Wednesday, 6 May 2026

Blog

తిరుపతి

కాణిపాక ధర్మకర్తలి ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ముక్కంటి ఆలయ ఛైర్మన్ కొట్టే సాయి

శ్రీకాళహస్తి డిసెంబర్ 07, పున్నమి న్యూస్: శ్రీ కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి ధర్మకర్తలమండలి అధ్యక్షులు, ధర్మకర్తలమండలి సభ్యులు ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ధర్మకర్తలమండలి అధ్యక్షులు కొట్టే సాయి ప్రసాద్ పాల్గొన్నారు. సభలో శ్రీకాళహస్తి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు మాట్లాడుతూ… శ్రీకాళహస్తి యొక్క దేవస్థానం ప్రాశస్త్యం గురించి, భక్తుల దర్శన భాగ్య విధివిధానాలు గురించి, శ్రీ వరసిద్ధి వినాయక కాణిపాకం దేవస్థానం యొక్క ప్రాశిస్తం గురించి ప్రసంగించడం జరిగింది. ఈ మహోత్సవ కార్యక్రమములో ఆంధ్ర ప్రదేశ్ హస్తకళల నైపుణ్య అభివృద్ధి అధ్యక్షులు మరియు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, (PAC MEMBER), తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తలమండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, పూతలపట్టు శాసనసభ్యులు మురళి గారు, కుప్పం నియోజక వర్గ MLC డాక్టర్ శ్రీకాంత్,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిసి కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ పల్తోన్నారు.

E-పేపర్

పెట్టుబడుల పేరుతో భారీ మోసం చేసిన CI భార్య సూర్యాపేట మునగాల సీఐ భార్య అరెస్ట్

పున్నమి ప్రతినిధి: *పెట్టుబడుల పేరుతో భారీ మోసం చేసిన CI భార్య* *సూర్యాపేట మునగాల సీఐ భార్య అరెస్ట్* *సూర్యాపేట జిల్లా మునగాల సీఐ భార్య పెట్టుబడుల పేరుతో ప్రజలను మోసం చేసిన ఘటన హయత్‌నగర్‌లో బయటపడింది. బంగారం, గ్రానైట్ వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే తక్కువ సమయంలోనే లక్షల్లో లాభాలు వస్తాయని చెప్పి ఆమె పలువురి నుంచి భారీ మొత్తంలో డబ్బులు సేకరించింది. భర్త పోలీస్ పదవిని అడ్డం పెట్టుకోవడంతో ప్రజలు ఆమెపై నమ్మకం ఉంచారు*. *అయితే నెలలు గడిచినా వాగ్దానం చేసిన లాభాలు రాకపోవడంతో బాధితులు డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగారు. ఇదే సమయంలో “నన్నే డబ్బులు అడుగుతారా? మీ సంగతి చెబుతా” అంటూ ఆమె బెదిరించిందని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు* *హయత్‌నగర్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు*.

E-పేపర్

అయ్యగారు అద్దెకున్న ఇంట్లోనే 30 లక్షలు దొరికాయంటే.. పెద్ద ఆనకొండే.

పున్నమి ప్రతినిధి : అయ్యగారు అద్దెకున్న ఇంట్లోనే 30 లక్షలు దొరికాయంటే.. పెద్ద ఆనకొండే..* హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి ఏసీబీకి అడ్డంగా బుక్కయ్యాడు.. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లోనే 60 వేల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడటం కలకలం రేపుతోంది.. రేపో మాపో IAS అర్హత పొందబోతున్న ఆ అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో అదనపు కలెక్టర్‌తో పాటు మరో ఇద్దరు విద్యాశాఖ అధికారులు అరెస్టయ్యారు.. అయ్యగారి పాపాలలో పాలు పంచుకొని జైలు పాలయ్యారు. ఓ ప్రైవేట్ స్కూల్ పర్మిషన్ రెన్యువల్ చేసేందుకు.. యాజమన్యం నుంచి లంచం తీసుకుంటున్న సమయంలో హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు.. వెంకట్ రెడ్డి ప్రస్తుతం హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారిగా కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ప్రైవేట్ స్కూల్ రెన్యువల్ కోసం లంచం డిమాండ్ చేసి రూ. 60 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు తన ఛాంబర్‌లోనే పట్టుకున్నారు. ఆయనతో పాటు గౌస్, మనోజ్ అనే మరో ఇద్దరు విద్యాశాఖ సిబ్బందిని కూడా పట్టుకున్నారు. అనంతరం అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే హనుమకొండలోనీ చైతన్యపురి కాలనీలో ఆయన నివాసం ఉంటున్న అద్దె ఇంట్లో 30 లక్షల రూపాయల కరెన్సీ లభ్యం అయింది. ఆ డబ్బుకు సరైన ఆధారాలు చూపకపోవడంతో సీజ్ చేశారు.. హైదరాబాద్‌లోని తన నివాసంలో విలువైన భూముల పత్రాలు స్వాదీనం చేసుకున్నారు అదనపు కలెక్టర్ వెంకటరెడ్డిపైన గతంలో కూడా పలు కేసులు నమోదు అయ్యాయి. ఆదాయానికి మించి అక్రమాస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణల పైన కేసులు ఉన్నాయనీ ఏసీబీ అధికారులు తెలిపారు.. నల్గొండ జిల్లాలో తహసీల్దార్‌గా పనిచేసిన సమయంలో ఈయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది.. జనగామ RDO గా విధులు నిర్వహిస్తున్న క్రమంలో జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డు విషయంలో కూడా అవినీతి కి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. సీసీ కెమెరాలు లేకుండా చూసి లంచం తీసుకున్నాడు. అయినా ఏసీబీ అధికారుల నుండి తప్పించుకోలేకపోయాడు. పక్కా ప్లాన్ ప్రకారం లంచం తీసుకున్నాడు. పగడ్బందీగా దొరికారు. అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి అడ్డంగా బుక్కై అరెస్ట్ అవడంతో ఆయన బాధితులు సంబరాలు జరుపుకున్నారు.. ఊరుకొండ, ఆరేపల్లి, వంగపహాడ్ గ్రీన్ ఫీల్డ్ హైవే బాధితులు హన్మకొండ కలెక్టరేట్ ముందు టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు పోలీస్ స్టేషన్లో జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలోని పోలీస్ స్టేషన్లో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్సై ఎం.ఎస్. రాకేష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించగా, ముఖ్య అతిథులుగా విచ్చేసిన డీఎస్పీ జి. శ్రీనివాసరావు గారు మరియు సీఐ శివరామకృష్ణారెడ్డి గారు ప్రజలకు హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రోడ్డు భద్రత పట్ల ప్రతి వ్యక్తి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని, హెల్మెట్‌ వినియోగం ప్రాణాలను కాపాడే రక్షాకవచమని తెలిపారు. ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని, ప్రత్యేకంగా యువత రోడ్లపై జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు. కార్యక్రమంలో పోలీసుల సిబ్బంది, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల

స్థానిక సంస్థల ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నికైన తంగళ్ళపల్లి మండలం బాలమల్లు

*స్థానిక సంస్థల ఎన్నికల్లో తంగళ్ళపల్లి మండలం బాలమల్లు పల్లె గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన యాదా ఎల్లయ్య గారికి మరియు శివలింగాపూర్, భరత్ నగర్, నేరెళ్ల గ్రామానికి సంబంధించిన ఏకగ్రీవంగా ఎన్నికైన వార్డు సభ్యులకు ఈరోజు కేకే మహేందర్ రెడ్డి గారు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

ఖమ్మం

ఖమ్మంకు రానున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

ఖమ్మం, డిసెంబర్ (పున్నమి ప్రతినిధి): భారత మాజీ ప్రధాని భారతరత్న శ్రీ అటల్ బిహారి వాజ్‌పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఖమ్మంలో 2026 మార్చి 1వ తేదీన నిర్వహించనున్న భారీ సభకు భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు హాజరుకానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సభను ఘనంగా నిర్వహించేందుకు బీజేపీ నాయకులు, శ్రేణులు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అటల్ జయంతి ఉత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తూ, ఆయా కార్యక్రమాల ద్వారా యువతకు దేశభక్తి, సేవాభావం, పరిపాలనా విలువలపై అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారని నిర్వాహకులు తెలిపారు..

E-పేపర్

పోలీస్ స్టేషన్లో దొంగతనం దొంగల వద్ద రికవరీ చేసిన రూ.1.75 లక్షల ఫోను చోరీ చేసిన పోలీస్ డ్రైవర్

పున్నమి ప్రతినిధి పోలీస్ స్టేషన్లో దొంగతనం దొంగల వద్ద రికవరీ చేసిన రూ.1.75 లక్షల ఫోను చోరీ చేసిన పోలీస్ డ్రైవర్ హైదరాబాద్ – మెహదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని రైతు బజార్ వద్ద తన ఫోను పోయిందని ఫిర్యాదు చేసిన వ్యక్తి సీసీ కెమెరాల ఆధారంగా దొంగను పట్టుకుని, ఫోన్ రికవరీ చేసి, లాకర్లో దాచిపెట్టిన మెహదీపట్నం పోలీస్ స్టేషన్ సిబ్బంది రూ.1.75 లక్షల ఫోన్ కావడంతో దానిపై కన్నేసి, కొట్టేసిన పోలీస్ డ్రైవర్ శ్రవణ్ కుమార్ శ్రవణ్ కుమార్ దొంగతనం చేసాడని నిర్ధారించి, అతన్ని రిమాండుకు తరలించిన ఉన్నతాధికారులు

E-పేపర్

ఇండిగో విమానాలు రద్దు అవ్వడంతో విమాన టికెట్ రేట్లు ప్రకటించిన కేంద్రం

పున్నమి ప్రతినిధి ఇండిగో విమానాలు రద్దు అవ్వడంతో విమాన టికెట్ రేట్లు ప్రకటించిన కేంద్రం ఇండిగో సంక్షోభం వల్ల భారీగా టికెట్ రేట్లు పెంచిన ఇతర ఎయిర్ లైన్స్ దీంతో కిలోమీటర్ల వరకు టికెట్ రేట్ రూ.7,500 500 కిలోమీటర్ల నుండి 1000 కిలోమీటర్ల వరకు రూ.12,000 1000 కిలోమీటర్ల నుండి 1500 కిలోమీటర్ల వరకు రూ.15,000 1500 కిలోమీటర్ల పైన ఉంటే రూ.18,000 మాత్రమే వసూలు చేయాలని ఫ్లైట్ టికెట్ రేట్లు నిర్ధారించిన కేంద్రం

Others

హార్న్‌బిల్ ఉత్సవంలో విశాఖ యువకుడి మెరిసిన ప్రతిభ — కిసామా నెట్‌వర్క్ సేవలకు కేంద్ర మంత్రుల ప్రశంస

నాగాలాండ్‌ గర్వకారణమైన హార్న్‌బిల్ ఉత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ 1 నుండి 10 వరకు కిసామా హెరిటేజ్ విలేజ్‌లో ఘనంగా జరుగుతుంది. నాగాలాండ్‌లోని 17 ప్రధాన తెగల సాంస్కృతిక వైభవం, వారి సంప్రదాయ కళలు, సంగీత-నృత్యాలు, ఆహార సంస్కృతి, హస్తకళలను ప్రపంచానికి పరిచయం చేసే ఈ వేడుకను ‘ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్’ అని పిలుస్తారు. ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది పర్యాటకులు దీన్ని ప్రత్యక్షంగా చూడటానికి వస్తారు. ఇలాంటి భారీ స్థాయి అంతర్జాతీయ వేడుకలో, కమ్యూనికేషన్ వ్యవస్థలు నిలకడగా పనిచేయడం ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో కిసామా గ్రామంలో ఏర్పాటు చేసిన నెట్‌వర్క్ కార్యకలాపాలకు విశాఖ వాస్తవ్యుడు వానపల్లి కిషోర్ బిఎస్‌ఎన్ఎల్ తరఫున కీలక బాధ్యతలు చేపట్టి సజావుగా నిర్వహించారు. కేంద్ర మంత్రుల ప్రశంసలు — కిషోర్ సేవలకు గుర్తింపు హార్న్‌బిల్ వేడుకలో ఆదివారం అతిథిగా పాల్గొన్న కేంద్ర కమ్యూనికేషన్స్ & గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్, కిసామా నెట్‌వర్క్ యొక్క నిరంతర సేవలను పరిశీలించి కిషోర్ ఆయన బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. వేడుకల సందడిలో పర్యాటకులు, మీడియా ప్రతినిధులు, కళాకారులు, అధికారులతో ప్రాంతం కిటకిటలాడుతున్నా కూడా నెట్‌వర్క్ ఏ చిన్న అంతరాయం లేకుండా పనిచేయడమే కాక, డేటా స్పీడ్ కూడా స్థిరంగా ఉండటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. “ఇంత పెద్ద ఈవెంట్లో కూడా ఇలాంటి స్థిరమైన నెట్‌వర్క్ అందించడం నిజంగా ప్రశంసనీయం. మీ కృషి భవిష్యత్తు నెట్‌వర్క్ అభివృద్ధికి దారితీస్తుంది” అని మంత్రి గారు పేర్కొన్నారు. జ్యోతిరాదిత్య సింధియా కూడా అభినందించిన కిసామా నెట్‌వర్కింగ్ టీమ్ ఇటీవలి రోజుల్లో నాగాలాండ్ పర్యటన ముగించి ఢిల్లీకి తిరిగి వెళ్లే ముందు కేంద్ర సమాచారం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా కిసామా నెట్‌వర్క్ పనితీరును ప్రశంసించారు. హార్న్‌బిల్ సందడి మధ్య ఎటువంటి కమ్యూనికేషన్ ఇబ్బందులు లేకుండా సేవలు కొనసాగడం ఆయన ప్రశంసలకు కారణమైంది. కిషోర్ కీలక బాధ్యతలు హార్న్‌బిల్ ఉత్సవం కోసం ప్రత్యేక టవర్ల ఏర్పాటు పర్యవేక్షణ గరిష్ట జనసమ్మోహనం సమయంలో వాయిస్/డేటా ట్రాఫిక్ నిర్వహణ అత్యవసర కమ్యూనికేషన్ స్పందన బృందానికి నాయకత్వం వీవీఐపీ అతిథుల కమ్యూనికేషన్ కోఆర్డినేషన్ విదేశీ పర్యాటకులకు కనెక్టివిటీ సపోర్ట్ ఈ పనులన్నింటినీ సమర్థంగా నిర్వహించడంతో కిషోర్‌పై కేంద్ర మంత్రుల ప్రశంసలు కురిసాయి కిసామాలో విశాఖ ప్రతిభ మెరుపు విశాఖలో పుట్టి పెరిగిన ఒక యువకుడు, దేశం నలుమూలల దృష్టిని ఆకర్షించే హార్న్‌బిల్ వంటి అంతర్జాతీయ స్థాయి ఈవెంట్‌లో కీలక పాత్ర పోషించడం గర్వకారణం. కేంద్ర మంత్రులతో భేటీ కావడం, వారి నుండి ప్రత్యక్ష అభినందనలు పొందడం కిషోర్ కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయి గా నిలిచింది.

తూర్పు గోదావరి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేయనున్న డాక్టర్ నల్లమిల్లి ఆదిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేయనున్న డాక్టర్ నల్లమిల్లి ఆదిరెడ్డి తూర్పు గోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి ✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు న్యూస్ రిపోర్టర్. అనపర్తి, 7 డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) : తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, అనపర్తి గ్రామవాసి అయిన డాక్టర్ నల్లమిల్లి ఆదిరెడ్డి, సీరియల్ నెంబర్ 19. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల్లో ప్రెసిడెంట్ అభ్యర్ధిగా పోటీ చేయుచున్నట్లు తెలిపారు. ఫార్మసీ మిత్రులు అందరూ తమ అమూల్యమైన ఓటు హక్కుని వినియోగించుకొని తమని గెలిపించమని కోరి ప్రార్ధించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.