Monday, 4 May 2026

Blog

రంగారెడ్డి

* ఎస్ ఎన్ పి ఎల్ ..సీజన్ 5 నూతన అధ్యక్షుడి గా కొండ నవీన్ గౌడ్ * –త్వరలో 2026 ఎస్ ఎన్ పి ఎల్ సీజన్ 5*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 28 :గత 4 సంవత్సరాలు గా ప్రతి సంక్రాంతి పండగకు నిర్వహిస్తున్న సంస్థాన్ నారాయణపురం ప్రీమియర్ క్రికెట్ లీగ్ కు సహకరిస్తున్న నారాయణపురం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పల లింగస్వామి మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ముద్దంగుల నరసింహ సహకారంతో ఎస్ ఎన్ పి ఎల్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉప్పల నాగరాజు అధ్యక్షతన దిగ్విజయంగా ఎంతో బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా అదే ఉత్సాహంతో క్రీడా పోటీలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంటూ ఆదివారం ఎస్ ఎన్ పి ఎల్ కమిటీ సభ్యుల తో మీటింగ్ ఏర్పాటు చేసుకోని ఎస్ ఎన్ పి ఎల్ ..సీజన్ 5 నూతన అధ్యక్షుడి గా అధ్యక్షుడిగా కొండ నవీన్ గౌడ్ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం నూతన అధ్యక్షుడు కొండ నవీన్ గౌడ్ ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన వ్యవస్థాపక అధ్యక్షులు ఉప్పల నాగరాజు మరియు కమిటీ సభ్యులు.. ఈ సందర్భంగా అధ్యక్షులు నవీన్ గౌడ్ మాట్లాడుతూ *త్వరలోనే 2026 ఎస్ ఎన్ పి ఎల్ సీజన్ 5 షెడ్యూల్ ని తెలుపుతామని అన్నారు ఈ కార్యక్రమంలో. ఎస్ ఎన్ పి ఎల్ కమిటీ సభ్యులు కొండ శ్రీకాంత్ గౌడ్, సురపల్లి వెంకటేష్,దూసరి నారాయణ,పల్లె ఆనంద్ గౌడ్, పెద్దగొని రాజు, చెరుకుపల్లి భాస్కర్, గంగపురం సాయి ,సింగం కృష్ణ, కొప్పు రామకృష్ణ, మోగుదాల ప్రదీప్,మిరియాల శ్రీహరి, కడారి యశ్వంత్,చెరుకుపల్లి శ్రీకాంత్,వినుకొండ అజయ్, దేవరకొండ కార్తీక్, కట్ట నవీన్, బల్లెం జస్వంత్ తదితరులు పాల్గొన్నారు

రంగారెడ్డి

* కోతులు కుక్కల బెడద నుంచి గ్రామానికి త్వరలో విముక్తి * –అన్న మాట నిలబెట్టుకుంటున్న సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 28 : సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో కోతులు, కుక్కల బెడద విపరీతంగా ఉండడంతో సర్పంచిగా గెలిచిన తర్వాత గ్రామంలో కోతులు, కుక్కలు లేకుండా చేస్తా అన్న మాట నిలబెట్టుకుంటున్న సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి. ఈరోజు కోతులు పట్టేవారిని పిలిపించి మాట్లాడారు వారు రెండు మూడు రోజుల్లో వచ్చి కోతులు కుక్కలు పట్టే కార్యక్రమం చేపడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పల్లె మల్లారెడ్డి, వార్డు సభ్యులు మందు గుల బాలకృష్ణ, పందుల యాదగిరి, సూరపెళ్లి వెంకటేష్, మహమ్మద్ అలీమా యూసుఫ్, చిలువేరు రమాదేవి శంకర్, పట్నం బాలకృష్ణ గౌడ్, సింగపంగా ప్రశాంతి రమేష్, సింగం బిక్షపతి నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

E-పేపర్

శ్రీశ్రీశ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు భువనగిరి పార్లమెంటు BRS పార్టీ ఇంచార్జ్, శ్రీ క్యామ మల్లేష్

పున్నమి ప్రతినిధి తెల్లపూర్ కురుమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన, *శ్రీశ్రీశ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి* కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన, భువనగిరి పార్లమెంటు BRS పార్టీ ఇంచార్జ్, శ్రీ క్యామ మల్లేష్ ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంటు సభ్యులు శ్రీ రఘునందం రావు ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ బిర్లా ఐలయ్య మాజీ ఎమ్మెల్సీ యేగ్గే మల్లేష్ కురుమ సంఘం నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

E-పేపర్

ఫ్లెక్సీల రగడ..!* *ఎల్బీనగర్ లో రెండుగా చీలిపోయిన కాంగ్రెస్ పార్టీ* *నూతన సంవత్సర ఫ్లెక్సీల ఏర్పాట్లలో ఫోటోల యుద్ధం*

*ఫ్లెక్సీల రగడ..!* *ఎల్బీనగర్ లో రెండుగా చీలిపోయిన కాంగ్రెస్ పార్టీ* *నూతన సంవత్సర ఫ్లెక్సీల ఏర్పాట్లలో ఫోటోల యుద్ధం* *తమ వారి ఫోటోలు పెట్టలేదు అంటూ అర్ధరాత్రి ఫ్లెక్సీలను చించివేసిన వైనం* *ఒకరిపై ఒకరు ఫిర్యాదులు* *తల పట్టుకుంటున్న పోలీసులు* *జక్కిడి – మధు యాష్కి రెండు వర్గాల మధ్య యుద్ధ పోరు* *అధికార వర్గాల మధ్య పోరుతో పోలీసులకు చెమటలు* పున్నమి ప్రతినిధి : ఎల్బీనగర్ లో కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయింది. ఒకటి జక్కిడి వర్గం.. రెండోది మధుయాష్కి వర్గం అనే విషయం తేటతెల్లమైంది. గత కొంతకాలంగా మధుయాష్కి గౌడ్ ఎల్బీనగర్ రాజకీయంపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే గతంలో కొన్ని ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీకి విధేయతగా పనిచేస్తున్న జక్కిడి ప్రభాకర్ రెడ్డి కుటుంబం కూడా పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. కానీ నిజామాబాద్ నుంచి వలస వచ్చిన మధుయాష్కి గౌడ్ ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని తన గుప్పెట్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే గత ఎన్నికలలో మధుయాష్కి గౌడ్ ఎల్బీనగర్ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. దీనికి కారణం స్థానిక నాయకులు ఆయనకు సహకరించ లేదు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక అప్పటి నుండి ఆయన తన సొంత క్యాడర్ ని పెంచుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే కొంత మంది తన అభిమానులు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మన్సురాబాద్ డివిజన్ లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అందులో జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఫోటో గాని, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఫోటో గాని లేకపోవడంతో జక్కిడి ప్రభాకర్ రెడ్డి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చెందారు. అర్థరాత్రి మధుయాష్కీకి అనుకూలంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేశారు. దీంతో మధుయాష్కిగౌడ్ వర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా ఫ్లెక్సీలను చించివేసిన వారిని గుర్తించి పోలీసులు కేసులు నమోదు చేశారు. *బహిర్గతమైన వర్గ విభేదాలు..* ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వర్గ విభేదాలు బట్టబయలు అయ్యాయి. గత ఎన్నికల్లో కలిసి కట్టుగా పని చేస్తున్నట్టు ప్రజలంతా అనుకున్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు తారస్థాయికి చేరింది. ఎల్బీనగర్ లో కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయిందని ప్రజలు అనుకుంటున్నారు. ఒకటి మధు యాష్కి వర్గం, మరొకటి జక్కిడి వర్గం అనేది ఫ్లెక్సీల రగడతో చర్చనీయాంశంగా మారింది. ఈ రెండు వర్గాలలో స్థానిక కాంగ్రెస్ క్యాడర్ ఎవరి పక్షాన ఉంటారో.. అనేది ఇంకా సందిగ్ధమే..! కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తీర్చుకోవాలి మరి.. *తారాస్థాయికి వర్గ పోరు..!* కాంగ్రెస్ అంటేనే వర్గ పోరాటాలకు నిలయం. అయితే ఇంతకాలం ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి వర్గ పోరు ఎప్పుడూ ప్రజలు చూసి ఉండరు. కానీ.. ఎప్పుడైతే మధు యాష్కిగౌడ్ రూపంలో చూడాల్సి వచ్చింది అంటూ మొక్కున వేలేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో మధుయాష్కీ గౌడ్ ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అప్పటి నుండి వర్గ పోరు మొదలైంది. ఎంతో కాలంగా ఈ నియోజకవర్గాన్ని నమ్ముకొని పనిచేస్తున్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మధుయాష్కి గౌడ్ రాకతో నిరుత్సాహంలో పడిపోయారు. కాంగ్రెస్ అధిష్టానం ఏండ్ల తరబడి కాంగ్రెస్ కోసం పనిచేస్తున్న నాయకులను కాదని.. వలస వచ్చిన నేతకు అవకాశం ఇవ్వడంతో ఎవరు మనస్ఫూర్తిగా పని చేయలేకపోయారు. ఇదే కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఓటమి చెందినా.. మధుయాష్కి గౌడ్ నియోజకవర్గాన్ని వదలకుండా గత కొంత కాలంగా నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలకు నచ్చడం లేదు. అందులో భాగంగానే ఆయనపై కాంగ్రెస్ పార్టీలోనే వ్యతిరేకత బయటపడుతుంది. మునుముందు ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో.. వేచి చూడాలి మరి..?

E-పేపర్

రేపు అసెంబ్లీకి హాజరు కానున్న కేసీఆర్

రేపు అసెంబ్లీకి హాజరు కానున్న కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు అయ్యేందుకు ఆదివారం సాయంత్రం నంది నగర్ లోని తన నివాసానికి చేరుకున్న కేసీఆర్

జోగులాంబ గద్వాల

కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానంటున్నమాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్*

గద్వాల్ డిసెంబర్ 28( పున్నమి ప్రతినిధి) కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానంటున్న మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులకు భరోసాగా నిలుస్తున్న సంపత్ కుమార్ . అలంపూర్ నియోజకవర్గం ఐజ మండలం సింధనూరు గ్రామంలో కొద్దిరోజుల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలైన సర్పంచ్ వార్డు మెంబర్ అభ్యర్థులు ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ గారిని కలిసి శాలువ తో సత్కరించి ఓటమి చెందిన అభ్యర్థులు ఓటమి ను తలచుకుని బాధపడటం జరిగింది. వారికి కాంగ్రెస్ పార్టీ సంపత్ కుమార్ ఎల్లవేళలా అండగా ఉంటారని గ్రామాల అభివృద్ధిలో గెలుపు ఓటములతో సంబంధం లేకుండా కాంగ్రెస్ కార్యకర్తలు పాలుపంచుకోవాలని గ్రామాభివృద్ధి లక్ష్యంగా పని చేయాలని వారికి సంపత్ కుమార్ గారు తెలిపారు.అనంతరం ఆ గ్రామంలో గెలిచిన వార్డు సభ్యులకు శాలువ కప్పి సత్కరించారు

జోగులాంబ గద్వాల

గద్వాల జిల్లాలో ఇంకేవరైనా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అని పేరు చెప్పుకుంటే అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్తా

*గద్వాల జిల్లాలో ఇంకేవరైనా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అని పేరు చెప్పుకుంటే అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్తా.. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాలిచేటి రాజీవ్ రెడ్డి * కాంగ్రెస్ పార్టీలో *వెనుపోటు రాజకీయాలు* చేస్తే సహించం * * తప్పుడు ప్రచారాలు చేయొద్దు * పాత కాంగ్రెస్… కొత్త కాంగ్రెస్ అనేది ఉండదు *అందరికి ఒకటే కాంగ్రెస్ పార్టీ* * * భీఫామ్స్ ఇచ్చేది *కాంగ్రెస్ పార్టీ DCC మాత్రమే*.. * * ఎవ్వరు ఇంట్లో వాళ్లు కూర్చొని రాజకీయాలు చేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ ను,*వాడుకొని వదిలేస్తాము అంటే, పార్టీ కి* అన్ని విషయాలు తెలియచేస్తాము * * అయిదవ *తారీఖు నుంచి ప్రతి ఊర్లో* పర్యటిస్తాం. * * ఎప్పుడూ, నిరంతరం మీ మధ్యలోనే ఉంటూ, *పార్టీ అభివృద్ధి కి కృషి* చేస్తాను. * * కాంగ్రెస్ పార్టీ *కార్యకర్తలందరిని* ఆహ్వానిస్తున్నాం * * కాంగ్రెస్ కార్యకర్తలు అందరు *కలిసికట్టుగా వచ్చి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా* పాల్గొన్నాలి అని జిల్లా అధ్యక్షులు మాలిచేటి రాజీవ్ రెడ్డి పిలుపునిచ్చారు

నాగర్‌కర్నూల్

అంగన్వాడి భవనానికి మహర్దశ.

అంగన్వాడి భవనానికి మహర్దశ. వెల్దండ డిసెంబర్ 28 : వెల్దండ మండల పరిధిలోని బొల్లంపల్లి గ్రామపంచాయతీలో గ్రామ సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సర్పంచిగా పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గ్రామంలో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించారు. గ్రామపంచాయతీ పరిధిలోని అంక మోనికుంట గ్రామంలో నిరుపయోగంగా ఉన్న అంగన్వాడి భవనంలో గల పిచ్చి మొక్కలను, చెట్లను తొలగించి, అంగన్వాడి భవనానికి మహర్దశ కల్పించారు. అంగన్వాడి కేంద్రాన్ని గత 8 సంవత్సరాల కింద గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలోకి మార్చడం జరిగింది. నాటి నుండి నిరుపయోగంగా ఉండి, పిచ్చి మొక్కలతో కూరుకుపోయి ఉన్న సమస్యను గ్రామ సర్పంచ్ జెసిబి సహాయంతో మొక్కలను తీసివేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడి భవనానికి మరమ్మతులు చేయించి, అవసరమగు డోర్లు కిటికీలు బిగించి, రంగులు వేయిస్తానని చెప్పారు. సర్పంచ్ పలు అభివృద్ధి పనులు చేస్తున్నందున గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్, ఉప సర్పంచ్ చొప్పరి రామకృష్ణ, గ్రామస్తులు నరసింహ, సత్తూరి శేఖర్, మొకురాల శ్రీకాంత్, వంశీ, జంగయ్య, కిరణ్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

మేడిపల్లి నక్కర్త నూతన సర్పంచ్ కి సన్మానం ఐటి శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు

*నూతన సర్పంచ్ గారికి సన్మానం* ఈరోజు శంషాబాద్ *కె.ఎల్.సి.సి కన్వెన్షన్ హాల్ లో* తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా లో నూతనంగా గెలిచిన సర్పంచ్ లకు సన్మాన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం గౌరవ శాసనసభ్యులు *శ్రీ మల్ రెడ్డి రంగా రెడ్డి* మరియు ఐటి శాఖ మంత్రివర్యులు *దుద్దిల్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా మేడిపల్లి నక్కర్త నూతన సర్పంచ్ గా గెలిచిన *”ముచ్చర్ల సుగుణ సంపత్”*కు శాలువాతో సత్కరించి సన్మానం చేయడం జరిగింది.

E-పేపర్

VI సిగ్నల్ లేకపోవడంతో సుమారుగా 10రోజులుగా వినియోగదారులు ఇబ్బందు పడుతున్న పట్టించుకోని VI

Vi (సిగ్నల్) నెట్వర్క్ లేక ప్రజలు ఇబ్బంది… రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలం లో ని నక్కర్త మేడిపల్లిలో గ్రామంలో VI సిగ్నల్ లేకపోవడంతో సుమారుగా 10రోజులుగా వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని వినియోగదారులు కోరుతున్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.