Tuesday, 28 April 2026

Blog

అన్నమయ్య

ప్రభుత్వ పాఠశాలలకు సి.హెచ్.ఎస్ సేవలు అభినందనీయం – ఎంఈఓ ఖాజా మొహిదీన్

చిట్వేల్: గ్రామీణ ప్రాంతాలలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చల్లటి త్రాగునీటి వసతి కల్పించేందుకు ముందడుగు వేసిన చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ (సి.హెచ్.ఎస్) స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులను చిట్వేల్ మండల విద్యాశాఖ అధికారి ఖాజా మొహిదీన్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిట్వేల్‌లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తున్నానని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధి లక్ష్యంగా స్థానిక యువత కలిసి సి.హెచ్.ఎస్ సంస్థను స్థాపించి చేపడుతున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పాఠశాలల్లో చల్లటి మంచినీటి యంత్రాల ఏర్పాటు, పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు, విశేష దినాల్లో విద్యా సామగ్రి పంపిణీ, క్రీడా మైదానాల పునరుద్ధరణ, స్పోర్ట్స్ కిట్‌ల పంపిణీ, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు చదువు మరియు క్రీడల పరంగా ఆర్థిక సహాయం, మారుమూల గ్రామాల్లో నూతన పాఠశాల భవనాల నిర్మాణానికి సహకారం వంటి సేవలు అభినందనీయమని తెలిపారు. ఇలాంటి సేవా సంస్థలు సమాజానికి ఆదర్శమని, సంస్థ సభ్యులు మరియు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధి మా లక్ష్యం – గాడి ఇంతియాజ్ అహ్మద్, కార్యదర్శి ఈ సందర్భంగా సి.హెచ్.ఎస్ సేవా సంస్థ కార్యదర్శి గాడి ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ, వేసవికాలంలో ముఖ్యంగా పరీక్షల సమయంలో విద్యార్థులకు చల్లటి త్రాగునీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధి తమ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు.ఒక్కో పాఠశాలకు లక్ష రూపాయల చొప్పున వెచ్చించి ఇప్పటివరకు వెంకటరాజుపల్లి, నగిరిపాడు, మార్గోపల్లి, తిమ్మాయపాలెం, కెఎస్ అగ్రహారం తదితర గ్రామాల పాఠశాలల్లో మంచినీటి యంత్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇతర ప్రాంతాల వారు కూడా సి.హెచ్.ఎస్ సభ్యత్వం తీసుకుని ముందుకు వస్తే, ఇన్సూరెన్స్ సౌకర్యంతో పాటు స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో చల్లటి త్రాగునీటి యంత్రాల ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. సంస్థ తరఫున 80 శాతం ఆర్థిక సహాయం అందిస్తామని, మిగిలిన 20 శాతం స్థానికులు భరించాలని సూచించారు. ఈ అవకాశాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఖాజా మొహిదీన్, ఉపాధ్యాయులు ఏబీఎన్ ప్రసాద్, సి ఆర్ పి చంద్ర, సి.హెచ్.ఎస్ ప్రతినిధులు గాల శివారెడ్డి, గాడి ఇంతియాజ్ అహ్మద్, అహ్మద్, ఎంవి నరసారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల

గూడెం శివారులో సైకిల్ పై వస్తున్న వ్యక్తిని అక్కర కొట్టిన ట్రాలీ ఆటో.

ముస్తాబాద్ ఫిబ్రవరి 25 పున్నమి ప్రతినిధి ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో 22 తేదీన మధ్య రాత్రి సైకిల్ పై వస్తున్న వ్యక్తిని ట్రాలీ ఆటో టక్కరి కొట్టగా ఆ వ్యక్తికి తీవ్ర గాయాలుతో .సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మరణించినాడు. టక్కరిచ్చిన ట్రాలీ ఆటో ముందు అద్దం కు నరేష్ అనే పేరు కలదు. ఇట్టి ఆటోలు ఎవరైనా గుర్తించినట్లయితే ఈ కింది నెంబర్కు సమాచారం అందించగలరని మనవి. 8712656371. ముస్తాబాద్ పోలీస్.

అనకాపల్లి

ములకలపల్లిలో అభివృద్ధి శంఖారావం – ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆదేశాలతో సీసీ రోడ్లకు శ్రీకారం..!

అనకాపల్లి జిల్లా, ఫిబ్రవరి 23 (పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్): ఎలమంచిలి రూరల్ మండలంలోని ములకలపల్లి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామాభివృద్ధి దిశగా కీలకమైన ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ ఎలమంచిలి మండల రూరల్ అధ్యక్షుడు అన్నం బాబ్జీ చేతుల మీదుగా ప్రారంభించారు. గ్రామ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ సీసీ రోడ్ల పనులు చేపట్టినట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, పార్టీ కార్యకర్తలు మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, “ములకలపల్లి గ్రామ అభివృద్ధి మా ప్రాధాన్యత. ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గారి మార్గదర్శకత్వంలో ఎలమంచిలి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగుతున్నాయి” అని పేర్కొన్నారు. మిగతా గ్రామాల్లో కూడా త్వరలోనే సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. గ్రామ ప్రజలు ఈ కార్యక్రమాన్ని హర్షాతిరేకంతో స్వాగతించారు.

రాజన్న సిరిసిల్ల

ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ వద్ద అతివేగంగా ఆటోను ఢీకొట్టిన కారు.

ఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 25 పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నుండి గొల్లపల్లికి వస్తున్న దారిలో హరిదాస్ నగర్ వద్ద అతివేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టగా అందులో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి ఆటోను ఢీ కొట్టి తప్పించుకుని వెళ్తున్న కారు ను అడ్డుకున్న గ్రామస్తులు ఆటోలోని వ్యక్తి సిరిసిల్ల నుండి గొల్లపల్లికి వస్తుండగా కామారెడ్డి నుండి సిరిసిల్ల వైపు వెళ్తున్న కారు హరిదాస్ నగర్ వద్ద అధివేగంతో వచ్చి ఆటోను ఢీకొట్టడంతో ఆటో బోల్తా పడి ఆటోలో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలు ఇవ్వడంతో సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు.

విశాఖపట్నం

జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్… కలకలం

విశాఖపట్నం ఫిబ్రవరి ( పున్నమి ప్రతినిధి) నగరంలోని విశాఖపట్నం జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో మంగళవారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోర్టు ఆవరణలో ఆర్డీఎక్స్ బాంబు అమర్చినట్లు అజ్ఞాత వ్యక్తి ఈ–మెయిల్ ద్వారా హెచ్చరించడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీస్ కమిషనర్ కార్యాలయానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు కోర్టు ప్రాంగణానికి చేరుకుని భద్రతా చర్యలు చేపట్టాయి. విచారణల నిమిత్తం వచ్చిన న్యాయవాదులు, పిటిషనర్లు, సిబ్బందిని బయటకు పంపించి కోర్టు ఆవరణాన్ని పూర్తిగా తనిఖీ చేశారు. దాదాపు రెండు గంటలపాటు సాగిన సోదాల్లో ఎటువంటి పేలుడు పదార్థాలు కనుగొనబడలేదు. బెదిరింపు మెయిల్ తప్పుడు సమాచారం కావచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఖమ్మం

రేపు కేటీఆర్ ఖమ్మం పర్యటన

ఖమ్మం, ఫిబ్రవరి (పున్నమి జిల్లా ఇంచార్జి ) భారత రాష్ట్ర సమితి కార్యనిర్వహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గురువారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. వెలగుమట్ల భూదాన్ నిర్వాసితులకు మద్దతుగా ఆయన అక్కడికి వెళ్లి బాధితులను పరామర్శించనున్నారు. ఇటీవల అధికార కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యల నేపథ్యంలో 22 రోజుల పాటు జైలు జీవితం గడిపి విడుదలైన బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజును కూడా కేటీఆర్ ఈ పర్యటనలో పరామర్శించనున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశముంది. కేటీఆర్ ఖమ్మం పర్యటనను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, శాసన మండలి సభ్యుడు తాత మధు, నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని పర్యటనను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

ఖమ్మం

నేడు కేటీఆర్ ఖమ్మం పర్యటన

ఖమ్మం, ఫిబ్రవరి (పున్నమి జిల్లా ఇంచార్జి ) భారత రాష్ట్ర సమితి కార్యనిర్వహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గురువారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. వెలగుమట్ల భూదాన్ నిర్వాసితులకు మద్దతుగా ఆయన అక్కడికి వెళ్లి బాధితులను పరామర్శించనున్నారు. ఇటీవల అధికార కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యల నేపథ్యంలో 22 రోజుల పాటు జైలు జీవితం గడిపి విడుదలైన బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజును కూడా కేటీఆర్ ఈ పర్యటనలో పరామర్శించనున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశముంది. కేటీఆర్ ఖమ్మం పర్యటనను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, శాసన మండలి సభ్యుడు తాత మధు, నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని పర్యటనను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

విశాఖపట్నం

బేబీ మౌనిక ఆత్మశాంతికి గాజువాకలో కొవ్వొత్తుల నిరసన

విశాఖ గాజువాక (ఫిబ్రవరి పున్నమి ప్రతినిధి) నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో మల్లన్న జాతర సందర్భంగా చోటుచేసుకున్న దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది.కులవివక్ష నేపథ్యంలో నిరుపేద రజక కుటుంబంపై జరిగిన దాడిలో రెండు నెలల పసిపాప మృతి చెందడం మానవత్వానికే మచ్చగా నిలిచింది.కుమ్మెర గ్రామానికి చెందిన గణేశ్,ఆయన భార్య మౌనిక తమ రెండు నెలల పసిపాపతో కలిసి జాతరకు హాజరయ్యారు.ఈ సందర్భంగా జరిగిన వాగ్వాదం కులవివక్ష రూపం దాల్చి,కొంతమంది వ్యక్తులు కుటుంబంపై దాడికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు.ఈ దాడిలో పసిపాప తీవ్రంగా గాయపడగా,ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయింది.ఈ ఘటనపై గాజువాక బీసీ సంఘం అధ్యక్షులు జాగరపు శ్రీను తీవ్రంగా స్పందిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని,పసిబిడ్డ మరణానికి కారణమైన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.బీసీ సమాజంపై జరుగుతున్న దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయని,ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు చేపట్టాలని కోరారు.బేబీ మౌనిక ఆత్మశాంతి కోసం గాజువాక గాంధీ సెంటర్‌లో జాగరపు శ్రీను ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అండిబోయిన అప్పారావు,తోకాడ రాము,బచ్చ త్రిమూర్తులు,జాగరపు హరిత,పూర్ణిమ,సుదమల్ల ఈశ్వరరావు,నవీన్,రాజు తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు.78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇలాంటి కులహంకారపు దుశ్చర్యలు జరగడం దురదృష్టకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

అన్నమయ్య

కడపలో ఘనంగా రిషితా రెడ్డి–శశి భూషణ్ రెడ్డి వివాహం

ఈరోజు ఉదయం డిఎస్ఆర్ ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో మంగంపేటకు చెందిన వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు గుత్తి రెడ్డి హరినాథ్ రెడ్డి గారి అన్న కుమార్తె రిషితా రెడ్డి – శశి భూషణ్ రెడ్డి వివాహం ఘనంగా జరిగింది.వివాహ వేడుకకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కోడూరు నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

బీసీల అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ చేపడతాం: రాధాకృష్ణ గౌడ్

బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ తిరుపతి జిల్లాలో నిర్వహిస్తున్న పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్-2026 కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా రేణిగుంటలో ఘన సత్కారం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ముక్కు రాధాకృష్ణ గౌడ్ మాట్లాడుతూ బీసీ కులాల స్థితిగతులపై సమగ్ర సర్వే చేపట్టి సేవా, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని తెలిపారు. యువత, మహిళలకు ప్రాధాన్యతతో కొత్త కమిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.