Sunday, 3 May 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రూ.358 కోట్ల అభివృద్ధి బాటలో సర్వేపల్లి: పిడూరు–కాగితాలపూరులో త్రీఫేజ్ విద్యుత్ పనుల ప్రారంభం

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి 12( పున్నమి ప్రతినిధి ). సర్వేపల్లినియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మనుబోలు మండలం పిడూరు, కాగితాలపూరులో ఆర్డీఎస్ఎస్ పథకంలో భాగంగా త్రీఫేజ్ విద్యుత్ లైన్లు ప్రారంభించారు. పిడూరులో రూ.1.50 కోట్లు, కాగితాలపూరులో రూ.3.80 కోట్లతో పనులు పూర్తయ్యాయి. కాగితాలపూరులో రూ.32 లక్షలతో పంచాయతీ కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. 18 నెలల్లో రూ.358 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి జరిగిందని తెలిపారు.

విశాఖపట్నం

గాజువాక 87వ వార్డులో సంక్రాంతి ప్రీమియర్ లీగ్–2

గాజువాక జనవరి (పున్నమి ప్రతినిధి) గాజువాక నియోజకవర్గం 87వ వార్డు పరిధిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా సంక్రాంతి ప్రీమియర్ లీగ్–2 క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు,గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు,టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్నాధం పాల్గొని టోర్నమెంట్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడలపై దృష్టి పెట్టాలని సూచించారు.టోర్నమెంట్‌లో పాల్గొన్న క్రీడాకారులు మంచి ప్రతిభ కనబరిచి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.బొండా జగన్నాధం మాట్లాడుతూ సిద్ధార్థ నగర్‌కు ఆనుకుని నాలుగున్నర ఎకరాల్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి జీవీఎంసీ నిధులు మంజూరు చేయించడంలో పల్లా శ్రీనివాసరావు కీలక పాత్ర పోషించారని తెలిపారు.ఇచ్చిన మాట ప్రకారం ఈ సంక్రాంతి సంబరాలను అదే కాంప్లెక్స్‌లో నిర్వహిస్తున్నామని చెప్పారు.ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు విజయరామరాజు,సెక్రటరీ బొట్టా ప్రకాష్,ఇతర నాయకులు,గ్రామస్తులు,క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు ఎంపీడీఓ కార్యాలయంలో సాధారణ సర్వసభ సమావేశం

దుత్తలూరు ఎంపీడీఓ కార్యాలయంలో సాధారణ సర్వ సభ సమావేశం సోమవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ చేజర్ల జయంత్ రెడ్డీ ఎంపీడీఓ చెంచమ్మ పాల్గొన్నారు విద్యుత్ శాఖ ఏఈ ప్రతిసారి నిర్వహించే సాధారణ సమావేశానికి హాజరు కాకపోవడంతో ఎంపీపీతో పాటు పలువురు ఎంపీటీసీ లు,సర్పంచులు ఆయన ఫై చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓను వారు కోరారు అనంతరం మండల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు ఫై సమిక్షిoచారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

1.20 కోట్ల విలువైన లగ్జరి కార్లు స్వాధీనం చేసుకున్న నెల్లూర్ ఎస్పీ

అంత రాష్ట్ర కార్ల దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు నెల్లూర్ ఎస్పీ జి అజిత వెజoడ్ల వెల్లడించారు ఆమె మాట్లాడుతూ నిందితులు ఇతర రాష్ట్రల్లో ల గ్జరీ కార్లను దొంగలించి నకిలీ నెంబర్ ప్లేట్స్, డూప్లికేట్ పత్రాలతో విక్రయిస్తున్నారు వారిని దర్గామిట్ట పోలీసులు అన్నమయ్య సర్కిల్ వద్ద అదుపులోకి తీసుకున్నారు 1.20 కోట్ల విలువైన 2 కార్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.

అనకాపల్లి

సంక్రాంతి పేరుతో కోడిపందాలు వద్దు – చట్టవిరుద్ధ బెట్టింగ్‌లపై కఠిన చర్యలు: ఎలమంచిలి రూరల్ పోలీసులు హెచ్చరిక..!

జనవరి 12, అనకాపల్లి జిల్లా పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్: ఎలమంచిలి రూరల్ సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందాలు, పేకాటలు వంటి చట్టవిరుద్ధ బెట్టింగ్ గేములు నిర్వహించరాదని ఎలమంచిలి రూరల్ పోలీసులు హెచ్చరించారు. రూరల్ ఎస్సై ఉపేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ చందర్రావు పాల్గొన్నారు. “సంక్రాంతి పండగ ముద్దు… కోడిపందాలు వద్దు” అనే నినాదంతో గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. జూదాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు. ప్రజలు శాంతియుతంగా పండుగ జరుపుకోవాలని కోరారు.

ఖమ్మం

బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్యకు పరామర్శించిన బీజేపీ పాలేరు అసెంబ్లీ కంటెస్ట్ ఏం ఎల్ ఏ నున్నా రవికుమార్

ఖమ్మం జనవరి (పున్నమి ప్రతి నిధి) నేలకొండపల్లి మండల బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఉన్నం బ్రహ్మయ్య గారి మాతృమూర్తి ఉన్నం అచ్చమ్మ గారు ఇటీవల స్వర్గస్తులయ్యారని తెలిసిన వెంటనే, భారతీయ జనతా పార్టీ పాలేరు అసెంబ్లీ కంటెస్టడ్ ఏం ఎల్ ఏ నున్నా రవికుమార్ ముజ్జుగూడెం గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా అచ్చమ్మ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం ఉన్నం బ్రహ్మయ్య గారికి, కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేలకొండపల్లి మండల ప్రధాన కార్యదర్శి మల్లబోయిన గోవిందరావు, మైనార్టీ మోర్చా నాయకులు మొహియుద్దీన్, యువ మోర్చా నాయకులు సురేష్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూర్ కలెక్టరేట్ తిక్కన ప్రంగాణంలో గ్రీవెన్స్ డే

నెల్లూర్ కలెక్టరేట్లోని తిక్కన ప్రంగాణంలో గ్రీవెన్స్ డే సోమవారం నిర్వహించారు జాయింట్ కలెక్టర్,వెంకటేశ్వర్లు ఇతర అధికారూలతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు, భూ సమస్యలు, పెన్షన్లు,రేషన్ కార్డులు, ఇతర వ్యక్తిగత సమస్యలు ఫై ప్రజలు వినతలు అందజేశారు వచ్చిన ప్రతీ అర్జీ ని క్షుoన్నగా పరిశీలించి నిర్ణత గడువు లోగ పరిష్కరిస్తామని తెలియజేసారు

ఖమ్మం

ఖమ్మం గిరిజన సమస్యలపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాతోట్ హుస్సేన్ నాయక్‌కు వినతి

ఖమ్మం జనవరి (పున్నమి ప్రతి నిధి) ఖమ్మం జిల్లా బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి భూక్యా శ్యామ్ సుందర్ నాయక్ హైదరాబాద్‌లో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాతోట్ హుస్సేన్ నాయక్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలో గిరిజనులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గిరిజనుల హక్కులు, సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేయాలని కోరుతూ వినతి పత్రం సమర్పించినట్లు శ్యామ్ సుందర్ నాయక్ తెలిపారు.

కామారెడ్డి

మోషంపూర్ పెద్ద చెరువు మిషన్ కాకతీయ నిధులు ఎక్కడా!!

కట్ట మట్టి పోసినా నీళ్లు వృధాగా పోతున్నాయి ప్రజలు ఇబ్బంది! నిధులపై విచారణ చేస్తారా లేదా?!? కామారెడ్డి, 12 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డిజిల్లా, రామారెడ్డి మండలం మోషంపూర్ గ్రామంలోని పెద్ద చెరువు మిషన్ కాకతీయ పథకం కింద బాగా మట్టిపోసినా, కట్టలో చీలికల వల్ల నీళ్లు ఉదకొచ్చి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చిన్న తుమ్ వద్ద నీళ్లు వృధాగా పోతున్నాయి, బతుక మ్మ మెట్లు కట్టలేదు. గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తన్నారు. నీటిపారుదల అధికారికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు రాజేం దర్ ఎక్స్ లిఖించిన లేఖలో, “చెరువు కట్టపై మట్టి పోసారు కానీ, చిన్నతూమ్ వద్ద నీళ్లు ఉదగొచ్చి పోతున్నాయి. బతుకమ్మ మెట్లు కూడా కట్టలేదు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ నిధులు ఎప్పుడు, ఎంత ఖర్చు చేశారు? ఇంకా ఎంత నిధులు మిగిలాయి? వివరాలు రాతపూర్వకంగా ఇవ్వండి” అంటూ మనవి చేశారు. లేఖలో మోషం పూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నా రు. మిషన్ కాకతీయలో చెరువులు బలోపేతం చేస్తామని చెప్పారు. కానీ ఇక్కడ కట్టలో చీలికలు, మెట్లు లేకపోవడంతో వర్షాకాలంలో నీళ్లు వృథా అవుతున్నాయి. వ్యవసాయానికి, తాగునీటికి ఆధారమైన చెరువు ఇలా వదిలిపెట్టడం దారుణం. అధికారులు త్వరగా చర్యలు తీసుకోవాలి.అంటు నీటిపారుదల అధికారులు స్పందించకపోవడంతో, గ్రామస్తులు మండిపడుతున్నారు. మండల అధికా రి కామారెడ్డి ఆఫీసుకు లేఖ ఇచ్చిన రాజేందర్, పూర్తి వివరాలు రాకముందు పనులు పూర్తి చేయా లని డిమాండ్ చేశారు.ఈ సమస్య పరిష్కారం కాకపోతే, గ్రామస్తులు పెద్ద కార్యక్రమం చేస్తామని హెచ్చరిస్తున్నారు. మిషన్ కాకతీయ నిధులు సరి గ్గా ఉపయోగించాలని, ప్రజల ఆవేదనలు తీర్చాల ని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

ఖమ్మం

సంక్రాంతి వేళ ఖమ్మం రోడ్లు నిర్మానుషం.. బస్టాండ్‌లో మాత్రం ప్రయాణికుల కిటకిట

ఖమ్మం జనవరి (పున్నమి ప్రతి నిధి) సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఖమ్మం నగరం నిర్మానుషంగా మారింది. పండుగ కోసం ప్రజలు పెద్ద ఎత్తున సొంత ఊర్లకు వెళ్లడం, విద్యా సంస్థలకు సెలవులు రావడంతో సోమవారం నుంచే ఖమ్మంలోని ప్రధాన రహదారులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సాధారణ రోజుల్లో ట్రాఫిక్‌తో కిటకిటలాడే ప్రాంతాలు ఇప్పుడు నిశ్శబ్దంగా మారాయి. అయితే నగర రహదారులు ఖాళీగా ఉన్నప్పటికీ, ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ మాత్రం భారీగా కొనసాగుతోంది. పండుగ ప్రయాణికుల రద్దీ దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. సంక్రాంతి సమయంలో తెలంగాణలో ముందుగా ఖాళీ అయ్యే నగరంగా హైదరాబాద్ ఉంటే, రెండవ స్థానంలో ఖమ్మం నిలుస్తుందని చెప్పుకోవచ్చు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.