Thursday, 30 April 2026

Blog

తిరుపతి

నో బ్యాగ్ డే తో పిల్లలో ఒత్తిడి దూరం.. ఉపాధ్యాయులు బాలు

తొట్టంబేడు జనవరి 31, పున్నమి న్యూస్ : దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ లో శనివారం నో బ్యాగ్ డే సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు కయ్యూరు బాలసుబ్రమణ్యం సహ కారంతో వివిధ కృత్యాలను చేసారు. అంకెలతో ఇల్లు,తెలుగు అక్షరాలతో చెట్టు, ఆంగ్ల అక్షరరాతో నెమలి, మొదలగు చిత్రాలను తయారు చేసారు. పద్యాలతో పాటలు, కుర్చీలతో ఆటలు ఆడి రోజంతా ఉల్లాసంగా గడిపారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ.. ప్రతి శనివారం విద్యార్థులకు నో బ్యాగ్ డే ఉండటం వలన వారం అంతా అభ్యసన ఒత్తిడి లేకుండా ఆ రోజంతా వారి అభిరుచులకు అనుగుణంగా నైపుణ్యాలను వెలికితీయవచ్చునని, విద్యార్థులకు మానసిక, శారీరక ఆనందానికి ఈ కార్యక్రమం బాగా ఉపయుక్తంగా ఉంటుం దన్నారు.

తిరుపతి

శివయ్య సన్నిధిలో సినీ దర్శకులు

శ్రీకాళహస్తి, జనవరి 31, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనార్ధం సినీ దర్శకులు గోపాల్ రెడ్డి, వారితో పాటు కనిగిరి తెలుగుదేశం పార్టీ నేత నరసారెడ్డి కుటుంబ సమేతంగా విచ్చేశారు. వీరికి ఆలయ అధికారులు సాదరంగా ఆహ్వానించి వారికి రాహు కేతు పూజలు, శ్రీ స్వామి, అమ్మవార్ల ప్రత్యేక దర్శన ఏర్పాట్లు, అనంతరం శ్రీ మేధా గురు దక్షణమూర్తి సన్నిధిలో వేద ఆశీర్వచనం చేయించి ముక్కంటి తీర్ధ ప్రసాదాలు అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

తిరుపతి

ఎన్టీఆర్ భరోసా పించను పంపిణీ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సుప్రజ

శ్రీకాళహస్తి, జనవరి 31, పున్నమి న్యూస్: శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అదేశాల మేరకు శనివారం నాడు పురపాలక సంఘం పరిధిలోని 9 వార్డ్ మాజీ కౌన్సిలర్ ఉన్నం సుప్రజ అధ్వర్యంలో లబ్ది దారులకు వేకువ జామునే పురపాలక సంఘం అధికారులతో కలిసి ఎన్టీఆర్ భరోసా పించను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా అమే మాట్లాడుతూ .. ఒకడవ తారిఖ సెలవు రోజు వస్తే ముందు రోజే లబ్ధి దారులకు పించను డబ్బులు అందించేలా కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని గత పాలకులు నిర్లక్ష్య పాలనతో అభివృద్ధిలో అట్టడుగు స్తాయికి పడిపోయిందని రాష్ట్ర అప్పులు ఊబిలో కురుకు పోవడంతో చంద్రబాబునాయుడు పాలన పగ్గాలు చేపట్టిన తరువాత సూపర్ సిక్స్ హామీలు ఆమలు చేస్తు ముందుకు పోవడం జరుగుతొందన్నారు. ఎన్ని కష్టాలు ఉన్న పించన్ లబ్ధిదారులకు ఇంటి పెద్దగా ప్రతినేల క్రమం తప్పకుండా పించన్ అందించడం జరుగుతోందని ఆమె తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం అధికారులు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు ముందుగానే పించను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

తిరుపతి

ఫిబ్రవరి 4న శ్రీకాళహస్తి విక్రమ్ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా

శ్రీకాళహస్తి, జనవరి 31, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, ఆదేశాల మేరకు ఫిబ్రవరి నెల 04వ తేదీన బుధవారం నాడు శ్రీకాళహస్తి పట్టణంలోని లోని విక్రమ్ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయిమెంట్ ఎక్ఛేంజ్, సీడప్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించబడునని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆర్.లోకనాథం, విక్రమ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పట్టాభిలు సంయుక్తంగా ప్రకటద్వార తెలియజేశారు. ఈ జాబ్ మేళాలో తిరుపతి జిల్లాలోని చదువుకుని ఖాళీగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల కోసం, శ్రీ సిటీ, మేనకూరు సెజ్ , ఈఎంసి క్లస్టర్, తిరుపతి, చెన్నైలోని 12 బహుళ జాతీయ కంపెనీలలో 700 పైగా ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలు చేపట్టననున్నారు. ఈ మేళాలో ఐదవ తరగతి పైన పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లమా లేదా ఏదైనా డిగ్రీలో లేదా పీజీలో ఉత్తీర్ణత అయిన యువతి యువకులు ఈ జాబ్ మేళా కు అర్హులన్నారు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే యువతీ యువకులు క్రింద తెలుపబడిన రిజిస్ట్రేషన్ లింక్ లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవలెను మరిన్ని వివరాలకు క్రింద తెలుపబడిన మొబైల్ నెంబర్లను సంప్రదించగలరని రిజిస్ట్రేషన్ లింకు: https://naipunyam.ap.gov.in/ రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ 3-2-2026, స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా కలదని ఇతర వివరములు కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెం. 8919889609,7989509540,9988853335. (కాల్ సెంటర్) గమనిక: జాబ్ మేళాకు( ఇంటర్వ్యూలకు) హాజరయ్యా యువతి యువకులు పైన ఇచ్చిన రిజిస్ట్రేషన్ లింకులో బిల్డ్ యువర్ రెస్యూమ్(Build Your Resume) పైన క్లిక్ చేసి ఆధార్ ఓటిపి తో ( Registration) రిజిస్ట్రేషన్ చేసుకొని, సిటిజెన్ లాగిన్ ద్వారా మీ ప్రొఫైల్ లాగిన్ అయ్యి ప్రస్తుతం జరిగే జాబ్ మేళా పైన క్లిక్ చేసి అన్ని కంపెనీలకు అప్లై చేసుకుని అడ్మిట్ కార్డుతో ఇంటర్వ్యూలకు హాజరవ్వ వలెనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, తిరుపతి జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి తెలిపారు.

తిరుపతి

ఎంబీఏ ద్వితీయ సెమిస్టర్ లో 92 శాతం ఉత్తీర్ణత సాధించిన SKIIMS కళాశాల

శ్రీకాళహస్తి, జనవరి 31, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి మండలంలోని కాపుగున్నేరి గ్రామ సమీపంలోవున్న శ్రీకాళహస్తీశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్ ( SKIIMS) కళాశాలలో 31-01-2026 న MBA రెండవ సెమిస్టర్ (2024-26 బ్యాచ్) ఫలితాలు విడుదల అయిన సందర్భంగా విజయోత్సవ సభ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మిద్దెల హరి ప్రసంగిస్తూ… జూలై మాసంలో జరిగిన రెండవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు 31 జనవరి 2026 న విడుదల అయ్యాయి, ఇందులో SKIIMS కళాశాల విద్యార్థులు 92% ఉత్తీర్ణత సాధించి, విశ్వవిద్యాలయం స్థాయిలోనే అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన వారిలో ప్రథమ స్థానం మెరుం మమత, ద్వితీయ స్థానం, బొడుగు రజినీ, తృతీయ స్థానంలో జలదంకి లిఖితలు నిలిచారన్నారు. ఇంతటి ఘన విజయానికి కారకులైన అధ్యాపక బృందాన్ని, విద్యార్థులకు కళాశాల కరస్పాండెంట్ తన అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్, హెచ్ ఓ డి లు, అధ్యాపక బృందం, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో ఒక రోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ

శ్రీకాళహస్తి, జనవరి 31, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణంలోని 31 వార్డులో జనసేన నాయకులు జయప్రకాష్ కూటమి నాయకులతో కలసి లబ్దిదారుల ఇంటికే వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతో.. ఫిబ్రవరి 1వ తేది ఆదివారం కావడంతో ప్రభుత్వ నిర్ణయం మేరకు ఒకరోజు ముందుగానే పెన్షన్లు లబ్దిదారులకు అందించడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బందితో పాటు జనసేన నాయకులు జయప్రకాష్, డిల్లీ బాబు, భార్గవ్, తెలుగుదేశం నాయకులు ప్రతాప్, బాబు రెడ్డి, మురళి, మునిరాజ యాదవ్ తదితరులు పాల్గొనడం జరిగింది.

తిరుపతి

జాబ్ పోస్టింగ్

ఉద్యోగ వివరాలు కంపెనీ పేరు: ఆర్వీ డిజిటల్స్ (Aarvi Digitals) ఉద్యోగ స్థలం: మంగళం, ఆర్టీఓ కార్యాలయం ఎదురుగా, తిరుపతి – 517509 ఖాళీలు (మొత్తం 7): అకౌంటెంట్ – 1 కంప్యూటర్ ఆపరేటర్ – 1 రిసెప్షనిస్ట్ – 1 ఆఫీస్ బాయ్ – 1 డిజైనర్ – 2 జీతం: నెలకు ₹12,000 నుండి ₹20,000 వరకు అనుభవం: 1 – 3 సంవత్సరాలు అర్హత: డిగ్రీ లింగం: పురుషులు / మహిళలు షిఫ్ట్: డే షిఫ్ట్ ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే సంప్రదించండి

ఆంధ్రప్రదేశ్

డిప్యూటీ డెమోగా పదోన్నతి పొందిన శివరామరాజు గారికి సన్మానం*

30.01.2026 చుట్టుగుంట విజయవాడ * డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ విజయవాడ నందు దీర్ఘకాలంగా డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా సేవలందించి విధినిర్వహణలో రాష్ట్రస్థాయి ఆరోగ్య కార్యక్రమాలను విజయవంతం చేయడంతో పాటు, ఆగస్టు 15 జనవరి 26 రాష్ట్ర పర్వదినాల్లో వైద్యారోగ్య శాఖ తయారు చేసే శకటాల తయారీలో చేసిన కృషికి గుర్తింపుగా రాష్ట్ర ఉన్నతాధికారుల మన్ననలు పొంది గత నెలలో కడప జోన్ లో డిప్యూటీ డెమోగా పదోన్నతి పొందిన శుభసందర్భంగా రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ పద్మావతి గారి ఛాంబర్ నందు మేడం గారిచే శివరామరాజు డిప్యూటీ డెమో గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అమరావతి రాష్ట్ర అధ్యక్షులు డబ్ల్యూ. వెంకటరమణ, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ చేజర్ల సుధాకర్ రావు, స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ జయ ప్రకాష్, స్టేట్ ట్రెజరర్ నున్న హరిప్రసాద్ గార్లు శాలువా కప్పి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్టేట్ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి గారు మాట్లాడుతూ శివరామరాజు డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా గొప్పగా సేవలు అందించారు అని వారి సేవలు అభినందనీయమని కొనియాడారు.

వనపర్తి

మామిడిమాడ ఉన్నత పాఠశాల కు సీఎం కప్ వాలీబాల్ విన్నర్ టీమ్ కు అభినందనలు

*మామిడిమాడ క్లస్టర్ అండర్ 18 లో సీఎం కప్ విన్నర్ టీంకు అభినందనలు* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 31/01/ 2026* *సీఎం కప్ మామిడి మాడ క్లస్టర్ అండర్ 18 లో ఈరోజు ఘనపూర్ మండలంలో జరిగిన వాలీబాల్ పోటీల లో విన్నర్ గా నిలిచిందని పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ షైనీ జేమ్స్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి చెన్నప్ప గారు మరియు మామిడి మాడ ఉపాధ్యాయ బృందం, సర్పంచ్ బాల్ లింగయ్య మరియు వార్డు మెంబర్లు, విద్యాభిమానులు అందరూ టీం సభ్యులకు అభినందనలు తెలియజేశారు మున్ముందు జిల్లా స్థాయిలో రాష్ట్రస్థాయిలో అనేక బహుమతులు గెలుచుకోవాలని వారు క్రీడాకారులను అభినందనలు తెలియజేశారు*

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.