Tuesday, 28 April 2026

Blog

తిరుపతి

ఏపీ అసెంబ్లీ క్రీడల్లో ఉత్సాహంతో పాల్గొన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 24: శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఏపీ అసెంబ్లీ క్రీడా మహోత్సవాలు ఉత్సాహవంతంగా కొనసాగుతున్నానేపద్యంలో క్రీడా పోటీల్లో చురుకైన ఉత్సాహంతో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొనడం ప్రత్యేకంగా నిలిచింది. ప్రజా సేవలో నిత్యం తలమునకలలై ఉండే ఆయన క్రీడల పట్ల తన ఆసక్తిని మరోసారి నిరూపించారు. మైదానంలో ఆయన చూపించిన చలాకీతనం, క్రీడాస్ఫూర్తి తోటి శాసనసభసభ్యుల ప్రశంసలు అందుకుంది. రాజకీయ భిన్నాభిప్రాయాలు సహజమైనవే అయినా క్రీడలు అందరినీ ఒకే వేదికపై కలుపుతాయని క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్నీ అందిస్తాయని ప్రజాప్రతినిధులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమని శాసనసభ క్రీడా మహోత్సవాలు సభ్యుల మధ్య స్నేహభావాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. ఏది ఏమైన ఈ వేడుకల్లో సుధీర్ రెడ్డి పాల్గొనడం మరింత ఉత్సాహాన్ని నింపిందనే చెప్పుకోవాలి తమ నాయకుడు ఈ క్రీడల్లో అత్యంత ప్రతిభ కనపరిచి విజియాన్ని కైవసం చేసుకోవాలని నియోజిక వర్గంలోని నాయకులు, కార్యకర్తలు, సుధీర్ రెడ్డి అభిమానులు ఆశిస్తునారు.

తిరుపతి

కార్యకర్తల గౌరవానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 24: శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పార్టీ కార్యకర్తల సమస్యలపై దృష్టి సారించారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ క్రీడా మహోత్సవాల్లో పాల్గొంటూనే తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడుతున్న కార్యకర్తలకు తగిన గుర్తింపు, నామినేటెడ్ పదవులు కల్పించాలని కోరుతూ “రాష్ట్ర అధ్యక్షులు పళ్ళ శ్రీనివాస్ యాదవ్” ని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ వినతిపై పళ్ళ శ్రీనివాస్ యాదవ్ సానుకూలంగా స్పందిస్తూ, పార్టీ కోసం నిజాయితీగా పనిచేసే కార్యకర్తలకు తప్పకుండా న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు.

తిరుపతి

విజయవంతమైన జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 24: శ్రీకాళహస్తి పట్టణంలోని CM ఫంక్షన్ హాల్ నందు జనసేన ఉద్యమి సన్నాహక కార్యక్రమం గూర్చి సమావేశం జనసేన ముఖ్య నాయకులు, జనసైనికులు, వీరమహిళల మధ్య అట్ట హాసంగా జరిగింది. ఈ సమావేశానికి అతిథులుగా ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొని జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వము గురించి పలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాలహస్తీశ్వర దేవస్థాన పాలకమండలి అధ్యక్షులు కొట్టే సాయి ప్రసాద్, జనసేన పార్టీ నాయకులకు, వీర మహిళలకు, జనసైనికులకు పాల్గొన్నారు.

తిరుపతి

లబ్ధిదారుల వద్దకేళ్లి సి.యం. రిలీఫ్ ఫండ్ అందజేసిన బొజ్జల రిషిత రెడ్డి

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 24: శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషిత రెడ్డీ, అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మన తొట్టంబేడు మండలం లోని బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని నేడు నేరుగా వారి ఇళ్ల వద్దకే వెళ్లి అందజేశారు. తొట్టంబేడు మండలంలో 19 మంది లబ్ధిదారులకు సంబంధించి మొత్తం రూ. 12,29,918 విలువైన చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.

తిరుపతి

వికసిత్ భారత్ – జీ రామ్ జీ పథకంతో ఇసుక తాగేలిలో రోడ్డు సౌకర్యం

ఏర్పేడు, పున్నమి న్యూస్, ఫిబ్రవరి 24: ఏర్పేడు మండలం ఇసుక తాగేలి గ్రామంలో వికసిత్ భారత్ – జీ రామ్ జీ పథకం కింద సుమారు 46 లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణంకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. మంగళవారం నాడు ఈ పనులను కాంట్రాక్టర్ నూతలపాటి సూర్యనారాయణ నేతృతంలో పనులను ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ జెడ్పిటిసి సభ్యులు పేరం ధనంజయలు నాయుడు, ఏపీ సీడ్స్ మాజీ డైరెక్టర్ కందటి శివశంకర్ రెడ్డి లు ముఖ్య అతిథులుగా హాజరై భూమి పూజ చేసి రోడ్డు పనులను ప్రారంభించారు. పూతలపట్టు – నాయుడుపేట పాత రహదారి నుంచి ఇసుక తాగేలీ వరకు ఒక కిలోమీటర్ తారు రోడ్డు, 120 మీటర్ల సిసి రోడ్డు నిర్మాణాన్ని పనులు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి టిడిపి నాయకులు హంస ,ముని రామయ్యలు, సర్పంచ్ కందాటి గరవమ్మ, ప్రభాకర్ రెడ్డి, మధు, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. అనేక సంవత్సరాలుగా గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేక ప్రజలు అవస్థలు పడేవారు . ప్రస్తుతం టిడిపి హయాంలో ఇసుక తాగేలికి తారు రోడ్డు సౌకర్యం ఏర్పడడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తిరుపతి

శ్రీవాణి నిధులతో స్వర్ణముఖి నదీశ్వరుని ఆలయ పునః నిర్మాణం

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 24: శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సహరకారంతో శ్రీకాళహస్తి చుక్కల నిడిగల్లు గ్రామంలో చుక్కల నిడిగల్లు ఎస్టి కాలనీ శివాలయం కు 20 లక్షలు శ్రీవాణి ట్రస్టు నిధులతో మంజూరయ్యాయని ఈనెల 26వ తేదీన శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. చుక్కల నిడిగల్లు ఎస్టి కాలనీలో బోడి దేవాలయం చుక్కలు నిడిగల్లు చెరువు వద్ద వెలిసిన స్వర్ణముఖి నదీశ్వరుడు లింగం 500 సంవత్సరాల పైబడి ఉన్న ఆలయంలో 30 సంవత్సరాల ముందు నిధులు కోసం దొంగలు స్వామివారిని పక్కకు జరపడంతో అప్పటినుంచి శివుడికి నీడ లేకపోవడంతో ఈ విషయాన్ని కమిటీ సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోని కలిసి శివాలయం పరిస్థితి విన్నవించడంతో దేవాదాయ ధర్మాదాయ శాఖ, మంత్రి దేవాదాయ శాఖ కమిషనర్ వారందరి సహకారంతో ఈ ఆలయ పునఃనిర్మాణం ప్రారంభిస్తున్నామని తిరుపతి జిల్లా కలెక్టరేట్ ఏసి రామకృష్ణ సమక్షంలో చుక్కల నిడిగల్లు భక్తులు, ప్రజలు, శ్రీకాళహస్తి దేవస్థాన వేద పందితులు శివప్రసాద్ శర్మ బాలాలయం ఏర్పాట్లు చేసి అక్కడి నుంచి శివలింగాన్ని తొలగించి గుడి నిర్మాణం పూర్తయిన తర్వాత మళ్లీ శివయ్య అక్కడే ప్రతిష్టిస్తామనీ వారు తెలిపారు.

తిరుపతి

శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి 15వ వార్షికోత్సవంలో ముక్కా వరలక్ష్మి పాల్గొన్నారు

రైల్వే కోడూరు మండలం ఉర్లగట్టుపోడు పంచాయితీ పరిధిలోని బాలిరెడ్డిపల్లె గ్రామంలో వెలసిన శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం 15వ వార్షికోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్, కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి శ్రీమతి ముక్కా వరలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఆమె ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు శాలువ కప్పి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ముక్కా వరలక్ష్మి మాట్లాడుతూ, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. గ్రామాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం తమ కుటుంబం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు.కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, టీడీపీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఖమ్మం

వెలుగుమట్లలో పేదల గుడిసెల కూల్చివేత అమానుషం – కాంగ్రెస్, బీఆర్‌ఎస్, కమ్యూనిస్టులు కుమ్మక్కై మోసం: బీజేపీ ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్

ఖమ్మం ఫిబ్రవరి (పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి దిన పత్రిక జిల్లా ఇంచార్జి) ఖమ్మం కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో ఉన్న వెలుగుమట్ల పరిధిలోని 62 ఎకరాల భూదాన్ భూముల్లో పదేళ్లుగా నివసిస్తున్న సుమారు వెయ్యి పేద కుటుంబాల గుడిసెలను కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్ పేర్కొన్నారు. పేదల ఇళ్లను జేసీబీలతో నేలమట్టం చేయడం అమానుష చర్య అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాలు ఇప్పిస్తామని చెప్పి గతంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ నాయకులు అమాయక ప్రజల వద్ద లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసం చేశారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక పేదలకు న్యాయం చేయాల్సిందిపోయి, వేలాది మంది పోలీసులతో దాడి చేసి గుడిసెలను కూల్చివేయడం ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచే చర్య అని విమర్శించారు. కనీసం కుటుంబాలకు తమ సామాన్లు సర్దుకునే సమయం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. బీజేపీ ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్ మాట్లాడుతూ, పదేళ్లుగా అక్కడే నివసిస్తూ ప్రభుత్వాన్ని పట్టాల కోసం వేడుకుంటున్న పేదలపై ఈ విధంగా ప్రతాపం చూపించడం కాంగ్రెస్ ప్రభుత్వ అసలు స్వరూపాన్ని బయటపెట్టిందన్నారు. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకు ముగ్గురు మంత్రుల ఆదేశాలతోనే ఈ చర్యలు జరిగాయని ఆరోపించారు. ఈ భూములపై ఎప్పటినుంచో కన్నేసిన కొందరు రాజకీయ నాయకులు పథకం ప్రకారం పావులు కదిపారని, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ లు కూడా ఈ వ్యవహారంలో పాత్ర పోషించారని బీజేపీ నేతలు విమర్శించారు. తెల్లవారుజామునే భారీ పోలీస్ బలగాలను మోహరించి పేదల ఇళ్లను ఖాళీ చేయించడం నిరంకుశ పాలనకు నిదర్శనమని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలకు ఇళ్లు ఇవ్వడంలో విఫలమయ్యారని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేరు చెప్పుకుంటూ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. పేదలను రోడ్డున పడేసే విధానాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై భారతీయ జనతా పార్టీ ప్రజల తరఫున అండగా నిలుస్తుందని, న్యాయపరంగా మరియు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్ హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్

వరిగొండ జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానంలో ఘనంగా వనభోజన మహోత్సవం

వరిగొండ గ్రామంలోని శ్రీ జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానంలో జంగమ సేవా సంఘం ఆధ్వర్యంలో 12వ వార్షిక వనభోజన మహోత్సవం భక్తుల సమక్షంలో ఘనంగా జరిగింది. గోపూజ, అభిషేకం, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, మెడికల్ క్యాంప్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దాతలకు సన్మానాలు, వివాహ పరిచయ వేదిక, పిల్లలకు బహుమతులు అందించారు. ఆలయ చైర్మన్ కోడూరు శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను ఎలాంటి చిన్న తప్పిదాలకు తవ్వివకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను ఎలాంటి చిన్న తప్పిదాలకు తవ్వివకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి పున్నమి న్యూస్ ప్రతినిధి 24 ఫిబ్రవరి 2026 జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్: రంగారెడ్డి జిల్లా ఈ నెల 25వ తేదీ బుధవారం నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను ఎలాంటి చిన్న తప్పిదాలకు తవ్వివకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు.మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశం మందిరం నుండి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత ఆర్డీఓలు, ఎంపిడిఓలు, ఆర్.సి.లు, పోలీస్ శాఖ అధికారులు, విద్యుత్ అధికారులు, విద్యాశాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులతో ఇంటర్ పరీక్షలపై టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ బుధవారం నుండి మార్చ్ 18వ తేదీ వరకు ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలకు చేపట్టవలసిన పనులను సమన్వయంతో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు నిర్వహణకు సరైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, డివిజన్ స్థాయిలో సంబంధిత అధికారులతో వాట్సప్ గ్రూప్ చేయాలన్నారు. ఆర్డీఓ కార్యాలయాలలో ఎగ్జామ్ సెల్ ను ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష విధులు నిర్వహించే ప్రతి అధికారి బాధ్యతగా పని చేయాలన్నారు. పరీక్ష కేంద్రాలలో ఎటువంటి తప్పిదాలు జరగకుండా నిర్వహించాలన్నారు. జిల్లాలో 200 పరీక్షా కేంద్రాల ద్వారా 84,301 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, 70,171 మంది రెండవ సంవత్సరం విద్యార్థులు, జిల్లాలో మొత్తం 1,54,472 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని, 31 ప్రశ్న పత్రాల స్టోరేజ్ పాయింట్లు ఉంటాయని తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రంలో సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని, మాస్ కాపీయింగ్ కు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. పోలీస్ శాఖ వారు పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు నిర్వహించాలని, పరీక్షా పరీక్షా సమయంలో జీరాక్స్ సెంటర్లు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు హాజరయ్యేలా ఆర్టీసీ అధికారులు బస్సులను నడపాలని, పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులతో మెడికల్ పాయింట్ ఏర్పాటు చేసి సిబ్బంది కేంద్రాల వద్ద అందుబాటులో ఉండేలా వైద్య అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. విద్యుత్ శాఖ అధికారులు పరీక్షా కేంద్రాలలో ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోస్టల్ శాఖ వారు జవాబు పత్రాలను సరిగా రిసీవ్ చేసుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాలలో అవసరమైన మంచినీరు, ఫాన్స్, టాయిలెట్స్ ఏర్పాట్లు సరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎవ్వరూ కూడా మొబైల్ ఫోన్స్ తీసుకెళ్లకూడదని, విద్యార్థులు పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికాలు, ముఖ్యంగా మొబైల్ ఫోన్లు తీసుకెళ్లకుండా పరిశీలించాలని సూచించారు.ఈ సమావేశంలో ఆర్డీఓలు జగదీశ్వర్ రెడ్డి, అనంత్ రెడ్డి, సరిత, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంక్యా నాయక్, విద్యాశాఖ అధికారి సుసిందర్ రావు, వైద్య ఆరోగ్య శాఖ అధికారి లలితా దేవి, పోలీస్ అధికారులు, పోస్టల్ శాఖ అధికారులు, ఆర్టీసీ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.