Sunday, 3 May 2026

Blog

తిరుపతి

చిత్తూరు జిల్లా దేవళంపేటలో అంబేద్కర్ విగ్రహ దహనంపై భూమన ఆధ్వర్యంలో వైసిపి నిరసన*

*చిత్తూరు జిల్లా దేవళంపేటలో అంబేద్కర్ విగ్రహ దహనంపై భూమన ఆధ్వర్యంలో వైసిపి నిరసన* *ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండించిన తిరుపతి ఎంపీ గురుమూర్తి* చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవళంపేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహ దహన ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, అంబేద్కర్ విగ్రహ దహనం వంటి దారుణ సంఘటనను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటూ పచ్చ పత్రికల మద్దతుతో తెలుగుదేశం పార్టీ నాయకులు దళిత సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. ఫైబర్ విగ్రహాన్ని కాంస్య విగ్రహంగా ప్రచారం చేయడం దురుద్దేశపూరితమని ఆయన మండిపడ్డారు. అంబేద్కర్ విగ్రహాన్ని దహనం చేయడం దళితుల ఆత్మగౌరవంపై దాడి అని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తీవ్రంగా ఖండించారు. ఇలాంటి చర్యలు సమాజంలో అలజడులు సృష్టించే ప్రయత్నమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దళితుల గౌరవాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ ఘటనపై ఎంపీ మద్దిల గురుమూర్తి జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేయగా, కమిషన్ వేగంగా స్పందించి చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు జారీ చేసి విచారణ నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఇది దళితుల ఆత్మగౌరవ రక్షణకు సానుకూల పరిణామమని ఎంపీ పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ ఘటనను నిర్లక్ష్యంగా తీసుకోవడం దురదృష్టకరమని ఎంపీ గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహ దహనం జరిగిన మూడు రోజులు గడిచినా నిందితులను పోలీసులు గుర్తించకపోవడం ప్రజల్లో తీవ్ర అసహనం కలిగిస్తోందని పేర్కొన్నారు. దళితుల మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి ఘటనలను సహించబోమని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, గంగాధర నెల్లూరు సమన్వయకర్త కృపాలక్ష్మి, చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప, చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ

“మానసిక ఆరోగ్యం శ్రేయస్సు” వారోత్సవాలు నిర్వహిస్తున్న : లయన్స్ క్లబ్

నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి ) ప్రతి ఒక్కరు మానసిక ఆరోగ్యం పై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఈ నెల 4 – 12 (అక్టోబర్ 4-12) వరకు “మానసిక ఆరోగ్యం శ్రేయస్సు “పై లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ వారు నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలిని ఆమె ప్రారంభించారు.

ఖమ్మం

ఉప సర్పంచే.. ఆ గ్రామ సర్పంచ్.నూకలంపాడు

ఉప సర్పంచే.. ఆ గ్రామ సర్పంచ్.. ఖమ్మం జిల్లా నూకలంపాడు లో 20 ఏండ్లుగా విచిత్ర పరిస్థితి షెడ్యూల్డ్ ఏరియా కావడంతో సర్పంచ్ పదవి, ఒక్క ఎస్టీ ఓటరు కూడా లేకపోవడంతో ఉపసర్పంచ్గా ఎన్నికైన వ్యక్తికే సర్పంచ్ బాధ్యతలు పున్నమి ఖమ్మం జిల్లా బ్యూరో ఏన్కూరు: షెడ్యూల్డ్ ఏరియాగా ప్రకటించిన ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం నూకలంపాడు గ్రామ పంచాయతీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఈ గ్రామ సర్పంచ్ పదవి ఎస్టీలకు కేటాయించినప్పటికీ… ఊర్లో ఒక్క ఎస్టీ ఓటరు కూడా లేకపోవడంతో 20 ఏండ్లుగా ఉపసర్పంచ్గా గెలిచిన వ్యక్తికే సర్పంచ్ అధికారాలు అప్పగిస్తున్నారు. గత నాలుగు టర్మ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండగా.. ఈ సారి కూడా సేమ్ సీన్ రిపీట్ కానుంది

తిరుపతి

తడ మండల PACS అధ్యక్షుడిగా వేనాటి శ్రీకాంత్ రెడ్డి

తడ, అక్టోబర్, పున్నమి ప్రతినిధి. ఈరోజు ఉదయం తడకండ్రిగ లోని వేనాటి పరంధామ రెడ్డి ఆఫీస్ ఆవరణ నందు తడ PACS చైర్మన్ గా నియమితులైన వేనాటి శ్రీకాంత్ రెడ్డి మరియు మెంబర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని వారి చేత ప్రమాణం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా న్యాయం చేస్తామని విజయశ్రీ చెప్పారు, ఈ కార్యక్రమంలో తడ మండలం సూళ్లూరుపేట మండల నాయకులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

*పెను ప్రమాదం నుంచి బయటపడ్డ చిన్నారులు*

*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి* *పెను ప్రమాదం నుంచి బయటపడ్డ చిన్నారులు* *ఎప్పటికప్పుడు చిన్నారుల పరిస్థితిపై ఆరా తీస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ * *కేజిహెచ్ సూపరిండెంట్ డాక్టర్ వాణి మరియు ఇతర డాక్టర్లతో మెరుగైన వైద్యం అందించాలని తెలిపిన వంశీ గారు* జాలరి పేట పిల్లా అప్పయ్యమ్మ సంఘం వద్ద జరిగిన అన్నదాన కార్యక్రమానికి హాజరయ్యే నిమిత్తం చిన్నారులు చేరుకొన్న నేపథ్యంలో పక్కనే వంట జరుగుతున్న ప్రాంతంలో అనుకోని సంఘటన జరిగి వేడి నీళ్లు/గంజి 15 మంది పిల్లలు మరియు మహిళలు పై పడి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జరిగిన వెంటనే ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు కేజీహెచ్ సూపర్డెంట్ వాణి గారికి మరియు సిబ్బందితో మాట్లాడి మెరుగైన వైద్యం అందజేయాలని తెలిపారు.చిన్నారులకు అందుబాటులో ఉండేలా డాక్టర్స్ లో మరియు అధికారులకు తెలిపారు. ఎటువంటి ఇబ్బందులు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని స్థానిక నేతలకు తెలియజేశారు. ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో సమావేశం నిమిత్తం విజయవాడ లో ఎమ్మెల్యే గారు వున్న విషయం విధితమే. ప్రస్తుతం చిన్నారులు కేజీహెచ్ ఎమర్జెన్సీ వార్డ్ లో చికిత్స పొందుతున్నారు.

తిరుపతి

సూళ్లూరుపేట లో ఘనంగా ఆటో డ్రైవర్ల చేయూత

సూళ్లూరుపేట, అక్టోబర్, పున్నమి ప్రతినిధి. ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్ల కళ్లల్లో ఆనందం! ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకం ఈరోజు నుంచి అమలులోకి రావడం హర్షణీయం. రాష్ట్రవ్యాప్తంగా 2,90,669 మంది ఆటో డ్రైవర్ల ఖాతాల్లోకి ఒక్కొక్కరికి ₹15,000 చొప్పున మొత్తం ₹436 కోట్లు జమ అవుతున్నాయి. సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఈ పథకాన్ని ఘనంగా అమలు చేసి, ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కృషి చేస్తున్నాము. మాట ఇస్తే నెరవేర్చేదే కూటమి ప్రభుత్వం అని నెలవల విజయశ్రీ చెప్పారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పి. గన్నవరం లో పండుగలా ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం

డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. పి. గన్నవరం ఆటో డ్రైవర్లు సేవలో” కార్యక్రమం పి.గన్నవరంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం 15 వేలు ఇచ్చి ఆదుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్న మాట ప్రకారం ఈ మొత్తాన్ని అందించారని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. కార్మికుల జీవితాల్లో వెలిగు నింపాలనదే తమ ఎన్డీయే కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్నారు. అనంతరం త్రీ రోడ్ జంక్షన్ నుంచి పోలీస్టేషన్ వరకు ఆటో ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కొద్దిసేపు ఆటో నడిపి కూటమి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. పి. గన్నవరం నియోజకవర్గం నాలుగు మండలాలకు మొత్తం 1263 మంది లబ్ధిదారులకు రూ. 1,77,7500 /- లు లబ్ది చేకూరనుంది. ఈ కార్యక్రమం లో కూటమి శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పి. గన్నవరం లో పండుగ laఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం

డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. పి. గన్నవరం ఆటో డ్రైవర్లు సేవలో” కార్యక్రమం పి.గన్నవరంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం 15 వేలు ఇచ్చి ఆదుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్న మాట ప్రకారం ఈ మొత్తాన్ని అందించారని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. కార్మికుల జీవితాల్లో వెలిగు నింపాలనదే తమ ఎన్డీయే కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్నారు. అనంతరం త్రీ రోడ్ జంక్షన్ నుంచి పోలీస్టేషన్ వరకు ఆటో ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కొద్దిసేపు ఆటో నడిపి కూటమి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. పి. గన్నవరం నియోజకవర్గం నాలుగు మండలాలకు మొత్తం 1263 మంది లబ్ధిదారులకు రూ. 1,77,7500 /- లు లబ్ది చేకూరనుంది. ఈ కార్యక్రమం లో కూటమి శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

ఎన్టీఆర్ జిల్లా: కారు-టాటా ఏస్ ట్రాలీ ఢీ – ప్రయాణికులు సురక్షితం

ఎన్టీఆర్ జిల్లా: కారు-టాటా ఏస్ ట్రాలీ ఢీ – ప్రయాణికులు సురక్షితం పున్నమి ప్రతినిధి గోపీ పామర్తి తిరువూరు. ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు మండలం: తిరువూరు మండలం కాకర్ల శివారులోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక కారు మరియు టాటా ఏస్ ట్రాలీ వాహనం ఒకదానినొకటి బలంగా ఢీకొన్నాయి. ఎయిర్‌బ్యాగ్‌ల వల్ల ప్రయాణికులు సురక్షితం ఈ ప్రమాదంలో కారు బలంగా దెబ్బతిన్నప్పటికీ, కారులో ఉన్న ఎయిర్ బెలూన్స్ (ఎయిర్‌బ్యాగ్‌లు) వెంటనే తెరుచుకోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా బయటపడ్డారు. వారికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఈ ప్రమాదం కారణంగా, టాటా ఏస్ వాహనంలో లోడ్ చేసి ఉన్న ఐరన్ రాడ్లు రోడ్డుపై పడిపోయాయి. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే పనులు చేపట్టారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో ఘనంగా ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం

శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ సేవలో అనే కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కాకి చొక్కా ధరించి వారి ఇంటి దగ్గర నుండి పానగల్ వద్ద గల ఎస్ ఎల్ వి కళ్యాణ మండపం వరకు ఆటో డ్రైవర్లతో పాటుగా ర్యాలీగా వచ్చి ఆటో డ్రైవర్లకు ఈ రోజు అనగా శనివారం 15000 రూపాయలు వారి ఖాతాలలో జమ చేయనున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.అనంతరం శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో ఆటో డ్రైవర్లకు ఇవ్వనున్న 2,94,75000రూపాయల చెక్కును అందజేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.