Sunday, 3 May 2026

Blog

విజయనగరం 

2026లో ప్రభుత్వం ప్రకటించిన సెలవులు.

2026లో ప్రభుత్వం ప్రకటించిన సెలవులు.. *పండుగ – తేదీ* *1. భోగి – జనవరి 14* 2. మకర సంక్రాంతి-జనవరి 15 3. కనుమ – జనవరి 16 4. రిపబ్లిక్‌ డే- జనవరి 26 5. మహా శివరాత్రి – ఫిబ్రవరి 15 6. హోలీ – మార్చి 3 7. ఉగాది – మార్చి 19 8. రంజాన్‌ – మార్చి 20 9. శ్రీరామ నవమి – మార్చి 27 10. గుడ్‌ ఫ్రైడే – ఏప్రిల్ 3 11. బాబు జగ్జీవన్‌రావ్‌ జయంతి – ఏప్రిల్ 5 12. బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి – ఏప్రిల్ 14 13. బక్రీద్ – మే 27 14. మొహర్రం – జూన్ 25 15. ఇండిపెండెన్స్‌ డే – ఆగస్టు 15 16. వరలక్ష్మి వ్రతం – ఆగస్టు 21 17. మిలాద్ -ఉన్-నబీ – ఆగస్టు 25 18. శ్రీకృష్ణాష్టమి – సెప్టెంబర్ 4 19. వినాయక చవితి – సెప్టెంబర్‌ 14 20. గాంధీ జయంతి – అక్టోబర్‌ 2 21. దుర్గాష్టమి – అక్టోబర్‌ 18 22. విజయ దశమి – అక్టోబర్‌ 20 23. దీపావళి – నవంబర్‌ 8 24. క్రిస్మస్‌ – డిసెంబర్‌ 25 ఇలా 2026లో మొత్తం 24 శెలవు దినాలు. గవర్నమెంట్ పబ్లిక్‌ హాలీడేస్‌ …

తెలంగాణ

*_Telangana Assembly Today: నేడు కృష్ణా జలాలపై అసెంబ్లీలో కీలక చర్చ..!!_*

*_Telangana Assembly Today: నేడు కృష్ణా జలాలపై అసెంబ్లీలో కీలక చర్చ..!!_* _Krishna Water Dispute: తెలంగాణ శాసనసభలో ఇవాళ కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన కృష్ణా నదీ జలాల అంశంపై అసెంబ్లీలో షార్ట్ డిస్కషన్ జరగనుంది._ _ఈ చర్చపై అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ఆసక్తి నెలకొంది. కృష్ణా జలాల పంపకాల అంశం రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పటి నుంచో సున్నితమైన అంశంగా ఉండటంతో, ఈ రోజు జరిగే చర్చ ప్రాధాన్యం సంతరించుకుంది._ _ఈ చర్చలో భాగంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్యాహ్నం 12 గంటలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కృష్ణా నదిపై తెలంగాణకు ఉన్న హక్కులు, గతంలో జరిగిన అన్యాయాలు, ప్రస్తుత నీటి వినియోగ పరిస్థితి, భవిష్యత్తు కార్యాచరణ వంటి అంశాలను ప్రజెంటేషన్ ద్వారా సభకు వివరించనున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌తో జల వివాదాలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సభ ముందుంచనున్నారు._ _ఇదిలా ఉండగా, ఇవాళ శాసనసభలో ప్రభుత్వం నాలుగు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. వాటిలో ప్రధానంగా తెలంగాణ (రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్‌మెంట్స్ టు పబ్లిక్ సర్వీసెస్, రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ పాటర్న్, పే స్ట్రక్చర్) సవరణ బిల్లు, అలాగే దీనికి సంబంధించిన రెండో సవరణ బిల్లు ఉన్నాయి. ఈ బిల్లుల ద్వారా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, సిబ్బంది నిర్మాణం, వేతన విధానంలో మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది._ _అదేవిధంగా పంచాయతీ రాజ్ సవరణ బిల్లు మరియు దానికి సంబంధించిన రెండో సవరణ బిల్లును కూడా సభ ముందుకు తీసుకురానున్నారు. స్థానిక సంస్థల పరిపాలనను మరింత సమర్థవంతంగా చేయడమే లక్ష్యంగా ఈ సవరణలు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. గ్రామ స్థాయి పరిపాలనలో అధికారాల పంపకం, పరిపాలనా సౌలభ్యం పెంచే దిశగా ఈ బిల్లులు ఉపయోగపడనున్నాయని ప్రభుత్వం చెబుతోంది._ _కృష్ణా జలాలపై చర్చతో పాటు కీలక బిల్లుల ప్రవేశం నేపథ్యంలో ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ఉత్కంఠభరితంగా సాగే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఖరిపై ప్రశ్నలు సంధించే అవకాశం ఉండటంతో, సభలో వాడివేడిగా చర్చలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి._

తిరుపతి

అభివృద్ధిని అడ్డుకోవడమే వైసిపి నైజం… టి.డి.పి. పట్టణ మహిళా అధ్యక్షురాలు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, జనవరి 02: పట్టణంలోని కైలాసగిరి కాలనీలో ఉన్న మునిసిపల్ ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధిపనులపై శ్రీకాళహస్తి పట్టణ తెలుగుదేశంపార్టీ మహిళా అధ్యక్షురాలు అల్లం సుమతి మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని విద్యార్థులకు కనీస మౌలిక వసతులు లేకుండా పాఠశాల దుస్థితిలో కొనసాగిందన్నారు. అప్పుడు “నాడు–నేడు” అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసినా, ఆ పథకం ఈ పాఠశాలకు మాత్రం కాగితాలకే పరిమితమైందని వైసీపీ ప్రభుత్వపాలనలో పాఠశాల అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేశారని ఆ నిధులను పక్కదారి మళ్లించి వాటిని సరైన విధంగా వినియోగించకపోవడం, పనులను మధ్యలోనే ఆపేయడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆ సమయంలో పాఠశాలలో కేవలం 65 మంది విద్యార్థులే ఉండగా, తగిన మౌలిక వసతుల లేమి కారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర పాఠశాలలకు తరలించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పరిస్థితి పూర్తిగా మారిందని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అర్ధాంతరంగా ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించి, పాఠశాల అభివృద్ధిని వేగవంతం చేస్తున్నారు. విద్యార్థులకు అవసరమైన బాత్రూమ్స్, తాగునీరు, అధ్వానంగా ఉన్న పాఠశాల ముందర భాగంలో గ్రావెల్ మట్టితో సుందరంగా తీర్చిదిద్ది రోడ్డు వసతి కల్పించారు ఇతర మౌలిక సదుపాయాలు అందేలా చర్యలు చేపట్టారని ఈ క్రమంలో సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసి, పనులు వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని పాఠశాల అభివృద్ధికి కృషి చేయడంతో ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య వందకు (100) పైగా పెరిగిందని ఇది ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధికి ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తోందన్నారు. ఇప్పుడు పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక, వైసీపీ నాయకులు నిందలు వేస్తూ పనులకు ఆటంకాలు కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారని గతంలో తామే ఆపేసిన పనులపై నోరు విప్పని వైసీపీ, ఇప్పుడు అభివృద్ధిని అడ్డుకునేలా వ్యవహరించడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కైలాసగిరి మునిసిపల్ ప్రాథమిక పాఠశాల విషయంలో గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుండగా, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడం వెనుక రాజకీయ స్వార్థమేనని ఆమె పేర్కొన్నారు.

అన్నమయ్య

నూకనేనిపల్లిలో భారీగా బిజెపిలో చేరికలు: ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు ​నందలూరు:

నందలూరు మండలం నూకనేనిపల్లి గ్రామపంచాయతీలో ఈరోజు యువత మరియు గ్రామ ప్రజలు భారీ ఎత్తున భారతీయ జనతా పార్టీలో చేరారు. బిజెపి జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు సాయి లోకేష్ సమక్షంలో ఈ చేరికల కార్యక్రమం ఘనంగా జరిగింది. ​ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు ముఖ్యఅతిథిగా విచ్చేసి, పార్టీలో చేరిన వారికి కాషాయ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలు మరియు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై యువత పెద్ద సంఖ్యలో బిజెపిలో చేరడం శుభపరిణామమని పేర్కొన్నారు. ​పాల్గొన్న ముఖ్య నాయకులు: ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ మోర్చా నాయకుడు షబిర్ అహ్మద్, జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణ యాదవ్, జిల్లా కార్యదర్శి నరేంద్ర రాజు, జిల్లా డైరెక్టర్ విఠలాచారి, అసెంబ్లీ కో కన్వీనర్ డాక్టర్ అరిగే రామ్ ప్రసాద్ పాల్గొన్నారు. ​అలాగే సీనియర్ నాయకుడు కోడురా ఆదినారాయణ, మున్సిపల్ కౌన్సలర్ వర్మ, మండల అధ్యక్షుడు చుక్కా శ్రీనివాసులు మరియు నందలూరు బిజెపి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.

తిరుపతి

లబ్ధిదారులకు పట్టాదారు పాస్‌బుక్స్ పంపిణీచేసిన తెదేపా నాయకులు

తొట్టంబేడు పున్నమి న్యూస్, జనవరి 02: తొట్టంబేడు మండలంలోని కారకొల్లు పంచాయతీ, డొంగలముడురు గ్రామంలోని రైతులకు నూతన పట్టాదారు పాస్‌బుక్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో థోట్టంబేడు మాజీ మార్కెట్ చైర్మన్ శ్రీ జై చంద్ర నాయుడు, థొట్టంబేడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మునిరాజ నాయుడు పాల్గొని లబ్ధిదారులకు పాస్‌బుక్స్ అందజేశారు.

తిరుపతి

ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న వాహనం యువకుడు మృతి

తొట్టంబేడు పున్నమి క్రైం న్యూస్, జనవరి 02: తొట్టంబేడు బెడు పోలీస్ స్టేషన్ పరిధిలో రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర సాయంత్రం 4:00 గంటల సమయంలో రాయచోటికి చెందిన చందు అనే యువకుడు (వయస్సు 21 సం) స్ప్లెండర్ బైక్ పై వెళ్తుండగా అతనిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి వెళ్లిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో వాహన చోదకునికి తల, ముఖంపై తీవ్రమైన రక్తగాయాలు కావడంతో స్థానికులు వెంటనే 108 కి సమాచారం ఇవ్వగా తక్షణమే 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రున్ని శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్‌కు తరలించగా ఆసుపత్రి వైద్యులు చందుని పరిశీలించి అతను మృతి చెందినట్లు నిర్ధారించడంతో ఈ సంఘటన పై పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు.

తిరుపతి

నామినేట్ పదవులు పొందిన వారికి ఘన సన్మానం చేసిన ముదిరాజ్ సంఘం

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, జనవరి 02: నామినేట్ పదవులు పొందిన తెదేపా నాయకులకు పట్టణంలోని స్థానిక సరోజినీదేవి కళ్యాణ మండపంలో ముదిరాజ్ సంఘం ఆద్వర్యంలో ఘనసత్కారం చేపట్టారు. ముదిరాజ్ సంఘం తరఫున గురుమూర్తి నేతృత్వంలో వారికి తరఫున పూలమాలాలు వేసి దుశ్యాలవులతో జ్ఞాపికలను అందజేసి ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘ నాయకులు మాట్లాడుతూ… పదవులను పొందిన నాయకులు ప్రజలకు మంచి సేవలను అందించి వారి మన్ననలను పొంది భవిష్యత్తులో మరెన్నో ఉన్నతమైన పదవులు పొందాలని ముదిరాజులను రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా మీ వంతు సహాయ సహకారాలు అందిస్తూ అభివృద్ధిలోకి తీసుకురావాలన్నారు. వివిధ పదవులు పొందిన నాయకులు తిరుపతి జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రమణయ్య, ముదిరాజ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి పిల్లారి.బత్తినయ్య, తంగేళ్ళపాలెం సింగిల్ విండో చైర్మన్ భీమాల.భాస్కర్, తొట్టంబేడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి చిల్లకూరు.బాలసుబ్రమణ్యం, కట్టపుట్టాలమ్మ చైర్మన్ పాడి.రాజేంద్ర, రాష్ట్ర ముదిరాజ్ సంఘం కార్యదర్శి అల్లిపూడి.వెంకటేశ్వర్లు, శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు సామ.అంకయ్య, డిసిసి బ్యాంక్ డైరెక్టర్ కూనాటి.నాగరాజు, అఖిల భారతీయ కూలీ ముదిరాజ్ తిరుపతి చైర్మన్ కుర్రకాల్వ వేణు, వడమాలపేట మండల వీఆర్వోల సంఘం ప్రెసిడెంట్ పి.చంద్రబాబు, ఏపీ మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు స్టేట్ డైరెక్టర్ తేరని.జయరాం రెడ్డి, రేణిగుంట మండల టీఎన్టియుసి అధ్యక్షులు కుట్రపాక.శీను తదితరులు వారి యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

తిరుపతి

కార్యకర్త మృతికి సంతాపం తెలిపిన మాజీ ఎమ్మెల్యే

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, జనవరి 02: శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలోని కారకొల్లు SC కాలనీకి చెందిన వైకాపా కార్యకర్త రమణయ్య ఆకస్మిక మృతి చెందారు. కార్యకర్త మరణించిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి రమణయ్య పార్థివ దేహానికి పూలమాల వేసిన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు, అడ్వకేట్ గల్లా సుదర్శన్ నాయుడు, చంద్ర, గ్రామస్తులు ఉన్నారు.

అన్నమయ్య

నందలూరు: టీడీపీ జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన గంటా గోపికి ఘన సన్మానం

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గంటా గోపాలకృష్ణ (గోపి) టీడీపీ జిల్లా కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా శుక్రవారం ఆయనను నందలూరులో ఘనంగా సత్కరించారు. నందలూరు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ​ఈ సందర్భంగా సర్పంచ్ జంబు సూర్యనారాయణ మాట్లాడుతూ.పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న గంటా గోపికి జిల్లా స్థాయిలో గుర్తింపు లభించడం సంతోషకరమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఆయన మరెన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ, శుభాకాంక్షలు తెలియజేశారు. ​పాల్గొన్న ముఖ్య నాయకులు: ఈ సన్మాన కార్యక్రమంలో జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ కార్యదర్శి సయ్యద్ అమీర్, టీడీపీ నాయకులు తుమ్మాది శివకుమార్, బెస్త సుబ్రమణ్యం, మారే శివకుమార్, అరవ క్రాంతి కుమార్, శివ, నరసింహం, దాదా పీర్ మరియు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.

అన్నమయ్య

నందలూరు సింగల్ విండో డైరెక్టర్‌గా ఆండ్ర శివారెడ్డి బాధ్యతల స్వీకరణ ​ ​శివారెడ్డి నియామకం రైతులకు కొండంత అండ: బీజేపీ నేత రాచూరి మురళి.

కడప జిల్లా నందలూరు మండల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (సింగల్ విండో) త్రీమెన్ కమిటీ డైరెక్టర్‌గా భారతీయ జనతా పార్టీ నాయకులు ఆండ్ర శివారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ సమక్షంలో ఆయన అధికారికంగా సంతకాలు చేసి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు హాజరయ్యారు. ​రైతులకు సేవ చేసే అవకాశం: ఈ సందర్భంగా బీజేపీ నాయకులు రాచూరి మురళి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ రైతు సంక్షేమ ఫలాలను ప్రతి రైతుకు చేరవేయడంలో ఆండ్ర శివారెడ్డి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. శివారెడ్డి నాయకత్వంలో నందలూరు మండలం వ్యవసాయ పరంగా మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. ​అంకితభావంతో ముందుకు: వీరబల్లి జయకుమార్ రెడ్డి బీజేపీ నేత వీరబల్లి జయకుమార్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ పట్ల ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్న శివారెడ్డికి ఈ బాధ్యతలు అప్పగించడం సంతోషకరమన్నారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, విత్తనాలు, ఎరువులు మరియు సకాలంలో రుణాలు అందేలా త్రీ మెన్ కమిటీ ప్రత్యేక చొరవ చూపుతుందని ఆయన స్పష్టం చేశారు. ​ఈ కార్యక్రమంలో జిల్లా మరియు మండల స్థాయి బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆండ్ర శివారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.