Thursday, 30 April 2026

Blog

E-పేపర్

మరో ఉద్యమంలా నిరసన!* BRS

పున్నమి న్యూస్ ప్రతినిధి 01 ఫిబ్రవరి 2026 తెలంగాణ ఇంచార్జ్: 9640204826 మరో ఉద్యమంలా నిరసన!* తెలంగాణ రాష్ట్ర సాధనకు నాయకత్వం వహించి, తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్రాభివృద్ధికి ఎనలేని సేవలందించిన బీఆర్ఎస్ పార్టీ అధినేత *కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్)* SIT నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలో బైక్ ర్యాలి నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాకు వెళ్లి రోడ్డుపై బైఠాయించి, రాస్తారోకో చేసి, ముఖ్యమంత్రి “రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన” జిల్లా పార్టీ అధ్యక్షులు *మంచిరెడ్డి కిషన్ రెడ్డి* , రాష్ట్ర నాయకు *మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి(బంటి)* , ఇబ్రహీంపట్నం నియోజకవర్గ *బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు*. *అనంతరం ప్రశాంత్ రెడ్డి(బంటన్న) ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు.*

E-పేపర్

మున్సిపల్ ఎన్నికల వేళ బిఎస్పీలో చేరికలు.

*మున్సిపల్ ఎన్నికల వేళ బిఎస్పీలో చేరికలు…* పున్నమి న్యూస్ ప్రతినిధి: 01 ఫిబ్రవరి 2026 తెలంగాణ ఇంచార్జ్ : బహుజన్ సమాజ్ పార్టీ (BSP) తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా ,రాజేంద్ర నగర్ నియోజకవర్గ పరిధిలో , గత పాలకుల పాలన లానే అదే తరహాలో , 24 నెలలు దాటినా ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీనీ సక్రమంగా నెరవేర్చకపోవడంతో ప్రజల్లో కాంగ్రెస్,బి.ఆర్.ఎస్,&బిజెపి పార్టీల పై , తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది., అంతేకాకుండా ఆ పార్టీ నేతలను జనం ప్రశ్నిస్తుండడంతో వారికి సమాధానం చెప్పలేక పోవడంతో, మున్సిపల్ ఎన్నికల వేళ రాజేంద్ర నగర్ నియోజకవర్గ నుండి సుమారుగా 50 మంది నాయకులు నేడు బహుజన్ సమాజ్ పార్టీ లో చేరారు . వీరిని రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాం శేఖర్ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించి ,అభినందనలు తెలిపారు. ఈ చేరిక కొరకై చేవెళ్ల నియోజకవర్గ అధ్యక్షులు తప్ప కృష్ణ గారు కీలక పాత్ర పోషించారు. జై భీమ్…! జై భారత్

హెల్త్ టిప్స్

☘️రోజూ మొలకెత్తిన పెసలు తింటే కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు 🌱

రోజూ మొలకెత్తిన పెసలు (Green Gram Sprouts / మొలకెత్తిన మినపప్పు) తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు సహజంగా అందుతాయి. ఇవి జీర్ణానికి సులభంగా ఉండి, శరీరాన్ని లోపలినుంచి బలపరుస్తాయి. ముఖ్యంగా బలహీనత, అలసట, జీర్ణ సమస్యలు, రక్తహీనత వంటి సమస్యలలో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మొలకెత్తిన పెసల్లో ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్, విటమిన్ C, B-కాంప్లెక్స్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో, రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఇది మంచి ఆహారం. ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరచి, మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ సమస్యలను తగ్గిస్తాయి. అలాగే రక్తహీనత (అనీమియా) ఉన్నవారిలో హిమోగ్లోబిన్ పెంచడంలో తోడ్పడతాయి. మహిళలకు, ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో శక్తిని ఇచ్చే ఆహారంగా ఉపయోగపడతాయి. మొలకెత్తిన పెసలు తినడం వల్ల బరువు నియంత్రణ, చర్మం కాంతివంతంగా మారడం, జుట్టు రాలడం తగ్గడం వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పిల్లలు, పెద్దలు, వృద్ధులు—అందరికీ ఇది ఒక సంపూర్ణ ఆరోగ్యాహారం. 👉 ఎలా తినాలి? ఉదయం ఖాళీ కడుపుతో లేదా బ్రేక్‌ఫాస్ట్‌లో కొద్దిగా నిమ్మరసం వేసి, ఉల్లిపాయ/క్యారెట్‌తో సలాడ్‌లా తినవచ్చు. తేలికగా ఉడికించి కూడా తీసుకోవచ్చు. 🌿 రోజూ చిన్న పరిమాణంలో తీసుకుంటే దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

రాజన్న సిరిసిల్ల

కొండాపూర్ గ్రామంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం

ముస్తాబాద్ /పున్నమి ప్రతినిధి /ఫిబ్రవరి బి.ఆర్.ఎస్ అధినేత కేసీఆర్ గారికి సిట్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో కొండాపూర్ సర్పంచ్ , ఉప సర్పంచ్ మరియు గ్రామ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మని దగ్నం చేయడం జరిగింది ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షుడు నిమ్మదేవి రెడ్డి గారు మరియు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మంద బాల్ రెడ్డి గారు మాట్లాడుతూ కేవలం రాజకీయంగా కేసీఆర్ గారి పై బురద చల్లడానికి మరియు తమ వైఫల్యాలు అన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల దృష్టిని మళ్లించడానికి మాత్రమే ఈ విచారణ విచారణలన్ని ఈరోజు ముందుకు తీసుకొస్తున్నారు అమలు గాని హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలతో ప్రజలను మభ్యపెట్టి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు ఆ ఇచ్చిన హామీలను అమలు చేయడానికి చేతకాక ప్రజల దృష్టినీ వాటి నుండి మళ్ళించడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు రాష్ట్రంలో యూరియా కోసం రైతులు పాడుతున్న తన్నులాట మీకు కనబడడం లేదా ముఖ్యమంత్రి గారు రైతు భరోసా లేదు రైతు బందు లేదు కల్యాణ లక్ష్మి లేదు తులం బంగారం లేదు మీ 6 గ్యారంటీల్లో మీరు అమలు చేసింది ఏందో ఒక్కసారి చెప్పండి అబద్ధపు విచారణలు ఎన్ని నిందలు పెట్టిన భయపడేటోళ్ళం మేము కాదు మా నాయకుడి వెనుక యావత్ తెలంగాణ ప్రజలందరూ ఉన్నారు కచ్చితంగా ఇచ్చిన హామీలను నెరవేర్చదాక ఊరుకునే పరిస్థితి లేవు అబద్ధపు ఆరోపణలు చేస్తే కచ్చితంగా మా బిఆర్ఎస్ శ్రేణుల కూడా ఎప్పటికప్పుడు సింహంలా గర్జిస్తూనే ఉంటాం ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఇటి కార్యక్రమంలో కొండాపూరు బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు

రాజన్న సిరిసిల్ల

సిట్ నోటీసును వ్యతిరేకిస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

సిట్ నోటీసును వ్యతిరేకిస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం ముస్తాబాద్ /పున్నమి ప్రతినిధి /ఫిబ్రవరి మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారి పై కక్ష సాధింపు చర్యతోనే సిట్ నోటీసులు ఇచ్చిందని ఆరోపిస్తూ ముస్తాబాద్ మండలం లోని గూడూరు గ్రామం లో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులపై కక్ష సాధింపులకు పాల్పడుతోందని అందులో భాగంగానే హరీష్ రావు, కేటీఆర్‌కు, కేసీఆర్‌కు ఫోన్ టాపింగ్ కేసులో సీట్ నోటీసులు పంపిస్తుందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్‌ పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. ప్రజలను దృష్టి మళ్లించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతుందని మండిపడ్డారు *ఈ కార్యక్రమం లో BRS పార్టీ సీనియర్ నాయకులు చీటి వెంకటనర్సింగరావు గూడూరు గ్రామ ఉపసర్పంచ్ తాటాకర్ల ప్రభాకర్. 8వ వార్డ్ మెంబర్ పుల్లూరి సంతోష్. కేటీఆర్ సేన ముస్తాబాద్ మండల అధ్యక్షులు వంగూరి దిలీప్ . కేటీఆర్ సేన గ్రామ అధ్యక్షులు చెక్కపెల్లి వెంకటేష్. యూత్ ప్రధాన కార్యదర్శి కోడూరి మనీష్. కేటీఆర్ సేన ఉపాధ్యక్షులు చెరుకు మహేష్. BRS పార్టీ సీనియర్ నాయకులు యూవకులు పాల్గొన్నారు

E-పేపర్

తూర్పుగోదావరి సీతానగరం మండలం తొర్రేడు గ్రామంలో పులి సంచారం

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం పున్నమి ప్రతినిధి సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరి సీతానగరం మండలం తొర్రేడు గ్రామంలో పులి సంచారం కలకలం లేగుతుంది హైస్కూల్ రోడ్ లోని పాత గెస్ట్ హౌస్ లో రెండు దూడలను చంపిన పులి. అక్కడినుంచి మొక్కజొన్న చేల మీదుగా జమ్మలపుంతవైపు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు దీంతో గ్రామస్తులను అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా రాత్రివేళలో చిన్న పిల్లలు బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు అటవీ శాఖ అధికారులు నిఘ పెంచారు END

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నందిపాడు అటవీ ప్రాంతంలో పెద్దపులి కలకలం

దుత్తలూరు 01-2-2026 నందిపాడు, ఫారెస్ట్ బీట్ దుద్దెరుకుంటా పరిసరాల్లోని అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు వెలుగులోకి వచ్చిన వార్త స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. చీపురు పుల్లల సేకరణ కోసం అడవిలోకి వెళ్లిన గ్రామానికి చెందిన లక్ష్మయ్య అనే వ్యక్తికి పులి కనిపించింది అని ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ​ఘటన వివరాలు: ​గ్రామానికి చెందిన లక్ష్మయ్య ఎప్పటిలాగే అడవిలోకి చీపురు పుల్లలు కోయడానికి వెళ్లారు,ఈ సమయం లొ పెద్దపులి కనిపించినట్లు, గ్రామస్థులకు మరియు అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. ​సమాచారం అందిన వెంటనే అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అధికారులు మరియు సిబ్బంది కలిసి అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. ​పులి పాదముద్రల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.అధికారులకు ఎటువంటి ఆనవాళ్లు దొరకకపోవడం తొ, ​పరిసర గ్రామ ప్రజలు అడవిలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ​ముఖ్యంగా పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

తూర్పు గోదావరి

యస్.ఎఫ్.ఐ మరియు విద్యార్ధుల ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కు మద్దతు పలికిన మార్గాని భరత్

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం పున్నమి ప్రతినిధి సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరి రాజమండ్రి శ్రీ *మతి కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల వద్ద యస్.ఎఫ్.ఐ మరియు విద్యార్ధుల ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కు మద్దతు పలికిన మార్గాని భరత్.* .. *విద్యాశాఖకు సంబంధించిన కాలేజీ లో స్థానిక రాజకీయ ప్రమేయం ఏమిటి?* *విద్యార్థులను భయబ్రాంతులు చేయడంలో అంతర్యం ఏమిటి?* *వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు! విద్యార్ధులకు ఆసరాగా వుంటాము – భరత్* *ప్రజా రక్షకులా! ప్రజా భక్షకులా!* రాజమండ్రి నగరానికి తలమానికం అయిన శ్రీ కందుకూరి రాజ్యలక్ష్మి ప్రభుత్వ మహిళా కళాశాలను సంఘసంస్కర్త కందుకూరు వీరేశలింగం పంతులుగారు స్థాపించారు. పేద మధ్య తరగతి విద్యార్ధులకు విద్యను అందించాలన్న మహా సంకల్పంతో స్థాపించిన ఈ సంస్థ ఒకవేళ దీనిని నడిపే స్తోమత హితకారిణి సమాజానికి లేని పక్షంలో ప్రభుత్వానికి అప్పచెప్పేలా అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమానికి మద్దతు తెలిపిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్. ఒకప్పుడు హితకారిణి సమాజం పర్యవేక్షణలో రాజమండ్రిలో ఐదు విద్యాసంస్థలు కలవు, మా జగనన్న ప్రభుత్వ హయాంలో అందులో నాలుగింటిని ప్రభుత్వంలో విలీనం చేశాం ఇప్పుడు ఈ విద్యాసంస్థలన్నీ ప్రభుత్వ ఆధీనంలో నడపబడుచున్నవి, హితకారిణి సమాజం చైర్మన్ గా ఎన్నిక కాబడిన వ్యక్తికి ప్రభుత్వ కళాశాలలో పని ఏమిటి! ఐక్కడ వాళ్ల రాజకీయ పెత్తనం ఏమిటి! కాలేజీలో ఒక వార్డెన్ తీసేసి మరి ఒకరిని నియమించే అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు! ఈ పరిణామాలన్నీ చూస్తూ విద్యాశాఖ ఏం చేస్తుంది, ప్రభుత్వ పరిపాలన అధికారులైన కలెక్టర్ కూడా ఇక్కడే నివాసం ఉంటున్నారు వారు ఏం చేస్తున్నారు కొన్ని వేలమంది విద్యార్థులకు విద్యా అవకాశం ఇచ్చిన ఈ పవిత్రమైన విద్యా దేవాలయానికి రాజకీయ ప్రాబల్యం ఏమిటి, హితకారిణి సమాజానికి మరి ఎన్నో స్థలాలు రాజమండ్రిలో ఉన్నాయి కావాలంటే వాటి మీద పెత్తనం చేయమనండి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కళాశాలలో ఇటువంటి రాజకీయ పెత్తనాలను చూస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు ఈ విషయంపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ నాయకులకు న్యాయం చేయాలని భరత్ కోరారు.. ఎంతో పేరుగాంచిన ఈ విద్యాసంస్థల్లోకి గూండాలను పంపిస్తున్నారంటే స్థానిక ఎమ్మెల్యే ప్రోత్బలం లేకుండా ఇవన్నీ జరగవు కొన్ని కోట్లు ఖరీదు చేసే ఈ విద్యాసంస్థల స్థలాల మీద భూకబ్జాదారులు కన్ను పడటం వాస్తవం, కళాశాల ఆస్తులను కాజేయడానికి చూస్తున్న వారికి, హితకారిణి సమాజం ఎండోమెంట్స్ ఈవో వైఖరిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది జిల్లా కలెక్టర్ లేదా సంబంధిత విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి కళాశాల హాస్టల్ ను కళాశాలకు అప్పగించాలని అలాగే ఎస్ఎఫ్ఐ నాయకులు మరియు విద్యార్థుల పైన ఉన్న పోలీస్ కేసులను తక్షణమే తీసివేయాలని జీవో 42 ప్రకారం విద్యాశాఖకు అప్పచెప్పిన విద్యాసంస్థలను ఆస్తులపైన ఈవో పెత్తనం మానుకోవాలి, విద్యా సంస్థల ఆస్తులను రాజకీయ వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకునే ప్రయత్నం ఆపాలని మార్గాని భరత్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ నాయకులు రిటైర్డ్ లెక్చరర్స్ వందల మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. END

E-పేపర్

యస్.ఎఫ్.ఐ మరియు విద్యార్ధుల ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కు మద్దతు పలికిన మార్గాని భరత్

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం పున్నమి ప్రతినిధి సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరి రాజమండ్రి శ్రీ *మతి కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల వద్ద యస్.ఎఫ్.ఐ మరియు విద్యార్ధుల ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కు మద్దతు పలికిన మార్గాని భరత్.* .. *విద్యాశాఖకు సంబంధించిన కాలేజీ లో స్థానిక రాజకీయ ప్రమేయం ఏమిటి?* *విద్యార్థులను భయబ్రాంతులు చేయడంలో అంతర్యం ఏమిటి?* *వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు! విద్యార్ధులకు ఆసరాగా వుంటాము – భరత్* *ప్రజా రక్షకులా! ప్రజా భక్షకులా!* రాజమండ్రి నగరానికి తలమానికం అయిన శ్రీ కందుకూరి రాజ్యలక్ష్మి ప్రభుత్వ మహిళా కళాశాలను సంఘసంస్కర్త కందుకూరు వీరేశలింగం పంతులుగారు స్థాపించారు. పేద మధ్య తరగతి విద్యార్ధులకు విద్యను అందించాలన్న మహా సంకల్పంతో స్థాపించిన ఈ సంస్థ ఒకవేళ దీనిని నడిపే స్తోమత హితకారిణి సమాజానికి లేని పక్షంలో ప్రభుత్వానికి అప్పచెప్పేలా అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమానికి మద్దతు తెలిపిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్. ఒకప్పుడు హితకారిణి సమాజం పర్యవేక్షణలో రాజమండ్రిలో ఐదు విద్యాసంస్థలు కలవు, మా జగనన్న ప్రభుత్వ హయాంలో అందులో నాలుగింటిని ప్రభుత్వంలో విలీనం చేశాం ఇప్పుడు ఈ విద్యాసంస్థలన్నీ ప్రభుత్వ ఆధీనంలో నడపబడుచున్నవి, హితకారిణి సమాజం చైర్మన్ గా ఎన్నిక కాబడిన వ్యక్తికి ప్రభుత్వ కళాశాలలో పని ఏమిటి! ఐక్కడ వాళ్ల రాజకీయ పెత్తనం ఏమిటి! కాలేజీలో ఒక వార్డెన్ తీసేసి మరి ఒకరిని నియమించే అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు! ఈ పరిణామాలన్నీ చూస్తూ విద్యాశాఖ ఏం చేస్తుంది, ప్రభుత్వ పరిపాలన అధికారులైన కలెక్టర్ కూడా ఇక్కడే నివాసం ఉంటున్నారు వారు ఏం చేస్తున్నారు కొన్ని వేలమంది విద్యార్థులకు విద్యా అవకాశం ఇచ్చిన ఈ పవిత్రమైన విద్యా దేవాలయానికి రాజకీయ ప్రాబల్యం ఏమిటి, హితకారిణి సమాజానికి మరి ఎన్నో స్థలాలు రాజమండ్రిలో ఉన్నాయి కావాలంటే వాటి మీద పెత్తనం చేయమనండి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కళాశాలలో ఇటువంటి రాజకీయ పెత్తనాలను చూస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు ఈ విషయంపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ నాయకులకు న్యాయం చేయాలని భరత్ కోరారు.. ఎంతో పేరుగాంచిన ఈ విద్యాసంస్థల్లోకి గూండాలను పంపిస్తున్నారంటే స్థానిక ఎమ్మెల్యే ప్రోత్బలం లేకుండా ఇవన్నీ జరగవు కొన్ని కోట్లు ఖరీదు చేసే ఈ విద్యాసంస్థల స్థలాల మీద భూకబ్జాదారులు కన్ను పడటం వాస్తవం, కళాశాల ఆస్తులను కాజేయడానికి చూస్తున్న వారికి, హితకారిణి సమాజం ఎండోమెంట్స్ ఈవో వైఖరిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది జిల్లా కలెక్టర్ లేదా సంబంధిత విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి కళాశాల హాస్టల్ ను కళాశాలకు అప్పగించాలని అలాగే ఎస్ఎఫ్ఐ నాయకులు మరియు విద్యార్థుల పైన ఉన్న పోలీస్ కేసులను తక్షణమే తీసివేయాలని జీవో 42 ప్రకారం విద్యాశాఖకు అప్పచెప్పిన విద్యాసంస్థలను ఆస్తులపైన ఈవో పెత్తనం మానుకోవాలి, విద్యా సంస్థల ఆస్తులను రాజకీయ వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకునే ప్రయత్నం ఆపాలని మార్గాని భరత్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ నాయకులు రిటైర్డ్ లెక్చరర్స్ వందల మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. END

కామారెడ్డి

పౌర హక్కుల దినోత్సవం: పోసంపేటలో అవగాహన సదస్సు!

కామారెడ్డి,01 ఫిబ్రవరి,( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం పోసానిపేట్ గ్రామంలో శనివారం పౌరుల హక్కుల రక్షణ గురించి చెప్పుకు న్నారు.పౌరాకుల దినోత్సవం సందర్భంగా, గ్రామ స్థులకు అవగాహన కల్పించే సదస్సు గొప్ప స్థాయి లో జరిగింది. ఎస్ఐ.రాజశేఖర్ మాట్లాడుతూ, పౌర హక్కుల గురించి ప్రజలకు తెలియజేసేందు కు ఈ కార్యక్రమం నిర్వహించా మని తెలిపారు. పౌరుల హక్కుల రక్షణ, బాధ్యతలు, సర్కారు సేవలు, ఫిర్యాదులు ఎలా చేయాలి వంటి అంశాలపై వివరంగా చర్చించారు. గ్రామస్థు లు, మహిళ లు, యువత సమూహంగా పాల్గొని, తమ సందేహా లు వివరించుకున్నారు. ఎస్ఐ సూచ నల మేరకు పౌరులు తమ హక్కులు తెలుసుకుని, అవినీతి, అన్యాయాలకు వ్యతిరేకంగా నిలబడాలని పిలు పునిచ్చారు.ఈ కార్యక్రమం గ్రామంలో పౌర హక్కు ల అవగాహనను మరింత పెంచిందని, భవిష్య త్తులో ఇలాంటి సదస్సులు ఎక్కువగా జరుగుతా యని ఎస్ఐ హామీ ఇచ్చారు. పోసానిపేట్ గ్రామ స్థులు ఈ అవకాశానికి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.