర్ వరకు ర్యాలీ చేస్తామని అందులో ఉదయగిరి నాయకులు పాల్గొనాలనీ ఇంచార్జీ మేకపాటీ రాజగోపాల్ రెడ్డి కోరారు

అన్నమయ్య

చిట్వేలిలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపుదాడి: నలుగురు అరెస్టు

-పబ్లిక్ స్థలంలో గుట్టు చప్పుడు కాకుండా జూదం ఆడుతున్న ముఠా పట్టివేత -రూ. 6,300 నగదు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం.. కేసు నమోదు చిట్వేలి, డిసెంబర్ 14 ఎల్లో సింగం ప్రతినిధి చిట్వేల్ మండలంలో బహిరంగ స్థలాల్లో చట్టవిరుద్ధంగా పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఆదివారం నాడు చిట్వేల్ ఎస్ఐ ఎస్. వినోద్ కుమార్ తమ సిబ్బందితో కలిసి మెరుపు దాడి చేసి నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.ఆదివారం మధ్యాహ్నం చిట్వేల్ పోలీసులు గస్తీ నిర్వహిస్తుండగా, చెర్లోపల్లి గ్రామానికి పడమర వైపు గల ప్రాంతంలో కొందరు వ్యక్తులు అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచారం అందింది.సమాచారం అందుకున్న ఎస్ఐ ఎస్. వినోద్ కుమార్ తమ సిబ్బందితో కలిసి ఆకస్మికంగా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ కంపచెట్ల పొదల చాటున ఉన్న ఒక పబ్లిక్ స్థలంలో నలుగురు వ్యక్తులు డబ్బులను పణంగా పెట్టి పేకాట (జూదం) ఆడుతుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు.పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి:రూ. 6,300 నగదు (పణంగా పెట్టిన డబ్బు) రెండు సెల్‌ఫోన్లనుపోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా ఎస్ఐ వినోద్ కుమార్ మాట్లాడుతూ, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు, ముఖ్యంగా జూదం, పేకాట వంటి వాటిని మండలంలో ఎక్కడా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అరెస్టు చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ తెలిపారు.

కామారెడ్డి

ఘనంగా గట్టు మల్లన్న జాతర!

– అన్నారం గ్రామంలో భక్తి మహా పండుగ కామారెడ్డి, 14డిసెంబర్, (పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం: ప్రత్యేక సంచరణకామారెడ్డి జిల్లా రామారెడ్డి మండ లం అన్నారం గ్రామంలో గట్టు మల్లన్న ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భక్తుల ఉత్సాహం, గ్రామీణ సంస్కృతి మహిమలు కనిపించిన ఈ జాతరలో వేలాది మంది పాల్గొన్నారు.ఉదయం నుంచి భక్తి సంబరాలుప్రధాన అర్చకులు మాట్లాడుతూ, “ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే మల్లన్న ఉత్సవాలు ఈ ఏటా కూడా అందంగా జరిగాయి” అని పేర్కొన్నా రు. ఉదయం సుప్రభాత సేవలు, అభిషేక పూజల తో ప్రారంభమైన ఉత్సవాలు మల్లన్న కళ్యాణోత్స వం ఘనంగా నిర్వహించారు.భక్తులు వెంట తెచ్చు కున్న మొక్కులను హుండిలో వేసి, మనసులోని మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు బోనాలు సమర్పించి, దైవదారిశిని పొందారు.ఎడ్లబండ్లు, అన్నదానం.. గ్రామోత్సవ సంబరాలు కుల సంఘా ల ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల ప్రదర్శన ఘనంగా జరిగింది. దూండగల నృత్యాలు, ఢమ్ ఢమ్ డ్రమ్స్‌తో గ్రామం మొత్తం మైమపడింది. చివరగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు ఆనందంగా పాల్గొన్నారు.

కామారెడ్డి

ఘనంగా గట్టు మల్లన్న జాతర!

– అన్నారం గ్రామంలో భక్తి మహా పండుగ కామారెడ్డి, 14డిసెంబర్, (పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం: ప్రత్యేక సంచరణకామారెడ్డి జిల్లా రామారెడ్డి మండ లం అన్నారం గ్రామంలో గట్టు మల్లన్న ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భక్తుల ఉత్సాహం, గ్రామీణ సంస్కృతి మహిమలు కనిపించిన ఈ జాతరలో వేలాది మంది పాల్గొన్నారు.ఉదయం నుంచి భక్తి సంబరాలుప్రధాన అర్చకులు మాట్లాడుతూ, “ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే మల్లన్న ఉత్సవాలు ఈ ఏటా కూడా అందంగా జరిగాయి” అని పేర్కొన్నా రు. ఉదయం సుప్రభాత సేవలు, అభిషేక పూజల తో ప్రారంభమైన ఉత్సవాలు మల్లన్న కళ్యాణోత్స వం ఘనంగా నిర్వహించారు.భక్తులు వెంట తెచ్చు కున్న మొక్కులను హుండిలో వేసి, మనసులోని మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు బోనాలు సమర్పించి, దైవదారిశిని పొందారు.ఎడ్లబండ్లు, అన్నదానం.. గ్రామోత్సవ సంబరాలు కుల సంఘా ల ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల ప్రదర్శన ఘనంగా జరిగింది. దూండగల నృత్యాలు, ఢమ్ ఢమ్ డ్రమ్స్‌తో గ్రామం మొత్తం మైమపడింది. చివరగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు ఆనందంగా పాల్గొన్నారు.

కామారెడ్డి

ఘనంగా గట్టు మల్లన్న జాతర!

– అన్నారం గ్రామంలో భక్తి మహా పండుగ కామారెడ్డి, 14డిసెంబర్, (పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం: ప్రత్యేక సంచరణకామారెడ్డి జిల్లా రామారెడ్డి మండ లం అన్నారం గ్రామంలో గట్టు మల్లన్న ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భక్తుల ఉత్సాహం, గ్రామీణ సంస్కృతి మహిమలు కనిపించిన ఈ జాతరలో వేలాది మంది పాల్గొన్నారు.ఉదయం నుంచి భక్తి సంబరాలుప్రధాన అర్చకులు మాట్లాడుతూ, “ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే మల్లన్న ఉత్సవాలు ఈ ఏటా కూడా అందంగా జరిగాయి” అని పేర్కొన్నా రు. ఉదయం సుప్రభాత సేవలు, అభిషేక పూజల తో ప్రారంభమైన ఉత్సవాలు మల్లన్న కళ్యాణోత్స వం ఘనంగా నిర్వహించారు.భక్తులు వెంట తెచ్చు కున్న మొక్కులను హుండిలో వేసి, మనసులోని మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు బోనాలు సమర్పించి, దైవదారిశిని పొందారు.ఎడ్లబండ్లు, అన్నదానం.. గ్రామోత్సవ సంబరాలు కుల సంఘా ల ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల ప్రదర్శన ఘనంగా జరిగింది. దూండగల నృత్యాలు, ఢమ్ ఢమ్ డ్రమ్స్‌తో గ్రామం మొత్తం మైమపడింది. చివరగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు ఆనందంగా పాల్గొన్నారు.

అన్నమయ్య

మానవ హక్కుల పరిరక్షకుడు అవార్డు అందుకున్న షేక్ మహమ్మద్ అజీమ్

రైల్వే కోడూరు వాసి షేక్ మహమ్మద్ అజీమ్ మానవ హక్కుల రంగంలో చేసిన సేవలకు గాను ప్రతిష్టాత్మకమైన “మానవ హక్కుల పరిరక్షకుడు అవార్డు”ను అందుకున్నారు. ప్రతి ఏటా డిసెంబర్ 10న నిర్వహించే అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మహారాష్ట్ర రాష్ట్రం ఔరంగాబాద్ నగరంలో వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఈ గౌరవం లభించింది. ఈ కార్యక్రమంలో వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఎం.ఆర్. అన్సారీ గారు షేక్ మహమ్మద్ అజీమ్‌కు అవార్డు మరియు కాంస్య పతకంను స్వయంగా అందజేశారు. షేక్ మహమ్మద్ అజీమ్ గత కొన్ని సంవత్సరాలుగా సమాజంలో బలహీన వర్గాల హక్కుల పరిరక్షణ, పేదలు–నిరుపేదలకు న్యాయం అందేలా పోరాటాలు, మానవ హక్కుల ఉల్లంఘనలపై అవగాహన కార్యక్రమాలు, అవసరమైన వారికి చట్టపరమైన సహాయం అందించడం వంటి అనేక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఆయన చేసిన నిరంతర కృషికి గుర్తింపుగా ఈ అవార్డు ప్రదానం చేయడం గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా షేక్ మహమ్మద్ అజీమ్ మాట్లాడుతూ, “మానవ హక్కుల పరిరక్షణ అనేది ఒక్క వ్యక్తి పని కాదు, సమాజం మొత్తం బాధ్యత. ఈ అవార్డు నాకు మరింత ప్రేరణనిస్తూ ప్రజల కోసం ఇంకా సేవ చేయాలనే ఉత్సాహాన్ని ఇస్తోంది” అని తెలిపారు. ఈ అవార్డు రైల్వే కోడూరు ప్రాంతానికి గర్వకారణమని స్థానికులు, సామాజిక కార్యకర్తలు, మానవ హక్కుల సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ షేక్ మహమ్మద్ అజీమ్‌కు అభినందనలు తెలిపారు.

Others

బీజేపీ నూతన రద సారధి గా నితిన్ నబి

పున్నమి ప్రతినిధి భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ నూతన రాదసారధి గా నితిన్ నబి ని జాతీయ పార్టీ నియమించినది. వీరికి ముందు జగత్ ప్రకాష్ నడ్డ ఈ యొక్క భాద్యత ని నిర్వహించారు. సామాన్య కార్యకర్త కి ఇలాంటి కీలక భాద్యత లు అప్పగించడం అనేది కేవలం బీజేపీ కే సాధ్యం అని బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిప్రాయ పడుతున్నారు.

అనకాపల్లి

హస్తకళాకారులకు పనిముట్లును అందించిన శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రడు..!

డిసంబర్ 14 పున్నమి న్యూస్ ప్రతినిధి (ఆనంద్): అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణ దేవి పేట గ్రామంలో కేంద్ర హస్తకళల అభివృద్ధి సంస్థ మరియు రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో గతంలో 50 మంది కళాకారులకు కార్పెంటరీ వుడ్ కార్వింగ్ మీద శిక్షణ ఇవ్వడం జరిగింది .అందులో శిక్షణ పొందినటువంటి ప్రతి కళాకారుడికి పదివేల రూపాయలు విలువచేసే పనిముట్లులను మా గురువర్యులు గౌరవ శాసనసభ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారి చేతుల మీదగా పనిముట్లు అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కేంద్ర హస్తకళల అభివృద్ధి సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ అపర్ణ లక్ష్మి గారు , లేపాక్షి విశాఖపట్నం మేనేజర్ కార్తీక్ గారు,రాజాన సూర్యచంద్ర గారు మరియు అధిక సంఖ్యలో కళాకారులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

దేవాడ 77వ వార్డులో పులిచర్ల ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం విజయవంతం

నమ్మిదొడ్డి జంక్షన్, దేవాడ గ్రామం 77వ వార్డులో ఆదివారం ఉదయం పులిచర్ల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫోర్ ఎస్ హాస్పిటల్ స్పెషలిస్టుల సహకారంతో మెగా వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరానికి పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య సేవలు పొందారు. ఈ మెడికల్ క్యాంపులో అన్ని విభాగాలకు చెందిన స్పెషలిస్టు డాక్టర్లు పాల్గొని సుమారు నాలుగు వందల మంది వరకు వచ్చిన వారి ఆరోగ్య సమస్యలను సమగ్రంగా పరీక్షించారు. ఎముకల సమస్యలు, నరాల వ్యాధులు, సాధారణ రుగ్మతలతో పాటు ఇతర అనారోగ్యాలపై వైద్యులు సలహాలు అందించారు. పరీక్షల అనంతరం రోగులకు అవసరమైన అన్ని రకాల మందులను పూర్తిగా ఉచితంగా అందించడం ఈ శిబిరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పులిచర్ల ట్రస్ట్ డాక్టర్ రవిశంకర్ ఎంఎస్ ఆర్తో ఆధ్వర్యంలో ఈ మెగా క్యాంపు సక్రమంగా, క్రమబద్ధంగా నిర్వహించబడింది. ఈ సేవా కార్యక్రమంలో సామాజిక కార్యకర్త పులిచర్ల ఫణి కుమార్ ప్రత్యేకంగా పాల్గొని నిర్వాహకులను ప్రోత్సహించారు. ప్రజారోగ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుని నిర్వహించిన ఈ మెగా వైద్య శిబిరం స్థానికుల ప్రశంసలు పొందింది. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.