Saturday, 25 April 2026

Blog

జాతీయ అంతర్జాతీయ

భారీగా పెరిగిన యూఎస్ మార్కెట్లు

అమెరికా-ఇరాన్ చర్చలు సజావుగా సాగుతున్నాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్న నేపథ్యంలో అమెరికా మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. కొన్ని లేటర్ వ్యాపారం, ఉ. 7:10 గంటలకు (ET), S&P 500 సూచీ 240 పాయింట్లు పెరిగి, మార్కెట్ విలువలో 2 ట్రిలియన్ డాలర్లు చేరింది. కొద్దిసేపటికే, ఇరాన్ చర్చలను ఖండించడంతో మార్కెట్ తిరోగమించింది. ఫలితంగా ఉ. 8:00కు (ET) S&P 500 సూచీ 120 పాయింట్లు పడిపోయింది.

జాతీయ అంతర్జాతీయ

ఇరాన్‌తో 15 అణుశాలపై చర్చ, అందులో మొదటిది ఇరాన్ వద్ద అణుఆయుధాలు ఉండొద్దు: ట్రంప్

అమెరికా, ఇరాన్‌తో 15 అంశాలపై అంగీకరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం తెలిపారు. ఇరాన్ వద్ద ఎలాంటి అణుఆయుధాలు ఉండకూడదనే ఈ అంశంలో మొదటిది పేర్కొన్నారు. కొనసాగుతున్న మధ్యప్రాచ్య యుద్ధం నేపథ్యంలో, చర్చల కోసం ఇరాన్ తనను సంప్రదించిందని, ఒప్పందాన్ని కోరుకుంటోందని ట్రంప్ చెప్పారు. కాగా చర్చల కోసం తమ అమెరికాను సంప్రదించామని విషయాన్ని ఇరాన్ ఖండించింది.

Featured

బ్లూటూత్ ఇయర్‌ఫోన్లను ఉపయోగించడం వల్ల మెదడులో కణితులు వస్తాయా?

బ్లూటూత్ ఇయర్‌ఫోన్లను ఉపయోగించడం వల్ల మెదడులో కణితులు వస్తాయనే వాదనలో నిజం లేదని అమెరికాకు చెందిన న్యూరోసర్జన్ డాక్టర్ రూపా జాతాని తెలిపారు. “బ్లూటూత్ ఇయర్‌ఫోన్లు మెదడు లేదా ఇతర కణితుల ప్రమాణాన్ని పెంచుతాయన్నదానికి ఎలాంటి ఆధారాలు లేవు. బ్లూటూత్ పరికరాలు DNAను దెబ్బతీయని రేడియేషన్‌ను విడుదల చేస్తాయి,” అని న్యూరోసర్జన్ డాక్టర్ రూపా జాతాని వెల్లడించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నారాయణరావు కుటుంబంతో నారా భువనేశ్వరి

లోకేష్ గెలుపు మొక్కు పై ధన్యవాదాలు నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలవాలని హృదయపూర్వకంగా కోరుకుని, ఆయన గెలిస్తే మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో స్వామివారికి శాశ్వత రథం సమర్పిస్తానని సినీ నిర్మాత, తెలుగుదేశం వీరాభిమాని కావలి వాసి అట్లూరి నారాయణరావు మనసారా సంకల్పించి, ఆమేరకు. ఎంతో ఆనందం, భక్తి భావంతో ఈ ఏడాది జనవరి 24వ తేదీన నే స్వామివారికి కోటిరూపాయలకు పైగా విలువైన శాశ్వత రథాన్ని తయారు చేయించిన నారాయణరావు రావు కుటుంబం ను నారా భువనేశ్వరి ఆత్మీయ విందు ఇచ్చారు. ఈ పుణ్య కార్యక్రమానికి నారా భువనేశ్వరి ని మరియు నారా రోహిత్ ని ఆహ్వానించగా, అయితే ఆ రోజున భువనేశ్వరి కి అవకాశం లేకపోవడంతో, నారా రోహిత్ చేతుల మీదుగా స్వామికి నారాయణరావు రథం సమర్పించారు. ఈసందర్భాన్ని పురస్కరించుకుని ఎంతో ప్రేమతో భువనేశ్వరి నారాయణరావు కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానించి, అభినందించారు .తన కుటుంబంతో ఆమె చూపిన ఆప్యాయత, గడిపిన ఆ సంతోష క్షణాలు తమ జీవితంలో చిరస్మరణీయంగా మిగిలిపోతాయని. ఆ సందర్భంలో వారు తనకు తెలియజేసిన కృతజ్ఞత మనసులో శాశ్వతంగా నిలిచి పోతుందని ఈ ప్రేమ, ఆత్మీయత, గౌరవానికి తాను ఎల్లప్పుడూ భువనమ్మ కి రుణపడి ఉంటానని నారాయణరావు తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సాధనే ధ్యేయం

“* వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తో సమావేశమై రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి చర్చించిన పలు జిల్లాల పార్టీ అధ్యక్షులు, కాకాణి గోవర్ధన్ రెడ్డి అనంత వెంకట్రామిరెడ్డి , కాటసాని రాంభూపాల్ రెడ్డి గమ భూమన కరుణాకర్ రెడ్డి , అమర్నాథ్ రెడ్డి , రవీంద్రనాథ్ రెడ్డి , ఉష శ్రీ చరణ్ తోపాటు శైలజనాథ్ సతీష్ కుమార్ రెడ్డి , లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి , పుట్టా శివ శంకర్ పలువురు రైతు సంఘాల నాయకులు, తదితరులు రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధనే ధ్యేయంగా ఉద్యమించాలని నిర్ణయించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం దాదాపు పూర్తికా వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు మోకాలు అడ్డడం అన్యాయం అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు విని చంద్రబాబు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి తీరని ద్రోహం తలపెట్టారని ఆరోపించారు. కర్ణాటక రాష్ట్రం ఒక పక్క ఆల్మట్టి ఎత్తు పెంచుతూ నిర్ణయం తీసుకుని ముందుకు వెళుతున్న నేపథ్యంలో ఆంధ్రా ప్రాంతానికి తీవ్రమైన సాగునీటి కొరత రాబోతుందని తెలంగాణ రాష్ట్రం శ్రీశైలం జలాశయం నుండి 800 అడుగుల దిగువ భాగం నుండే రోజుకు 8 టీఎంసీల నీరు తరలించుకుపోతుందని విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే శ్రీశైలం జలాశయాన్ని నిబంధనలు అతిక్రమించి వినియోగించుకునే విధంగా గతంలో తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు నిర్మించగా చంద్రబాబు తిరిగి 2024 లో ముఖ్యమంత్రి కాగానే రేవంత్ రెడ్డి మాటలు విని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అట్టెకెక్కించేశారని ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం యొక్క ప్రాధాన్యతను రైతులకు, ప్రజలకు వివరించి, ప్రభుత్వంపై పోరాటం చేసే క్రమంలో జిల్లాస్థాయి, నియోజకవర్గస్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకుని, రైతాంగానికి సాగునీటి కోసం, ప్రజానీకానికి త్రాగు నీటి కోసం, ఉత్పన్నం కానున్న కష్ట,నష్టాల గురించి వివరించాలని నిర్ణయించారు. రాయలసీమ లిఫ్ట్ సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు, కలిసి వచ్చే అన్ని పార్టీలు, స్వచ్ఛంద సేవ సంస్థలు, పౌరహక్కుల నేతలు, రైతు సంఘం నాయకులు, అందరితో కలిసి ఉద్యమిస్తూ రాయలసీమ ఎత్తిపోతల సాధనే ధ్యేయంగా వినూత్న కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి, తిరిగి ప్రారంభించే వరకు పోరాడుదాం అని పిలుపునిచ్చారు. చంద్రబాబు మెడలు వంచైనా, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సాధించి ,రాయలసీమ ప్రాంతం తో పాటు, నెల్లూరు, దక్షిణ ప్రకాశం ప్రాంతాలకు సాగునీరు, త్రాగునీరు, అందించేందుకు సన్నద్ధం కావాలని నిర్ణయించారు. జగన్మోహన్ రెడ్డి రోజుకు రెండు టీఎంసీల చొప్పున రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు లిఫ్ట్ ద్వారా నీరందించాలనే లక్ష్యంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి శ్రీకారం చుట్టగా అది పూర్తవుతున్న పరిస్థితుల్లో జగన్ కు మంచి పేరు వస్తుందని, రైతుల ప్రయోజనాలు విస్మరించి, చంద్రబాబు, రేవంత్ రెడ్డి మాటలు విని అర్ధాంతరంగా ఆపివేయడం దుర్మార్గంగా సమావేశం లో నిర్ణయించారని కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. –

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

“తడ “నుంచి “గుంటూరు “వరకు రాజుకున్న తీరం ..

తమిళనాడు బోట్ల వివాదం ఇంతై అంతై తడ నుంచి గుంటూరు జిల్లా రామాపురం పల్లిపాలెం వరకు పాకింది. తమిళ బోట్లు తరలింపు సమస్య దాదాపు 143 గ్రామాలకు కీలకమైంది. ఈ విషయంలో ఈ గ్రామాలన్నిటికీ పెద్దకాపుగా ఉన్న వ్యక్తే కీలకం కావడం మత్స్యకారులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది . తమ జీవనోపాధికి సంబంధించిన ఎన్నో సంవత్సరాల సమస్య పై తాము నమ్ముకున్న పెద్దకాపే తమను పక్కదారి పట్టించడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. సహజంగా మత్స్యకారులు ఎంతగా ప్రేమిస్తారో…. దారితప్పితే అంతగా ద్వేషిస్తారు.. అన్నది వారి జీవనశైలి. ప్రస్తుతానికి ఈ సమస్య పరిష్కరించే దిశలో రాజకీయ నాయకులను ,అధికారులను దూరం పెట్టేసిన మత్స్యకారులు ఏప్రిల్ మూడవ తేదీ 143 గ్రామాల కాపులతో కీలక సమావేశం నిర్ణయించారు. సమావేశం అజెండా లక్ష్యాలంటూ ప్రత్యేకంగా ఏమీ లేకపోయినా తమిళ బోట్ల విడుదల సమస్య ఏకైక అజెండాగా మారే అవకాశం ఉన్నట్లు సమాచారం. బోట్ల తరలింపు పై ఆందోళన చెందిన ఇసుక పల్లి పల్లి పాలెం వాసులు తమను మిగిలిన 142 గ్రామాల కాపులు బహిష్కరిస్తారని భయపడి ముందస్తుగా ముగ్గురు కాపులను నిర్బంధించి గ్రామానికి సమస్య లేకుండా జాగ్రత్త పడ్డారని తెలుస్తోంది. బాధ్యులైన కాపులను బంధించకపోతే తమ ఆచారం ప్రకారం బహిష్కరణ గురైతే గ్రామ వాసులందరికీ ఇబ్బందువుతోందని కట్టుబాటుకు చర్యలు చేపట్టినట్టు సమాచారం . గ్రామస్తులు ముందస్తుగా కాపులను ఇలా కట్టి వేయడంతో 142 గ్రామాల వారు కొంత సంతృప్తికి గురవుతున్నట్లుగా తెలుస్తోంది .ఇక బోట్ల విడుదలకు ఎవరు ఎలా అనే విషయం మూడో తేదీలోపు స్పష్టతకు వచ్చిన తర్వాత 143 గ్రామాలకు సంబంధించి కాపు లు తీసుకునే నిర్ణయం కఠినంగానే ఉండవచ్చు అని తెలుస్తోంది. గతంలో ఒక సంఘటనలో ఇప్పటి టీటీడీ చైర్మన్ అప్పటి జిల్లా కలెక్టర్ గా ఉన్న మద్దాడ రవిచంద్ర కు తమ సమస్య పరిష్కారం తెలుపాలని లక్ష్యంతో మత్స్యకారులు కలెక్టర్ బంగళా చుట్టూ పడవలు పెట్టి కొన్ని గంటల పాటు చేసిన ధర్నా కార్యక్రమం నాడు రాష్ట్రంలో సంచలనం గా మారింది. అదేవిధంగా 2004లో చెన్నాయి పాలెం పెదపట్టపాలెం సంఘటన రాష్ట్రవ్యాప్తంగా అధికారులకు పాలకులకు తీవ్ర తలనొప్పిగా మారిన నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు, పోలీసు ఉన్నతాధికారులు పదిమంది కి పైగా ఆ గ్రామంలో గంటలసేపు బైఠాయించాల్సిన పరిస్థితి నెలకొంది .అయినా ఆ సంఘటనలో పట్టిన పట్టు వారు వీడలేదు. అధికారాలతో రాజకీయాలతో వ్యవహారాన్ని ముడి పెట్టాల్సిన అవసరం లేదని ఇది తమ జీవనోపాధికి సంబంధించిందని కాపులు చేసిన సూచనలతో తీరంలోని 143 గ్రామాల మత్స్యకార ప్రజలు ఏకీభవించడంతో ఈ సమస్య ఎటు వెళ్లుతుందనేది అర్థం కాని విషయమే. మత్స్యకారుల మనోభావాలపై నేటి యువ అధికారులకు సరైన అవగాహన లేని నేపథ్యంలో ప్రభుత్వం సమస్య పరిష్కారానికి చాలా కసరత్తులు చేయాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది .ఎక్కడైనా ఏదైనా తొందరపాటు చర్య జరిగితే అది గతంలో అల్లూరు బోగోలు తీరంలో జరిగిన సంఘటనలు పురావృత్తం అయ్యే ప్రమాదం కూడా ఉంటుందనేది సమాచారం. ఈ సమస్యకు ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణ అంశం కూడా తోడు కావడం, మరోవైపు చెన్నాయి పాలెం పెదపట్టపాలెం భూముల సమస్య కూడా రోడ్డుకి ఎక్కడంతో జిల్లా అధికారులకు మాత్రం ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి యమ్.పి.పి కి నూతన భవనం

ఉదయగిరి పట్టణంలో మండల ప్రజా పరిషత్ నూతన కార్యాలయ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ , జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ పాల్గొని నూతన భవనాన్ని ప్రారంభించారు. ఆధునిక సౌకర్యాలు, పరిపాలనా అవసరాలకు అనుగుణంగా నిర్మించబడిన ఈ కార్యాలయం మండల అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేస్తుందని వారు పేర్కొన్నారు. ఈ నూతన భవనం మొత్తం రూ.83.68 లక్షల వ్యయంతో ఇందులో జిల్లా పరిషత్ గ్రాంట్ నుంచి రూ.36.20 లక్షలు, అలాగే మండల పరిషత్ 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా మిగతా నిధులను వినియోగించి, ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకుని, కార్యనిర్వహణలో సౌలభ్యం కల్పించేలా, అధునాతన హంగులతో నిర్మించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, మండల అభివృద్ధికి కేంద్రబిందువుగా నిలిచే మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఇలాంటి ఆధునిక భవనంలో కార్యకలాపాలు నిర్వహించడం ఎంతో శుభపరిణామమని అన్నారు. పరిపాలనా వ్యవస్థ బలోపేతానికి, ప్రజలకు సేవలు మరింత వేగవంతంగా అందించడానికి ఇలాంటి మౌలిక వసతులు ఎంతో అవసరమని పేర్కొన్నారు. కార్యాలయాలు బాగుంటేనే పరిపాలన కూడా అంతే పారదర్శకంగా, సమర్థవంతంగా ఉంటుంది” అని ఎమ్మెల్యే గారు స్పష్టం చేశారు. ప్రజాసేవకు అంకితభావంతో పనిచేసే అధికారులు, సిబ్బంది కార్యాలయాన్ని పరిశుభ్రంగా, క్రమబద్ధంగా ఉంచుకోవడం తమ బాధ్యతగా భావించాలని సూచించారు. ప్రభుత్వంపై ప్రజలకు మరింత విశ్వాసం పెరిగేలా ప్రతి ఉద్యోగి సేవాభావంతో, వృత్తి ధర్మాన్ని నిబద్ధతతో నిర్వర్తించాలని ఆయన పిలుపునిచ్చారు.

తిరుపతి

దక్షిణ కాశీలో వైభవంగా మృత్యుంజయ అభిషేకం-భక్తులతో మురిసిన శ్రీకాళహస్తి క్షేత్రం

శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో సోమవారం నాడు శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో వెలసిన శ్రీ మృత్యుంజయ స్వామి వారికి విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్తీక మాసం తరహాలోనే సోమవారానికి ఉన్న విశిష్టతను పురస్కరించుకుని ఆలయ వేద పండితులు ఈ క్రతువును భక్తిశ్రద్ధలతో జరిపించారు. ఉదయాన్నే ప్రారంభమైన ఈ వేడుకలో స్వామివారిని విభూది, కుంకుమ, గంధము, నారికేళ జలము, స్వచ్ఛమైన తేనె, పంచామృతాలతో అభిషేకించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ అభిషేక సేవను భక్తులు తన్మయత్వంతో వీక్షించారు. అనంతరం స్వామివారిని వివిధ రకాల సుగంధ పుష్పాలతో నయనానందకరంగా అలంకరించారు. అలంకారానంతరం మృత్యుంజయ స్వామి వారు అత్యంత తేజోవంతంగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ పవిత్ర వేడుకలో ఆలయ అధికారులు, స్థానిక భక్తులతో పాటు సుదూర ప్రాంతాల నుండి వచ్చిన యాత్రికులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. సోమవారం కావడంతో ఆలయ ఆవరణమంతా శివనామ స్మరణతో మారుమోగింది.

తిరుపతి

శ్రీకాళహస్తిలో గుప్త నిధుల కలకలం-రామాపురం చెరువు వద్ద అర్ధరాత్రి తవ్వకాలు..ఇద్దరు అరెస్ట్

శ్రీకాళహస్తిమండలంలోని రామాపురం చెరువు సమీపంలో గుప్త నిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన తవ్వకాలు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి. నిధుల వేటలో భాగంగా దుండగులు క్షుద్ర పూజలు నిర్వహించి, భారీ గోతులను తవ్వడం సంచలనంగా మారింది. ఘటనా వివరాల్లోకి వెళ్తే సోమవారం తెల్లవారుజామున రామాపురం చెరువు కట్ట సమీపంలో కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తూ తవ్వకాలు జరుపుతున్నట్లు స్థానికులు గమనించారు. అక్కడ పెద్ద గుంతను తవ్వి ఉండటమే కాకుండా, పక్కనే ఉన్న రాళ్లకు పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో భయాందోళనకు గురైన గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే శ్రీకాళహస్తి రూరల్ సీఐ ఇబ్రహీం తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ తవ్వకాలను పరిశీలించి, వివరాలు సేకరించారు. పోలీసులు రాకను గమనించిన కొందరు పరారవ్వగా, అనుమానిత ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో నిందితులు వదిలి వెళ్లిన రెండు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసలు వీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ తవ్వకాల వెనుక ఎవరి హస్తం ఉంది? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పట్టుబడిన వారిని ప్రశ్నిస్తున్నామని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని సీఐ ఇబ్రహీం తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి మూఢనమ్మకాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

తిరుపతి

ముస్లిం సోదరుల దశాబ్దాల కల సాకారం- ఏర్పేడులో స్మశాన వాటికకు స్థల కేటాయింపు

ఏర్పేడు: ముస్లిం సోదరుల చిరకాల వాంఛను నెరవేరుస్తూ శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఉదారత చాటుకున్నారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఏర్పేడు మండల కేంద్రంలోని ముస్లిం మైనారిటీల కోసం సోమవారం ప్రత్యేకంగా స్మశాన వాటిక స్థలాన్ని కేటాయించారు. ఏర్పేడు సబ్ స్టేషన్ సమీపంలో సుమారు 10 సెంట్ల భూమిని ఈ ప్రయోజనం కోసం కేటాయించడం జరిగింది. టీడీపీ తిరుపతి పార్లమెంట్ మహిళా నాయకురాలు గాలి కృష్ణవేణి ఆధ్వర్యంలో ఈరోజు సదరు స్థలాన్ని జేసీబీలతో చదును చేయించారు. అనంతరం ఆ భూమిని ముస్లిం పెద్దలకు అధికారికంగా అప్పజెప్పారు. స్మశాన వాటిక కోసం స్థలం లేక తాము పడుతున్న ఇబ్బందులను గుర్తించి, తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి ఏర్పేడు ముస్లిం సోదరులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాతృమూర్తి బొజ్జల బృందమ్మ గారిని స్మరించుకుంటూ, తమ సమస్యను పరిష్కరించినందుకు కృతజ్ఞతలు చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లిం పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.