Tuesday, 28 April 2026

Blog

హైదరాబాద్

రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు ప్రజలకు గౌరవప్రదమైన సేవలే లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

పున్నమి ప్రతి నిధి రాష్ట్రంలో ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, పారదర్శకమైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో తహసీల్దార్ మరియు ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మొదటి దశలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న 60 తహసీల్దార్ కార్యాలయాలు, 5 ఆర్డీవో కార్యాలయాలకు ఆధునిక సౌకర్యాలతో శాశ్వత భవనాలు నిర్మిస్తామని వెల్లడించారు. అలాగే రెండ‌వ విడ‌త‌లో శిధిలావ‌స్ధ‌లో ఉన్న 170 ఆర్డీవో, త‌హ‌సీల్దార్ కార్యాల‌యాల‌ను నిర్మిస్తామ‌ని వెల్ల‌డించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని భవనాలు ఒకే నమూనాలో, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా డిజైన్ చేయనున్నట్లు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చర్చించి డిజైన్లకు తుది రూపు ఇస్తామని చెప్పారు. త‌క్కువ ఖ‌ర్చుతో ప్ర‌జ‌ల‌కు అత్యుత్త‌మ సేవ‌లు అందేలా ఈ భ‌వ‌నాల నిర్మాణం ఉంటుంద‌న్నారు. బుధవారం సచివాలయంలో తన కార్యాలయంలో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్స రెడ్డి మీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఎన్ని తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి, శిధిలావ‌స్ధ‌, పాల‌న‌కు అనువుగా లేని భ‌వ‌నాలు వివ‌రాలను సేకరించారు. “ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగడం సరైంది కాదు. ప్రజలకు సేవలందించే కేంద్రాలు గౌరవప్రదంగా ఉండాలి” అన్న గౌర‌వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డక ముందు, ఏర్ప‌డిన త‌ర్వాత కూడా రెవెన్యూ కార్యాల‌యాలు ప్ర‌జ‌ల‌కు సౌక‌ర్య‌వంతంగా లేక‌పోవ‌డంతోపాటు చాలా వ‌ర‌కు అద్దె భ‌వ‌నాల‌లోనే కొన‌సాగుతున్నాయ‌ని అన్నారు. గత ప్రభుత్వం ముందుచూపు లేకుండా, ప్రణాళికాబద్ధత లేకుండా మండలాల పునర్విభజన చేపట్టిందని, కొన్ని మండలాలు రెండు మూడు జిల్లాల పరిధిలోకి వచ్చే విధంగా రూపొందించింద‌ని మంత్రి విమర్శించారు. అనేక కార్యాలయాల్లో కనీస వసతులు లేకపోవడం, సిబ్బంది కొరత తీవ్రంగా ఉండడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మండలాలకు అవసరమైన పోస్టులు మంజూరు చేసి పరిపాలనను బలోపేతం చేశామని తెలిపారు. అలాగే ప్ర‌జ‌ల‌కు దూరంగా కల‌క్ట‌రేట్‌ల‌ను నిర్మించి నిర్వ‌హ‌ణ‌ను గాలికివ‌దిలేశార‌ని విమ‌ర్శించారు. స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖలో అత్యాధునిక వసతులతో సమీకృత భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని మంత్రి తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 12 క్లస్టర్లుగా విభజించి సమీకృత భవనాలు నిర్మిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే గచ్చిబౌలి, మేడ్చల్-మల్కాజిగిరి, పఠాన్ చెరువులలో భవనాలకు శంకుస్థాపన పూర్తయ్యిందని, గచ్చిబౌలిలో నిర్మాణ పనులు తుది దశలో ఉండి మరికొద్ది నెలల్లో ప్రారంభానికి సిద్ధమవుతుందని తెలిపారు. రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను ఆధునికీకరించి, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్తె రెడ్డి లిపారు.

ఖమ్మం

ఖమ్మంలో బీజేపీ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ కార్యశాల ఘనంగా నిర్వహణ:

ఖమ్మం, ఫిబ్రవరి (పున్నమి జిల్లా ఇంచార్జి ) దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశయాలను కార్యకర్తలలో మరింత బలంగా ప్రతిష్టించాలనే లక్ష్యంతో ఖమ్మం నగరంలోని మినర్వాగ్రాండ్ వేదికగా బుధవారం “పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ కార్యశాల–2026” ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడింది. జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బసవాపురం లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యదర్శి & ఖమ్మం జిల్లా ప్రబారి బద్దం మైపాల్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఏకాత్మ మానవతావాదం మరియు అంత్యోదయ సిద్ధాంతాలు సమాజంలోని చివరి వ్యక్తికి చేరేలా కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి క్రమశిక్షణ, సిద్ధాంత నిబద్ధత మరియు క్షేత్రస్థాయి కార్యాచరణ అత్యవసరమని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు గేంటెల విద్యాసాగర్, వక్కలంక సుబ్రహ్మణ్యం, పెరుమాళ్లపల్లి విజయరాజు, చిలుకూరు రమేష్, నున్న రవి కుమార్, అల్లిక అంజయ్య రవి గౌడ్, మణిమందా సరస్వతి, గుత్త వెంకటేశ్వర్లు, నాయుడు రాఘవ, ఆపతి రామరావు, గడీల నరేష్, వంకదాని రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

రజక కుటుంబంపై దాడి దుర్మార్గం – పసికందు మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలి: బీజేపీ ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు వెంకటనారాయణ

ఖమ్మం ఫిబ్రవరి (పున్నమి జిల్లా ఇంచార్జి ) నాగర్‌కర్నూల్ జిల్లా లోని కొమురెల్లి మల్లన్న దేవస్థానం జాతర సందర్భంగా రజక కుటుంబంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో రెండు నెలల పసికందు మృతి చెందడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. మల్లన్న దర్శనం కోసం వెళ్లిన చాకలి చంద్రకళ కుటుంబాన్ని కులం పేరుతో దూషిస్తూ, ఆలయంలోకి ప్రవేశం నిరాకరించి కొందరు అగ్రకుల వ్యక్తులు అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాట, దాడిలో కుటుంబ సభ్యులు గాయపడగా, రెండు నెలల శిశువు ప్రాణాలు కోల్పోవడం సమాజం తలదించుకోవాల్సిన ఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. కుల వివక్షతో వ్యవహరించడం, దేవాలయంలోకి ప్రవేశం నిరోధించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్న వెంకటనారాయణ, బాధ్యులపై వెంటనే హత్య కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటనపై నిరసనలు వ్యక్తమవుతున్నాయని, బాధిత కుటుంబానికి న్యాయం చేయడం ప్రభుత్వం బాధ్యత అని అన్నారు. ఇలాంటి అమానుష ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తిసుకోవాలని ధనియాకుల వెంకట్ నారాయణ కోరారు.

ఖమ్మం

ప్రత్యామ్నాయం లేకుండా ఇళ్లు కూల్చడం అమానుషం – అసలైన పేదలకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం: దేవకీ వాసుదేవరావు

ఖమ్మం ఫిబ్రవరి (పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం భూదాన్ కాలనీలో గత 14 ఏళ్లుగా నివాసం ఉంటున్న నిరుపేదలను ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండా ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా గెంటివేయడాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు తీవ్రంగా ఖండించారు. అసలైన పేదలకు న్యాయం జరగాల్సిందేనని, వారికి ఇళ్ల హక్కు కల్పించేవరకు బీజేపీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఇళ్లు కోల్పోయి ప్రస్తుతం ఖమ్మం నగరంలోని Ambedkar Bhavan లో తలదాచుకుంటున్న బాధితులను దేవకీ వాసుదేవరావు జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు బీజేపీ ప్రతి నిధి బృందం పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితుల సమస్యలను తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. అనంతరం రోడ్డు మీద నిరసన కార్యక్రమం చేపట్టిన బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వం, పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా నాయకులు నినాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితి అదుపులోకి తీసుకొనేందుకు నాయకులను రెండవ పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా దేవకీ వాసుదేవరావు మాట్లాడుతూ, పేదలపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం అన్యాయమని, ఇళ్లకు ప్రత్యామ్నాయం చూపకుండా కూల్చివేయడం అమానుష చర్య అని విమర్శించారు. బాధితులకు తక్షణమే పునరావాసం కల్పించి, అసలైన అర్హులకు ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అసలైన పేదలకు న్యాయం జరిగే వరకు పార్టీ తరఫున అన్ని విధాలుగా పోరాటం కొనసాగిస్తామని బీజేపీ నాయకులు భరోసా ఇచ్చారు. కార్యక్రమం లో రాజేష్ గుప్తా, రవి రాదోడ్, నరేష్, రామ కృష్ణ, అల్లిక అంజయ్య, రాఘవ రావు, గుత్త వంశీ, విజయరాజు, బాధిత కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు

నారాయణపేట

ఫిబ్రవరి 26 నుంచి జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి- జనసేన హనుమంతు

జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాలూరి గారి ఆదేశాల మేరకు తెలంగాణ విభజన విభాగం సభ్యులు డాక్టర్ మణికంఠ గౌడ్ గారి ఆధ్వరంలో ఫిబ్రవరి 26 నుండి మక్తల్ నియోజకవర్గం లో పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు నిర్వహించబడుతుందనీ మక్తల్ నియోజక వర్గం జనసేన నాయకులు హనుమంతు గారు తెలియజేశారు. భావితరాల భవిష్యత్తు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధినే ధ్యేయంగా పనిచేస్తున్న జనసేన పార్టీ 13వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభసందర్భాన్ని పురస్కరించుకొని 5 వ విడత సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడుతుంది అని అందులో భాగంగా మక్తల్ నియోజకవర్గం లో వందమంది సాధకులతో ఉద్యమి సభ్యత్వాలు నమోదు చేయబడతాయని తెలియజేశారు. సభ్యత్వ నమోదు ద్వారా 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించబడుతుంది. పార్టీ కార్యకర్తకు అనుసంధానంగా ఉండటం కోసం ఉద్యమి సభ్యత్వం ఉపయోగపడుతుందని భవిష్యత్తులో పదవులు గానీ స్థానిక సంస్థల ఎన్నికలలో గానీ ఈ ఉద్యమి సభ్యత్వమే ప్రధాన పాత్ర వహిస్తుందని హనుమంతు తెలియజేశారు. కావున పార్టీ సిద్ధాంతలపట్ల ఆకర్షితులైన వ్యక్తులు పార్టీ భావజాలం పట్ల నమ్మకం ఉన్న వ్యక్తులు పవన్ కల్యాణ్ ఆశయాలు నచ్చేవారందరు కూడా ఈ ఉద్యమి సభ్యత్వం తీసుకోవాలని తెలియజేశారు.

తిరుపతి

మహిళ సాధికారత అవగాహన ర్యాలీ

పున్నమి ప్రతినిధి, రామచంద్రపురం రామచంద్రపురం మండలం వెంకట్రామపురం సమీపంలో ఉన్న సెవన్ హిల్స్ ఫార్మసీ కళాశాల, ఐక్యూఏసి ఆధ్వర్యంలో మహిళా సాదికారత అవగాహన ర్యాలీ తిరుపతి రూరల్ మండలం తనపల్లె గ్రామమునందు నిర్వహించారు. “డ్యూ టు గైన్” థీమ్ ఆధారంగా జరిగే ప్రపంచ మహిళా దినోత్సవం -2026 ను పురస్కరించుకొని భారతదేశ గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబన ద్వేయంగా సాదికారిత సాదించాలని ర్యాలీలో పాల్గొన్న డైరక్టర్ డాక్టర్ లక్షలయ్య, ఎన్ఎస్ఎస్ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ శరవణకుమార్ మహిళా సిబ్బంది మరియు విద్యార్థి విద్యార్థినులు పాల్గొన్నారు

తూర్పు గోదావరి

🤝 కష్టకాలంలో అండగా ‘మానవత’ – షుగర్ బాధితుడికి రూ.6,000 ఆర్థికసాయం

తాళ్లపూడి, ఫిబ్రవరి 25 (పున్నమి ప్రతినిధి): మానవతను ఆచరణలో చూపిస్తూ తాళ్లపూడిలోని మానవత స్వచ్ఛంద సేవా సంస్థ మరోసారి తన సేవాభావాన్ని చాటుకుంది. షుగర్ వ్యాధితో బాధపడుతున్న పెద్దేవం వాసి గుండేపల్లి నాగేశ్వరరావుకు ఇటీవల కాలి వేలు తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో వైద్య ఖర్చులు, మెడిసిన్ వ్యయాలకు తోడ్పడేందుకు సంస్థ తరఫున రూ.6,000 ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు వెలుగుబంటి శ్రీనివాస్ మాట్లాడుతూ, కష్టాల్లో ఉన్న వారి ఒక్క కన్నీటి బొట్టునైనా తుడవడమే మానవత ధ్యేయమని పేర్కొన్నారు. సంస్థ తన వంతుగా అధిక మొత్తంలో నిధులను విద్యా, వైద్య సేవల కోసం ఖర్చు చేస్తోందని తెలిపారు. అవసరమైన చోట సహాయం అందించడం ద్వారా సమాజానికి తోడ్పడటం తమ బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు. గెడ్డం సాయిబాబా మాట్లాడుతూ, ఆపదలో ఉన్న వారు మానవతను ఆశ్రయిస్తే తగిన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. సంస్థ ఫౌండర్ రామచంద్రారెడ్డి ఆశయాల మేరకు మానవులకు సేవ చేయడమే తమ లక్ష్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో వెలుగుబంటి శ్రీనివాస్, సనపల రాజశేఖర్, అప్పన వీరహనుమంతురావు, గెడ్డం సాయిబాబా, దుగ్గిరాల సూర్యనారాయణ, సాయన సుబ్బారావు, కొప్పాక వెంకటేశ్వరరావు, అయినాల మునేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సేవాస్ఫూర్తితో ముందుకు సాగుతున్న మానవత సంస్థ కార్యకలాపాలు స్థానికుల ప్రశంసలను అందుకుంటున్నాయి.

అన్నమయ్య

ప్రభుత్వ పాఠశాలలకు సి.హెచ్.ఎస్ సేవలు అభినందనీయం – ఎంఈఓ ఖాజా మొహిదీన్

చిట్వేల్: గ్రామీణ ప్రాంతాలలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చల్లటి త్రాగునీటి వసతి కల్పించేందుకు ముందడుగు వేసిన చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ (సి.హెచ్.ఎస్) స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులను చిట్వేల్ మండల విద్యాశాఖ అధికారి ఖాజా మొహిదీన్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిట్వేల్‌లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తున్నానని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధి లక్ష్యంగా స్థానిక యువత కలిసి సి.హెచ్.ఎస్ సంస్థను స్థాపించి చేపడుతున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పాఠశాలల్లో చల్లటి మంచినీటి యంత్రాల ఏర్పాటు, పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు, విశేష దినాల్లో విద్యా సామగ్రి పంపిణీ, క్రీడా మైదానాల పునరుద్ధరణ, స్పోర్ట్స్ కిట్‌ల పంపిణీ, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు చదువు మరియు క్రీడల పరంగా ఆర్థిక సహాయం, మారుమూల గ్రామాల్లో నూతన పాఠశాల భవనాల నిర్మాణానికి సహకారం వంటి సేవలు అభినందనీయమని తెలిపారు. ఇలాంటి సేవా సంస్థలు సమాజానికి ఆదర్శమని, సంస్థ సభ్యులు మరియు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధి మా లక్ష్యం – గాడి ఇంతియాజ్ అహ్మద్, కార్యదర్శి ఈ సందర్భంగా సి.హెచ్.ఎస్ సేవా సంస్థ కార్యదర్శి గాడి ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ, వేసవికాలంలో ముఖ్యంగా పరీక్షల సమయంలో విద్యార్థులకు చల్లటి త్రాగునీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధి తమ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు.ఒక్కో పాఠశాలకు లక్ష రూపాయల చొప్పున వెచ్చించి ఇప్పటివరకు వెంకటరాజుపల్లి, నగిరిపాడు, మార్గోపల్లి, తిమ్మాయపాలెం, కెఎస్ అగ్రహారం తదితర గ్రామాల పాఠశాలల్లో మంచినీటి యంత్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇతర ప్రాంతాల వారు కూడా సి.హెచ్.ఎస్ సభ్యత్వం తీసుకుని ముందుకు వస్తే, ఇన్సూరెన్స్ సౌకర్యంతో పాటు స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో చల్లటి త్రాగునీటి యంత్రాల ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. సంస్థ తరఫున 80 శాతం ఆర్థిక సహాయం అందిస్తామని, మిగిలిన 20 శాతం స్థానికులు భరించాలని సూచించారు. ఈ అవకాశాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఖాజా మొహిదీన్, ఉపాధ్యాయులు ఏబీఎన్ ప్రసాద్, సి ఆర్ పి చంద్ర, సి.హెచ్.ఎస్ ప్రతినిధులు గాల శివారెడ్డి, గాడి ఇంతియాజ్ అహ్మద్, అహ్మద్, ఎంవి నరసారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల

గూడెం శివారులో సైకిల్ పై వస్తున్న వ్యక్తిని అక్కర కొట్టిన ట్రాలీ ఆటో.

ముస్తాబాద్ ఫిబ్రవరి 25 పున్నమి ప్రతినిధి ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో 22 తేదీన మధ్య రాత్రి సైకిల్ పై వస్తున్న వ్యక్తిని ట్రాలీ ఆటో టక్కరి కొట్టగా ఆ వ్యక్తికి తీవ్ర గాయాలుతో .సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మరణించినాడు. టక్కరిచ్చిన ట్రాలీ ఆటో ముందు అద్దం కు నరేష్ అనే పేరు కలదు. ఇట్టి ఆటోలు ఎవరైనా గుర్తించినట్లయితే ఈ కింది నెంబర్కు సమాచారం అందించగలరని మనవి. 8712656371. ముస్తాబాద్ పోలీస్.

అనకాపల్లి

ములకలపల్లిలో అభివృద్ధి శంఖారావం – ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆదేశాలతో సీసీ రోడ్లకు శ్రీకారం..!

అనకాపల్లి జిల్లా, ఫిబ్రవరి 23 (పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్): ఎలమంచిలి రూరల్ మండలంలోని ములకలపల్లి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామాభివృద్ధి దిశగా కీలకమైన ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ ఎలమంచిలి మండల రూరల్ అధ్యక్షుడు అన్నం బాబ్జీ చేతుల మీదుగా ప్రారంభించారు. గ్రామ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ సీసీ రోడ్ల పనులు చేపట్టినట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, పార్టీ కార్యకర్తలు మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, “ములకలపల్లి గ్రామ అభివృద్ధి మా ప్రాధాన్యత. ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గారి మార్గదర్శకత్వంలో ఎలమంచిలి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగుతున్నాయి” అని పేర్కొన్నారు. మిగతా గ్రామాల్లో కూడా త్వరలోనే సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. గ్రామ ప్రజలు ఈ కార్యక్రమాన్ని హర్షాతిరేకంతో స్వాగతించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.