Sunday, 22 March 2026

Blog

రంగారెడ్డి

యాచారం మండలం వికలాంగులందరికీ ఉచిత బస్ పాసులు… మండల అధ్యక్షులు డేరంగుల ఈశ్వర్

పున్నమి నవంబర్ 12 రంగారెడ్డి జిల్లా యాచారం మండల: వికలాంగులందరికీ ఉచిత బస్పాసులు అందజేయడం జరుగుతుంది తేదీ 13 నుండి 18 తారీకు వరకు మీ యొక్క గ్రామ శాఖ అధ్యక్షులకు అందజేయవలెను ఒక డిస్టిక్ పాస్ కావాలంటే ఆధార్ కార్డు జిరాక్స్ సదరం జిరాక్స్స చిన్న సదరం జిరాక్స్ ఒక ఫోటో ఒక సిటీ పాస్ కావాలంటే ఆధార్ కార్డు జిరాక్స్ సదరం జిరాక్స్ చిన్న సదరం జిరాక్స్ ఒక ఫోటో జతపరిచి మీ యొక్క గ్రామ శాఖ అధ్యక్షులకు అందజేయవలెను ఈ యొక్క సదా అవకాశం యాచారం మండల వికలాంగులు అందరూ వినియోగించుకోవాలని మీ మండల అధ్యక్షులు డేరంగుల ఈశ్వర్

E-పేపర్

నర్సరీ వ్యాపారులు నిబంధనలను పాటించి నాణ్యమైన మొక్కలు అందించాలి రైల్వేకోడూరు ఉద్యాన అధికారి భాస్కర్.

నర్సరీ వ్యాపారులు నిబంధనలను పాటించి నాణ్యమైన మొక్కలు అందించాలి రైల్వేకోడూరు ఉద్యాన అధికారి భాస్కర్. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 12 (పున్నమి న్యూస్ ప్రతినిధి- సింగమాల వెంకటేష్ ) జిల్లా ఉద్యాన అధికారిణి, సుభాషిని ఆదేశాల మేరకు రైల్వేకోడూరు మండల ఉద్యాన మరియు వ్యవసాయ అధికారులు సంయుక్తంగా బుధవారం నాడు రైల్వే కోడూరు మండలంలోని పలు బొప్పాయి నర్సిలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉద్యాన అధికారి భాస్కర్ మాట్లాడుతూ నర్సరీ వ్యాపారులందరూ కూడా నర్సరీ యాక్ట్ 2010 నిబంధనలు ప్రకారము నర్సరీలను నిర్వహించి రైతులకు నాణ్యమైన మొక్కలను అందించాలని కోడూరు ఉద్యాన అధికారి భాస్కర్ తెలియజేశారు. అదేవిధంగా మొక్కల కొనుగోలు మరియు అమ్మకాలకు సంబంధించిన రిజిస్టర్లలో తగు వివరాలు ఎప్పటికప్పుడు పొందుపరచాలని, మొక్కలు కోనుగోలుకి సంబంధించి రైతులకు రసీదులు అందించాలని చిట్వేలు ఉద్యాన అధికారి లోకేష్ తెలియజేశారు. బొప్పాయి విత్తనాలకు సంబంధించి ఎలాంటి కల్తీ జరగకుండా నర్సరీ నిర్వాహకులు విత్తనాలకు సంబంధించి రిజిస్టర్ లను నిర్వహించాలని కోడూరు మండల వ్యవసాయ అధికారి, సందీప్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నర్సరీ యజమానులు, రైతులు, రాఘవరాజపురం మరియు అనంతరాజుపేట ఉద్యాన సహాయకులు సుధీర్ కుమార్ వర్మ మరియు హరిబాబు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

కారు ఢీ కొని ద్విచక్రవాహనదారుడు మృతి

పెడన మండలం బల్లిపర్రు లో జరిగిన రోడ్డు యాక్సిడెంట్ లో ఒకరు మృతి. ముందుగా వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని డి కొట్టిన కారు. తీవ్ర గాయాలతో ఉన్న ద్విచక్రవాహనదారుడుని అంబులెన్సు లో హాస్పిటల్ కి తీసుకు వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో మృతి. మృతి చెందిన వ్యక్తి పెడన పదో వార్డు రాజీవ్ నగర్ కాలనీ నివాసి బ్రహ్మం గా గుర్తింపు

E-పేపర్

టీడీపీ దుత్తలూరు మండల కన్వినర్ గా ఉండేల…

పున్నమి, నవంబర్ 12 తెలుగుదేశం పార్టీలో కష్టపడిన వారికే అందలం దక్కుతుందని మరో మారు రుజువు చేసిన ఉదయగిరి శాసన సభ్యులు కాకర్ల సురేష్, పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడి, గత ఎన్నికల్లో పార్టీ గెలుపు, కోరకు విశ్రాంతి లేకుండా కష్టపడినా ఉండేల గురువారెడ్డి కి దుత్తలూరు మండల కన్వినర్ గా నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న మండల తెలుగుదేశం పార్టీ శ్రేణులు.పార్టీ సిద్ధంతలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీ కార్యక్రమలను ఆకుంటీత దీక్ష తో పూర్తిచేసే నైజం కలిగి వ్యక్తి ఉండేల గురువారెడ్డి, ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతు టీడీపీ పార్టీ ని బలపరచడంలో గురువారెడ్డి పాత్ర ఆత్యంత ముఖ్యమైనదని గురువారెడ్డి వంటి నిబద్దత కలిగిన నాయకులను, వారి సేవ కార్యక్రమలను గుర్తించి మండల కన్వినర్ గా బాధ్యతలు అప్పచెప్పడం జరిగిందన్నారు. అనంతరం గురువారెడ్డి మాట్లాడుతు శాసన సభ్యులు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టి ప్రజా సేవలో ఎల్లపుడు ముందుంటనని, రాబోయే స్థానిక ఎన్నికలలో పార్టీ విజయానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తానని తెలిపారు. తనను నమ్మి దుత్తలూరు కన్వినర్ గా నియమించిన ఉదయగిరి శాసన సభ్యులు కాకర్ల సురేష్ కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా దుత్తలూరు మండల కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై ఉండేల గురువారెడ్డి కి అభినందనాలు తెలియజేసారు.

E-పేపర్

భారీపరిశ్రమల శాఖసహాయ మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ని కలిసిన బిజెపి మండల అధ్యక్షుడు ముక్క రూపేష్ రెడ్డి

భారీపరిశ్రమల శాఖసహాయ మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ని కలిసిన బిజెపి మండల అధ్యక్షుడు ముక్క రూపేష్ రెడ్డి రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి రైల్వేకోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం బిజెపి మండల అధక్షుడు ముక్క రూపేష్ రెడ్డి తిరుపతి పర్యటనకు విచ్చేసిన నరసాపురం పార్లమెంట్ సభ్యులు, కేంద్ర ఉక్కు మరియు భారీపరిశ్రమల శాఖసహాయ మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శి నాగోత్ రమేష్ నాయుడు తో కలసి తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం నందు ఆత్మీయ స్వాగతం పలకడం జరిగింది అని మీడియా వారికి తెలియజేశారు.

ఎన్ టి ఆర్ జిల్లా

అండర్-14 రాష్ట్ర సెలక్షన్‌కు ఎంపికైన మంద మహికి ఘన సత్కారం

నందిగామ, బుధవారం అండర్-14 రాష్ట్ర స్థాయి సెలక్షన్‌కు ఉమ్మడి కృష్ణా జిల్లా జట్టులో ఎంపికైన లింగాలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి మంద మహిను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తమ కార్యాలయంలో మర్యాదపూర్వ కంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మహికి శాలువా కప్పి ఘనంగా సత్కరించి, అభినందనలు తెలియజేశారు. ఆమె మాట్లాడుతూ, “గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరచడం గర్వకారణం. మహి వంటి యువ క్రీడాకారులు భవిష్యత్తు లో రాష్ట్రానికి పేరు తెచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి” అని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు డి.లక్ష్మి, ప్రధానోపాధ్యాయుడు రాంబాబు, ఉపాధ్యాయులు జి. సరిత, వి.శ్రీనివాసరావు, ఎన్. శ్రీహరి, ఎస్ఎంసి చైర్మన్ షేక్ నాగుల్ మేరా తదితరులు పాల్గొన్నారు. వారు మహికి అభినందనలు తెలియజేస్తూ, మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

కామారెడ్డి

ఘనంగా కాలభైరవుడి జన్మదిన వేడుకలు

కామారెడ్డి 12 నవంబర్ పున్నమి ప్రతినిధి కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం: శివుని ఉగ్రరూపమైన శ్రీ కాలభైరవ స్వామి జన్మదిన వేడుకలు బుధవారం అంగరంగ వైభవంగా నిర్వ హించారు. రామారెడ్డి మండలం – ఇసన్నపల్లి గ్రామ శివారులో ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం వద్దకు నలుమూలల నుండి వేకవాజాముననే వివిధ మార్గాలగుండా భక్తులు తండోపతండాలుగా చేరి పూజార్చనలు నిర్వహించారు. కార్తీక మాసం శుక్ల పక్ష అష్టమి సందర్భంగా జరిగే ఈ వేడుకలు స్థాని కంగా విశేషప్రాముఖ్యత సంతరించుకున్నాయి. పురాణ వృత్తాంతం ఆకర్షించిన భక్తులు శివ పురా ణంలోని శ్రీ శత్రుద్ర సంహిత ప్రకారం కాలభైరవుడి ఆవిర్భావ కథనం ఆలయంలో వేదపండితులు వివరిస్తూ పఠించారు. బ్రహ్మ, విష్ణువు మధ్య జరిగి న వివాద సమయంలో శివుడి హూంకార శక్తి నుంచి పుట్టిన భయంకరమైన రూపమే కాలభైరవు డు అని వేదగోష్టులు వివరించారు. బ్రహ్మదేవుడి ఐదవ శిరస్సును ఖండించిన భైరవుడు శివుని క్రోధానికి ప్రతిరూపమని పురాణోక్తంగా చెప్పారని అర్చకులు తెలిపారు.వైభవంగా కొనసాగిన ఉత్స వాలు ఆలయంలో బుధవారం తెల్లవారుజామున మంగళస్నానాలు, పంచామృతాభిషేకాలు, వేద మంత్రోచ్చరణల మధ్య పూజలు ఘనంగా జరిగా యని అర్చకులు తెలిపారు. అనంతరం ఉత్సవ మూర్తి స్వామికి డోలారోహణం నిర్వహించగా భక్తు లు కొబ్బరికాయలు కొట్టి సాంప్రదాయక విధానం లో స్వామి దర్శనం పొందారు.అనంతరం ఆల యంలో సాంస్కృతిక కార్యక్రమాలు,జోలపాటలు, భక్తి భజనలు నిర్వహించారు.మహిళలుమంగళహా రతులు అర్పించారు. ఆలయ పరిసరాలు ‘ఓం ఓం భైరవ’ నినాదాలతో మార్మోగాయి.అన్నదానం – భక్తి సమర్పణవేడుకల అనంతరం విస్తృత స్థాయిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. స్థానిక భక్తులు, గ్రామ కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది వేలాదిమందికి ప్రసాదాన్ని వడ్డించారు.ఈ సంద ర్భంగా ఆలయ ఈవో ప్రభు మాట్లాడుతూ, కాల భైరవ స్వామి ఆలయ అభివృద్ధికి భక్తుల సహకా రం నిరంతరం లభిస్తోందని తెలిపారు. ప్రతి ఏడాది జన్మదిన వేడుకలను బ్రహ్మోత్సవాల స్థాయిలో నిర్వహిస్తామని పేర్కొన్నారు.భక్తుల సందడి మధ్య సాయంత్రం దీపారాధనతో వేడుకలు, పూజలు, ఆలయ ప్రాంగణం భక్తుల సందడి మధ్య పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. కార్తీక మాస ప్రత్యేక మహోత్సవాలుగా భక్తులు దీనిని విశ్వాసం గా భావించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త ల మండల సభ్యులు ఇరు గ్రామాల పెద్ద మనుషు లు విరాళాల దాతలు భక్తులు తదితరులు పాల్గొ న్నారు

E-పేపర్

టీడీపీ మండల క్లస్టర్ ఇంచార్జ్ గా తాళ్లూరి దయానందం

పార్టీలో కష్టపడిన వారికే అందలం దక్కుతుంది.పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పాటుబడిన విషయాన్ని గుర్తించి మండల క్లస్టర్ ఇంచార్జ్ గా ఎనుకున్నట్లు, ఉదయగిరి శాసన సభ్యులు కాకర్ల సురేష్ ప్రకటించారు.తెలుగుదేశం పార్టీ కొత్తపేట ఎంపీటీసీ గా పనిచేస్తూ పార్టీ సిద్ధంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనడం, ఎప్పుడు ప్రజల్లో ఉంటు ప్రజా సమస్యల పరిస్కారం కొరకు పరితపించే నాయకుడుడికి మండల క్లస్టర్ ఇంచార్జ్ గా ఎన్నుకోవడం పై కొత్తపేట గ్రామ తెలుగుదేశం శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా తాళ్లూరి దయానందం మాట్లాడుతు నాపై నమ్మకముంచి నాకు క్లస్టర్ ఇంచార్జ్ గా బాధ్యతలు ఇచ్చిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో రాబోతున్న స్థానిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయానికి శక్తి వంచన లేకుండా కృషిచేస్తానని, తనతో పాటు నూతన దుత్తలూరు మండల కన్వినర్ గా బాధ్యతలు చేపట్టిన ఉండేల గురువారెడ్డి మరియు,నూతనంగా పదవిని పొందుకున్న ఎన్నికైనా వారికీ శుభాకాంక్షలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

పెడన లో మెడికల్ కాలేజీ ల ప్రైవేటీ కరణకు వ్యతిరేకం గా వై సీ పి నిరసన ర్యాలీ

పెడన నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి తోటమూల తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తాసిల్దార్ కు వినతిపత్రం సమర్పించిన పెడన నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ శ్రీ ఉప్పాల రాము గారు మరియు కృష్ణాజిల్లా జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి ఉప్పాల హారిక గారు… ఈ కార్యక్రమంలో పెడన నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు విద్యార్థులు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు…

ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మల్ తెలుగు విద్యార్థుల క్షేత్ర పర్యటన

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటననిర్మల్ నవంబర్ 12, (పున్నమి ప్రతినిధి)నిర్మల్ : ప్రభుత్వ స్నాతక కళాశాల నిర్మల్ విద్యార్థులు క్షేత్ర పర్యటన కోసం వెళ్లారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం సుధాకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2025 సంవత్సరం లో విద్యార్థుల కు జ్ఞాన సముపార్జన కై కవులను కలిసేసందర్భంగా తెలుగు విభాగం అధిపతి డాక్టరు ఎల్మల రంజిత్ కుమార్ మరియు తెలుగు అధ్యాపకుడు డాక్టరు మురహరి రాథోడ్ విద్యార్థులను నిర్మల్ మహాత్మా జ్యోతిభా పూలే సొసైటీ డిగ్రీ కళాశాల నిర్మల్ ప్రిన్సిపాల్ డాక్టర్ బట్టు విజయ్ కుమార్ ను కళాశాల విద్యార్థులు తన రచనల గురించి అడిగారు. సింగిడి పువ్వు నానీలు, హైకులు, అనేకమైన ప్రక్రియల్లో రచనలు చేశానని చెప్పారు. తెలుగు సాహిత్యం పై అలాగే పరిశోధన ఎలా చేయాలి అనే అంశాల పై పూర్తి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎల్మల రంజిత్ కుమార్, డాక్టర్ రాథోడ్ మురహరి, డాక్టర్ బట్టు విజయ్ కుమార్, బిట్ల భారతి, జి శృతిక, జి పూజ, డి గాయత్రి, కే కీర్తన, బి శ్రీజ, డి గంగాసాగర, గౌతమి, పవన శృతి, కే ప్రణయ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.