రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా/పున్న మి ప్రతినిధి/జనవరి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని 33వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ ఇంచార్జ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చీటి వెంకటనార్సింగరావు గారు ముఖ్య అతిథిగా హాజరై, ప్రజలను కలుసుకుని పార్టీ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ ప్రచారంలో చిప్పలపెల్లి గ్రామ మాజీ సర్పంచ్ గాడిచేర్ల దేవయ్య, 33వ వార్డు అధ్యక్షులు మహమ్మద్ పాషా, తటాకర్ల ప్రభాకర్, గూడూరు గ్రామ ఉపసర్పంచ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎదునూరి శ్రీనివాస్, కేటీఆర్ సేన ముస్తాబాద్ మండల అధ్యక్షులు వంగూరి దిలీప్, గూడూరు గ్రామ కేటీఆర్ సేన అధ్యక్షులు చెక్కపెల్లి వెంకటేష్, చిప్పలపల్లి కేటీఆర్ సేన గ్రామ అధ్యక్షులు పోతారం సతీష్, బీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రధాన కార్యదర్శి కోడూరి మనీష్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులుమాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం సిరిసిల్ల నియోజకవర్గానికి అందించిన అభివృద్ధి పనులను ప్రజలు గుర్తించి, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రజల నుంచి స్పందన లభించింది