Saturday, 25 April 2026

Blog

E-పేపర్ News తెలంగాణ మహబూబాబాద్

*🚨 బ్రేకింగ్ న్యూస్: నరసింహులపేటలో బంజారా నేతల అరెస్ట్! 🚨*

నరసింహులపేట మండలంలో ఉద్రిక్తత నెలకొంది. బంజారా జాతి హక్కుల కోసం పిలుపునిచ్చిన ‘చలో అసెంబ్లీ’ ముట్టడికి వెళ్తున్న నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. *🚔 స్థలం: నరసింహులపేట పోలీస్ స్టేషన్* *అరెస్ట్ అయిన వారు: సేవాలాల్ సేన మండల అధ్యక్షుడు రమేష్ నాయక్, LHPS మండల అధ్యక్షుడు ఉదయ్ నాయక్, వీరు నాయక్, శంకర్ నాయక్* *🔥 నాయకుల ఆగ్రహం: “కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి బంజారాల ఓట్లే కారణం. కానీ గెలిచాక హామీలు మరిచిపోయి, మమ్మల్ని అరెస్ట్ చేయడం దుర్మార్గం.” అని నేతలు మండిపడ్డారు.* *📌 ప్రధాన డిమాండ్లు* ✅ హైదరాబాద్ నగర కేంద్రంలోనే సేవలాల్ మహారాజ్ పుణ్యక్షేత్రం నిర్మించాలి.✅ ప్రతి జిల్లాలో బంజారా భవనాలు ఏర్పాటు చేయాలి.✅ బంజారాలకు తక్షణమే మంత్రి పదవి కేటాయించాలి.తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం ఆపేది లేదని బంజారా సంఘాలు హెచ్చరించాయి.

విశాఖపట్నం

ప్రహరీ నిర్మాణ పనులు పరిశీలన

కొండయ్యవలస గ్రామం నిర్వాసితుల ఆరాధ్య దేవత శ్రీ బంగారమ్మ తల్లి ఆలయ ప్రహరీ పనులను పరిశీలించిన ఆలయ కమిటీ సభ్యులు గాజువాక శాసన సభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు , జీవీఎంసీ 85వ వార్డు కార్పొరేటర్ వరలక్ష్మి ప్రసాద్ మరియు కూటమి నాయకులు చేతుల మీదుగా సుమారు 20 లక్షల రూపాయలు నిధులుతో గత నెల జనవరి 31 వతేదీన శంకుస్థాపన చేయడం జరిగింది. కొందరు వ్యక్తులు ప్రహరీ నిర్మాణం ఆపేద్దాం అని ప్రయత్నం చేసినప్పటికి ఆలయ కమిటీ పెద్దలు అందరు కలిసి గాజువాక శాసనసభ్యులు శ్రీనివాసరావు దృష్టికి సమస్య తీసుకుని వెళ్లి అధికారులు తో మాట్లాడించి ప్రహరీ పనులు ప్రారంభం అయ్యేలా చొరవ తీసుకుని దగ్గర ఉండి పనులు ప్రారంభం అవడానికి కృషి చేసారు. ప్రారంభం అయిన పనులు బుధవారం ఉదయం గ్రామ పెద్దలు ఆలయ కమిటీ సభ్యులు పరిశీలించడం జరిగింది. శ్రీ మరిడిమాంబ మరియు బంగారమ్మ ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీ బలిరెడ్డి శ్రీను అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో ఏడీసి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ, వార్డు తెలుగుయువత అధ్యక్షులు బండారు చందు రమేష్, టిడిపి సీనియర్ నాయకులు పలక అచ్యుత్, వడ్డాది శ్రీనివాసరావు, జనసేన నాయకులు విందుల నాగేంద్ర, బైలపూడి విజయ్, విందుల కళ్యాణ్ ఆలయ కమిటీ సభ్యులు బుదిరెడ్డి కన్నారావు, పట్టా రామకృష్ణ, బలిరెడ్డి శేఖర్, పిల్లా శ్రీను తదితరులు పాల్గొన్నారు.

జాతీయ అంతర్జాతీయ

ఇరాన్తో యుద్ధాన్ని కొనసాగించాలని ట్రంప్పై సౌదీ అరేబియా ఒత్తిడి

సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్, ఇరాన్పై యుద్ధాన్ని కొనసాగించాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ను కోరుతున్నారని నివేదికలు తెలిపాయి. పశ్చిమాసియా పునర్నిర్మాణానికి కొనసాగుతున్న సైనిక చర్య ఒక చరిత్రాత్మక అవకాశాన్ని కల్పిస్తోందని ఆయన వాదిస్తున్నట్లు ‘ది న్యూయార్క్ టైమ్స్’ నివేదించింది. ఇరాన్ను ఒక దీర్ఘకాలిక ముప్పుగా సల్మాన్ భావిస్తున్నారని చెప్పింది.

జాతీయ అంతర్జాతీయ

ఇండో-పసిఫిక్లో శాంతికి భారత్ అనివార్యం: అమెరికా రక్షణ అధికారి

ఇండో-పసిఫిక్లో శాంతి, స్థిరత్వానికి, అలాగే ఆసియాలో “అనుకూలమైన” బలాల సమతుల్యతను నిర్ధారించేందుకు భారత పాత్ర అనివార్యమని అమెరికా యుద్ధ విధాన అండర్ సెక్రటరీ ఎలెడ్జ్ కోల్బీ అన్నారు. “ఏ శక్తి కూడా ఈ ప్రాంతంపై ఆధిపత్యం చెలాయించలేని ఇండో-పసిఫిక్ వల్ల మన రెండు దేశాలూ ప్రయోజనం పొందుతాయి” అని ఆయన చెప్పారు. స్వేచ్ఛా వాణిజ్యం, జాతీయ స్వయంప్రతిపత్తి వల్ల ఇరు దేశాలకు ప్రయోజనమన్నారు.

జాతీయ అంతర్జాతీయ

లోక్సభలో మూజువాణి ఓటుతో ట్రాన్స్్స జెండర్ బిల్లుకు ఆమోదం

లోక్సభ మంగళవారం ట్రాన్స్ జెండర్ వ్యక్తుల(హక్కుల పరిరక్షణ) సవరణ బిల్లు, 2026ను మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఈ బిల్లు, ట్రాన్సో జెండర్లను తమను తాము లింగ గుర్తింపుగా భావించుకునే హక్కును తొలగించాలని, దీనిని కేవలం జీవ సంబంధమైన లేదా శారీరక గుర్తులు ఉన్న వ్యక్తులకు మాత్రమే పరిమితం చేయాలని ప్రతిపాదిస్తుంది. ఈ బిల్లు ట్రాన్స్ జెండర్లకు చట్టపరమైన గుర్తింపు కొనసాగేలా చూస్తుందని ప్రభుత్వం ప్రకటించింది.

జాతీయ అంతర్జాతీయ

హార్ముజ్ జలసంధి వెనుక చిక్కుకుపోయిన వందలాది నౌకలు

హోర్ముజ్ జలసంధి వెనుక వందలాది నౌకలు చిక్కుకుపోయినట్లు చూపిస్తున్న వైమానిక చిత్రాలు సోషల్ మీడియాలో బయటికి వచ్చాయి. ఒక నివేదిక ప్రకారం, మార్చి నెల ప్రారంభం నుంచి హార్ముజ్ జలసంధి గుండా కేవలం 100 నౌకలు మాత్రమే ప్రయాణించగలిగాయి. అమెరికా, దాని మిత్రదేశాలు మినహా అందరికీ హార్ముజ్ జలసంధి తెరిచి ఉంటుందని ఇరాన్ పేర్కొంది.

జాతీయ అంతర్జాతీయ

RCB జట్టును రూ.16,800 కోట్లకు కొనుగోలు

ఆదిత్య బిర్లా గ్రూప్, ది టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, బోల్ట్ వెంచర్స్, ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్టోన్ సంస్థలు సభ్యులుగా ఉన్న కన్సార్షియం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టును కొనుగోలు చేసింది. ఈ లావాదేవీ విలువ 1.78 బిలియన్ డాలర్లు(రూ.16,800 కోట్లు). అంతకుముందు అమెరికా వ్యాపారి కల్ సోమాని నేతృత్వంలోని కన్సార్షియం రాజస్థాన్ రాయల్స్ను 1.63 బిలియన్ డాలర్లకు(రూ.15,300 కోట్లు) కొనుగోలు చేసింది.

జాతీయ అంతర్జాతీయ

కొలంబియాలో కూలిన వైమానిక దళ విమానంలోని 66 మంది మృతి

కొలంబియాలోని అమెజాన్ ప్రాంతంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కొలంబియా వైమానిక దళానికి చెందిన ఒక సైనిక విమానం కూలిపోవడంతో 66 మంది మరణించారు. లాకోడ్ మార్టిన్ సి-130 హెర్క్యులస్గా గుర్తించిన ఈ విమానం, ప్యూర్టో లెగుయిజామో సమీపంలో కూలిపోయినప్పుడు సైనిక సిబ్బందితో సహా 125 మందిని తీసుకువెళుతోంది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

జాతీయ అంతర్జాతీయ

హార్ముజ్ జలసంధిని దాటేందుకు అనుమతి అవసరం లేదు

పశ్చిమాసియా యుద్ధం మధ్యలో హార్ముజ్ జలసంధిని దాటేందుకు అనుమతి అవసరమా అనే ప్రశ్నకు కేంద్ర నౌకా రవాణా శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ సిన్హా జవాబిచ్చారు. “ఇది ఒక అంతర్జాతీయ జలసంధి, గతంలో అనుమతి అవసరం లేదు, ఈ రోజు కూడా అవసరం లేదు” అని చెప్పారు. “భద్రత ఎలా ఉంటుంది, ఎలా ప్రయాణించాలి, ఏ సమయంలో ప్రయాణించాలి అనే విషయాలను మీరు ఖచ్చితంగా పరిస్థితిని అంచనా వేయాలి” అని వెల్లడించారు.

ఖమ్మం

ACB అధికారుల అదుపులో వైరా MVI

ఖమ్మం (మార్చి ) (పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం జిల్లా పరిధిలో గల వైరా మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (MVI) ప్రసాద్, తన పరిధిలో నడుస్తున్న ఫిర్యాదుదారుడి రవాణా వాహనాలపై జరిమానాలు మరియు పెనాల్టీలు విధించకుండా ఉండేందుకు గాను, తన ప్రైవేట్ అసిస్టెంట్ రాజశేఖర్ ద్వారా రూ. 24,800/- #లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా #అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు వైరాలోని ఆర్టీఓ యూనిట్ కార్యాలయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్ట్ చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.